ETV Bharat / bharat

'భారతీయుల ఉపాధిపై గల్ఫ్​ దేశాలతో చర్చలు'

author img

By

Published : Mar 15, 2021, 6:57 PM IST

విదేశాల్లో కరోనా కారణంగా ప్రభావితమైన భారత కార్మికుల ఉపాధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు కేంద్ర మంత్రి జై శంకర్. అందుకోసం ఆయా​ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.

Expect Gulf countries to be helpful in facilitating early return of Indians to work: Jaishankar
'విదేశాలకు తిరిగివెళ్లే వారికోసం గల్ఫ్​ దేశాలతో చర్చలు'

కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో ఉంటున్న కార్మికులు, విద్యార్థుల పరిస్థితిపై ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందన్నారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. కొవిడ్​తో ఉపాధి కోల్పోయి స్వదేశానికి వచ్చిన వారిని గల్ఫ్​ దేశాలు త్వరితగతంగా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటాయనే నమ్మకం ఉందన్నారు. కరోనా విజృంభణ సమయంలో.. వందే భారత్​ మిషన్​ కింద ఇప్పటివరకు 45.82 లక్షల మందిని స్వదేశానికి రప్పించినట్లు తెలిపారు.

పార్లమెంట్​ ఉభయ సభల్లో విదేశాల్లోని భారతీయులు, విద్యార్థుల పరిస్థితిపై ప్రకటన చేశారు జైశంకర్​. విదేశాల నుంచి ముఖ్యంగా గల్ఫ్​ దేశాల నుంచి తిరిగి వచ్చిన వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అలాగే నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేసినట్లు చెప్పారు.

గల్ఫ్​ దేశాల్లో ఉపాధి కోసం తిరిగి వెళ్లాలనుకుంటున్న వారి కోసం.. ఆయా దేశాలతో చర్చలు జరుపుతున్నామన్నా జైశంకర్​. రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: భాజపాకు అమ్మడం తప్ప నిర్మించడం రాదు: రాహుల్​

కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో ఉంటున్న కార్మికులు, విద్యార్థుల పరిస్థితిపై ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందన్నారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. కొవిడ్​తో ఉపాధి కోల్పోయి స్వదేశానికి వచ్చిన వారిని గల్ఫ్​ దేశాలు త్వరితగతంగా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటాయనే నమ్మకం ఉందన్నారు. కరోనా విజృంభణ సమయంలో.. వందే భారత్​ మిషన్​ కింద ఇప్పటివరకు 45.82 లక్షల మందిని స్వదేశానికి రప్పించినట్లు తెలిపారు.

పార్లమెంట్​ ఉభయ సభల్లో విదేశాల్లోని భారతీయులు, విద్యార్థుల పరిస్థితిపై ప్రకటన చేశారు జైశంకర్​. విదేశాల నుంచి ముఖ్యంగా గల్ఫ్​ దేశాల నుంచి తిరిగి వచ్చిన వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అలాగే నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేసినట్లు చెప్పారు.

గల్ఫ్​ దేశాల్లో ఉపాధి కోసం తిరిగి వెళ్లాలనుకుంటున్న వారి కోసం.. ఆయా దేశాలతో చర్చలు జరుపుతున్నామన్నా జైశంకర్​. రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: భాజపాకు అమ్మడం తప్ప నిర్మించడం రాదు: రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.