ETV Bharat / bharat

'ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నుంచి వారిని రక్షించాలి'

భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి సహా కరోనా మహమ్మారి నుంచి వైద్యులకు రక్షణ కావాలని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ పేర్కొన్నారు. మరోవైపు.. బ్లాక్​ ఫంగస్​ చికిత్సకు కావాల్సిన మందులు, ఇంజెక్షన్లను ప్రజలకు ఉచితంగా అందజేయాలని ప్రధాని మోదీని కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కోరారు.

author img

By

Published : Jun 4, 2021, 6:08 PM IST

Rahul Gandhi, congress
రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రస్తుత కొవిడ్​ విజృంభణ వేళ.. వైద్యులకు కరోనా మహమ్మారితో పాటు భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి నుంచి రక్షణ కావాలని ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు.

"వైద్యులకు కరోనా వైరస్​తోపాటు భాజపా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి నుంచి రక్షణ కావాలి. ప్రాణదాతలను రక్షించాలి."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

వ్యాక్సిన్లపై అన్ని రాష్ట్రాలు తమ గళాన్ని వినిపించాలన్న ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్​ నేత జైరాం రమేష్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"నేను జగన్​ మోహన్​రెడ్డిని ఈ ప్రశ్నలు అడగుతున్నాను. వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర వర్సెస్​ రాష్ట్రం అనే పరిస్థితిని తీసుకువచ్చింది ఎవరు? 18 నుంచి 44 ఏళ్ల వారికి కేంద్రం టీకా పంపిణీ చేయలేదని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది ఎవరు? ఈ విధానాన్ని తీసుకువచ్చేముందు రాష్ట్రాలను ఎందుకు సంప్రదించలేదు? ఈ ప్రశ్నలన్నింటినీ మీరు మోదీని ఎందుకు అడగరు?"

- జైరాం రమేశ్​, కాంగ్రెస్ సీనియర్ నేత

వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం వర్సెస్​​ రాష్ట్రాలుగా తయారైందని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ గళాన్ని వినిపించాలని అన్నారు. అయితే.. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వేలెత్తి చూపుతూ రాజకీయాలు చేయొద్దని పేర్కొన్నారు.

'ఉచితంగా అందజేయండి'

దేశంలో మ్యూకర్​మైకోసిస్​(బ్లాక్​ఫంగస్​) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ వ్యాధి చికిత్సలో అవసరమయ్యే మందులు, ఇంజెక్షన్లను ఉచితంగా ప్రజలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కోరారు. రాష్ట్రాలవారీగా ఈ వ్యాధి బారిన పడ్డవారి సంఖ్యను బహిరంగంగా ఉంచాలని కోరారు.

ఇదీ చూడండి: ఆ రోజులు పోయాయ్​: ప్రధాని మోదీ

ఇదీ చూడండి: కొవిడ్ రెండో దశ విజృంభణకు కారణమిదే..!

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రస్తుత కొవిడ్​ విజృంభణ వేళ.. వైద్యులకు కరోనా మహమ్మారితో పాటు భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి నుంచి రక్షణ కావాలని ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు.

"వైద్యులకు కరోనా వైరస్​తోపాటు భాజపా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి నుంచి రక్షణ కావాలి. ప్రాణదాతలను రక్షించాలి."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

వ్యాక్సిన్లపై అన్ని రాష్ట్రాలు తమ గళాన్ని వినిపించాలన్న ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్​ నేత జైరాం రమేష్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"నేను జగన్​ మోహన్​రెడ్డిని ఈ ప్రశ్నలు అడగుతున్నాను. వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర వర్సెస్​ రాష్ట్రం అనే పరిస్థితిని తీసుకువచ్చింది ఎవరు? 18 నుంచి 44 ఏళ్ల వారికి కేంద్రం టీకా పంపిణీ చేయలేదని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది ఎవరు? ఈ విధానాన్ని తీసుకువచ్చేముందు రాష్ట్రాలను ఎందుకు సంప్రదించలేదు? ఈ ప్రశ్నలన్నింటినీ మీరు మోదీని ఎందుకు అడగరు?"

- జైరాం రమేశ్​, కాంగ్రెస్ సీనియర్ నేత

వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం వర్సెస్​​ రాష్ట్రాలుగా తయారైందని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ గళాన్ని వినిపించాలని అన్నారు. అయితే.. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వేలెత్తి చూపుతూ రాజకీయాలు చేయొద్దని పేర్కొన్నారు.

'ఉచితంగా అందజేయండి'

దేశంలో మ్యూకర్​మైకోసిస్​(బ్లాక్​ఫంగస్​) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ వ్యాధి చికిత్సలో అవసరమయ్యే మందులు, ఇంజెక్షన్లను ఉచితంగా ప్రజలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కోరారు. రాష్ట్రాలవారీగా ఈ వ్యాధి బారిన పడ్డవారి సంఖ్యను బహిరంగంగా ఉంచాలని కోరారు.

ఇదీ చూడండి: ఆ రోజులు పోయాయ్​: ప్రధాని మోదీ

ఇదీ చూడండి: కొవిడ్ రెండో దశ విజృంభణకు కారణమిదే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.