ETV Bharat / bharat

కరోనాను జయించిన 9 నెలల తర్వాతే టీకా!

author img

By

Published : May 18, 2021, 3:46 PM IST

కొవిడ్​ నుంచి కోలుకున్న 9 నెలల తర్వాత వ్యాక్సిన్​ తొలిడోసు తీసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌(ఎన్​టీఏజీఐ) సిఫార్సు చేసింది. వ్యవధి ఎక్కువగా ఉంటే.. శరీరంలో యాంటీబాడీలు మరింత ఎక్కువగా వృద్ధి చెందుతాయని ఎన్​టీఏజీఐ చెబుతోంది.

govt panel recommends 9 months gap for vaccine after recovery from covid
9 నెలల తర్వాతే టీకా

కరోనా సోకిన వారు వైరస్‌ నుంచి కోలుకున్న తొమ్మిది నెలల తర్వాత టీకా తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని ప్రభుత్వ ప్యానెల్‌.. నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌(ఎన్‌టీఏజీఐ) సిఫార్సు చేస్తోంది. గతంలో ఆరు నెలల వ్యవధి ఉండాలని సూచించిన ఈ ప్యానెల్‌.. ఇప్పుడు దాన్ని తొమ్మిది నెలలకు పెంచింది. తాజా ప్రతిపాదనలను ప్యానెల్‌ కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ఆరోగ్యశాఖ ప్రస్తుత ప్రొటోకాల్‌ ప్రకారం.. కరోనా బారినపడ్డవారు కోలుకున్నాక 4-8 వారాల తర్వాత కొవిడ్‌ టీకా తీసుకోవచ్చు. అయితే ఈ వ్యవధి పెరిగితే శరీరంలో యాంటీబాడీలు మరింత ఎక్కువగా వృద్ధి చెందుతాయని ఎన్‌టీఏజీఐ చెబుతోంది.

''కరోనా సోకి కోలుకున్నవారు తొలి డోసు టీకా కోసం మరింత ఎక్కువ కాలం వేచి ఉంటే మంచిది. తొమ్మిది నెలల తర్వాత టీకా తీసుకున్నట్లయితే అది శరీరంలో ఎక్కువ మొత్తంలో యాంటీబాడీలు వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది.''

- ప్యానెల్​

వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత ఆరు నెలలకు తొలి డోసు టీకా తీసుకుంటే మంచిదని డబ్ల్యూహెచ్​ఓ కూడా చెబుతోంది.

వ్యాక్సినేషన్‌ విధానంపై ఎన్‌టీఏజీఐ ఇటీవల కొన్ని సిఫార్సులు చేసింది.

  • బాలింతలు, గర్భిణీలు టీకా తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
  • మొదటి డోసు తీసుకున్నాక కరోనా బారినపడితే కోలుకున్నాక 4-8 వారాలు వేచి ఉండి, తర్వాత రెండు డోసు వేయించుకోవచ్చని తెలిపింది.
  • ప్లాస్మా చికిత్స చేయించుకున్నవారైతే.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక మూడు నెలలకు వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించింది.
  • ఇక కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచాలని ఈ ప్యానెల్‌ చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది.

ఇదీ చూడండి: కేరళ సీఎం ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు!

కరోనా సోకిన వారు వైరస్‌ నుంచి కోలుకున్న తొమ్మిది నెలల తర్వాత టీకా తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని ప్రభుత్వ ప్యానెల్‌.. నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌(ఎన్‌టీఏజీఐ) సిఫార్సు చేస్తోంది. గతంలో ఆరు నెలల వ్యవధి ఉండాలని సూచించిన ఈ ప్యానెల్‌.. ఇప్పుడు దాన్ని తొమ్మిది నెలలకు పెంచింది. తాజా ప్రతిపాదనలను ప్యానెల్‌ కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ఆరోగ్యశాఖ ప్రస్తుత ప్రొటోకాల్‌ ప్రకారం.. కరోనా బారినపడ్డవారు కోలుకున్నాక 4-8 వారాల తర్వాత కొవిడ్‌ టీకా తీసుకోవచ్చు. అయితే ఈ వ్యవధి పెరిగితే శరీరంలో యాంటీబాడీలు మరింత ఎక్కువగా వృద్ధి చెందుతాయని ఎన్‌టీఏజీఐ చెబుతోంది.

''కరోనా సోకి కోలుకున్నవారు తొలి డోసు టీకా కోసం మరింత ఎక్కువ కాలం వేచి ఉంటే మంచిది. తొమ్మిది నెలల తర్వాత టీకా తీసుకున్నట్లయితే అది శరీరంలో ఎక్కువ మొత్తంలో యాంటీబాడీలు వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది.''

- ప్యానెల్​

వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత ఆరు నెలలకు తొలి డోసు టీకా తీసుకుంటే మంచిదని డబ్ల్యూహెచ్​ఓ కూడా చెబుతోంది.

వ్యాక్సినేషన్‌ విధానంపై ఎన్‌టీఏజీఐ ఇటీవల కొన్ని సిఫార్సులు చేసింది.

  • బాలింతలు, గర్భిణీలు టీకా తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
  • మొదటి డోసు తీసుకున్నాక కరోనా బారినపడితే కోలుకున్నాక 4-8 వారాలు వేచి ఉండి, తర్వాత రెండు డోసు వేయించుకోవచ్చని తెలిపింది.
  • ప్లాస్మా చికిత్స చేయించుకున్నవారైతే.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక మూడు నెలలకు వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించింది.
  • ఇక కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచాలని ఈ ప్యానెల్‌ చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది.

ఇదీ చూడండి: కేరళ సీఎం ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.