ETV Bharat / bharat

అమానవీయం.. బోనులోని చిరుతను సజీవదహనం చేసిన ఊరి జనం

author img

By

Published : May 25, 2022, 2:13 PM IST

Caged leopard burnt alive: బోనులో చిక్కుకున్న చిరుతను గ్రామస్థులు సజీవదహనం చేసిన ఘటన ఉత్తరాఖండ్​లో వెలుగుచూసింది. ఈనెల 15న ఓ మహిళ.. చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయింది. అందుకు ప్రతీకారంగా ఈ దారుణానికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు. మూడు గ్రామాలకు చెందిన 150 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

చిరుత
చిరుత

Caged leopard burnt alive: బోనులో పట్టుబడ్డ చిరుతను సజీవదహనం చేశారు కొందరు ప్రజలు. అటవీశాఖ అధికారుల వారిస్తున్నా వినకుండా వారి ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరాఖండ్​లోని పౌరీ జిల్లా సప్లోరీ గ్రామంలో జరిగింది. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి 150 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు.

ఇదీ జరిగింది..: ఈనెల 15న అడవిలోకి వెళ్లిన సప్లోడీ గ్రామానికి చెందిన ఓ మహిళపై చిరుత దాడి చేసింది. ఈ క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. ఈనెల 24న చిరుత ఆ బోనులో చిక్కింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు చిరుతను నాగదేవ్​ రేంజ్ ఆఫీసుకు తరలిస్తుండగా.. సప్లోడీ సహా సార్నా, కుల్మోరీకు చెందిన 150 మంది వారిని అడ్డుకున్నారు. చిరుత దాడిలో తన మహిశ మృతిచెందడం పట్ల ఆగ్రహంగా ఉన్న గ్రామస్థులు చిరుత ఉన్న బోనుపై పెట్రోల్​ పోసి నిప్పటించారు. ఈ క్రమంలో ఆ చిరుత కాలిపోయి ప్రాణాలు విడిచింది.

Caged leopard burnt alive
కాలిపోయిన చిరుత శవాన్ని పరిశీలిస్తున్న అధికారులు
Caged leopard burnt alive
చిరుత కళేబరాన్ని దహనం చేస్తున్న అధికారులు

ఈ ఘటనపై ఆ సమయంలో అక్కడున్న అధికారి సతీష్​ చంద్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సప్లోడీ సర్పంచ్​ అనిల్​ కుమార్​ సహా దేవేంద్ర, హరి సింగ్​ రావత్, సరితా దేవీ సహా సప్లోడీ, సార్నా, కుల్మోరీ గ్రామాలకు చెందిన 150 మందిపై అధికారులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: స్పైస్​జెట్​పై సైబర్ దాడి.. నిలిచిపోయిన ఫ్లైట్స్​

Caged leopard burnt alive: బోనులో పట్టుబడ్డ చిరుతను సజీవదహనం చేశారు కొందరు ప్రజలు. అటవీశాఖ అధికారుల వారిస్తున్నా వినకుండా వారి ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరాఖండ్​లోని పౌరీ జిల్లా సప్లోరీ గ్రామంలో జరిగింది. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి 150 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు.

ఇదీ జరిగింది..: ఈనెల 15న అడవిలోకి వెళ్లిన సప్లోడీ గ్రామానికి చెందిన ఓ మహిళపై చిరుత దాడి చేసింది. ఈ క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. ఈనెల 24న చిరుత ఆ బోనులో చిక్కింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు చిరుతను నాగదేవ్​ రేంజ్ ఆఫీసుకు తరలిస్తుండగా.. సప్లోడీ సహా సార్నా, కుల్మోరీకు చెందిన 150 మంది వారిని అడ్డుకున్నారు. చిరుత దాడిలో తన మహిశ మృతిచెందడం పట్ల ఆగ్రహంగా ఉన్న గ్రామస్థులు చిరుత ఉన్న బోనుపై పెట్రోల్​ పోసి నిప్పటించారు. ఈ క్రమంలో ఆ చిరుత కాలిపోయి ప్రాణాలు విడిచింది.

Caged leopard burnt alive
కాలిపోయిన చిరుత శవాన్ని పరిశీలిస్తున్న అధికారులు
Caged leopard burnt alive
చిరుత కళేబరాన్ని దహనం చేస్తున్న అధికారులు

ఈ ఘటనపై ఆ సమయంలో అక్కడున్న అధికారి సతీష్​ చంద్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సప్లోడీ సర్పంచ్​ అనిల్​ కుమార్​ సహా దేవేంద్ర, హరి సింగ్​ రావత్, సరితా దేవీ సహా సప్లోడీ, సార్నా, కుల్మోరీ గ్రామాలకు చెందిన 150 మందిపై అధికారులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: స్పైస్​జెట్​పై సైబర్ దాడి.. నిలిచిపోయిన ఫ్లైట్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.