ETV Bharat / bharat

మోదీతో కెన్యా మాజీ ప్రధాని రైలా భేటీ

author img

By

Published : Feb 14, 2022, 7:26 AM IST

Former Kenya PM praises Ayurveda : భారత్‌లో వ్యక్తిగతంగా పర్యటనలో ఉన్న కెన్యా మాజీ ప్రధానమంత్రి డింగా.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. భారత్‌-కెన్యాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మోదీ ఆయనకు హామీ ఇచ్చారు.

Modi meets ex-Kenyan PM
మోదీతో కెన్యా మాజీ ప్రధాని రైలా భేటీ

Former Kenya PM praises Ayurveda : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా మోలో డింగా ఆదివారం దిల్లీలో సమావేశమయ్యారు. భారత్‌-కెన్యాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మోదీ ఆయనకు హామీ ఇచ్చారు.

ప్రస్తుతం భారత్‌లో వ్యక్తిగతంగా పర్యటిస్తున్న డింగాతో మోదీ భేటీ అయ్యారని, సుమారు మూడున్నర సంవత్సరాల తర్వాత ఆయనతో భేటీ అవడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారని పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌-కెన్యాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సంబంధాలను ఈ సందర్భంగా ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు వెల్లడించింది.

'నా స్నేహితుడు, కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా మోలో డింగాతో భేటీ అవడం సంతోషంగా ఉంది. భారత్‌లో, కెన్యాలో ఆయనతో సమావేశమైన సందర్భాలను నేను మళ్లీ గుర్తు చేసుకున్నాను' అని మోదీ ఓ ట్వీట్‌ చేశారు. 2008 నుంచి 2013 వరకు డింగా కెన్యా ప్రధానమంత్రిగా పనిచేశారు.

మా దేశంలో కూడా ఓ శాఖను ఏర్పాటు చేయండి..

కేరళలోని ఓ ఆసుపత్రి ఆయుర్వేద వైద్యంతో కెన్యా మాజీ ప్రధాని రైలా మోలో డింగా కుమార్తెకు తిరిగి కంటి చూపు వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన కెన్యాలో కూడా ఆ ఆసుపత్రి శాఖను ఏర్పాటు చేసేలా ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్లు తెలిపారు. ఇందుకు మోదీ సానుకూలంగా స్పందిచారని అన్నారు. తన కుమార్తె కేరళలోని శ్రీధరీయం ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ అండ్​ రీసెర్చ్ సెంటర్‌ లో కంటికి సంబంధించిన చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. కేవలం కొద్ది రోజుల్లోనే ఆమెకు కంటి చూపు తిరిగి వచ్చిందని పేర్కొన్నారు. ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:

'అత్యధిక బ్యాంకు మోసాలు మోదీ హయాంలోనే '

Former Kenya PM praises Ayurveda : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా మోలో డింగా ఆదివారం దిల్లీలో సమావేశమయ్యారు. భారత్‌-కెన్యాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మోదీ ఆయనకు హామీ ఇచ్చారు.

ప్రస్తుతం భారత్‌లో వ్యక్తిగతంగా పర్యటిస్తున్న డింగాతో మోదీ భేటీ అయ్యారని, సుమారు మూడున్నర సంవత్సరాల తర్వాత ఆయనతో భేటీ అవడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారని పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌-కెన్యాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సంబంధాలను ఈ సందర్భంగా ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు వెల్లడించింది.

'నా స్నేహితుడు, కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా మోలో డింగాతో భేటీ అవడం సంతోషంగా ఉంది. భారత్‌లో, కెన్యాలో ఆయనతో సమావేశమైన సందర్భాలను నేను మళ్లీ గుర్తు చేసుకున్నాను' అని మోదీ ఓ ట్వీట్‌ చేశారు. 2008 నుంచి 2013 వరకు డింగా కెన్యా ప్రధానమంత్రిగా పనిచేశారు.

మా దేశంలో కూడా ఓ శాఖను ఏర్పాటు చేయండి..

కేరళలోని ఓ ఆసుపత్రి ఆయుర్వేద వైద్యంతో కెన్యా మాజీ ప్రధాని రైలా మోలో డింగా కుమార్తెకు తిరిగి కంటి చూపు వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన కెన్యాలో కూడా ఆ ఆసుపత్రి శాఖను ఏర్పాటు చేసేలా ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్లు తెలిపారు. ఇందుకు మోదీ సానుకూలంగా స్పందిచారని అన్నారు. తన కుమార్తె కేరళలోని శ్రీధరీయం ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ అండ్​ రీసెర్చ్ సెంటర్‌ లో కంటికి సంబంధించిన చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. కేవలం కొద్ది రోజుల్లోనే ఆమెకు కంటి చూపు తిరిగి వచ్చిందని పేర్కొన్నారు. ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:

'అత్యధిక బ్యాంకు మోసాలు మోదీ హయాంలోనే '

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.