ETV Bharat / bharat

కరోనాతోనే జన్మించిన శిశువు- తల్లికి నెగెటివ్

author img

By

Published : May 27, 2021, 9:12 PM IST

తల్లికి కరోనా లేకున్నా.. పుట్టిన బిడ్డకు వైరస్ పాజిటివ్​గా తేలింది. జన్మించిన వెంటనే బిడ్డకు ఆర్​టీ-పీసీఆర్ టెస్టు చేయగా.. వైరస్ నిర్ధరణ అయింది. ఇదో అరుదైన ఘటన అని, ఇరువురికి మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.

Healthy woman gives birth to Covid positive baby in Varanasi
కరోనాతోనే జన్మించిన శిశువు- తల్లికి నెగెటివ్

ఉత్తర్​ప్రదేశ్ వారణాసికి చెందిన ఓ మహిళ కొవిడ్(COVID) సోకిన బిడ్డకు జన్మనిచ్చింది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్​లో మే 24న ఆ మహిళ చేరింది. కరోనా టెస్టు(Covid test)లో ఆమెకు నెగెటివ్​(negative)గా తేలింది. అయితే, మహిళకు పుట్టిన శిశువుకు మే 26న ఆర్​టీ-పీసీఆర్ పరీక్ష(RT-PCR test) నిర్వహించగా.. పాజిటివ్ అని వెల్లడైంది.

సాధారణంగా శిశువులకు తల్లుల నుంచే కరోనా సోకే ప్రమాదం ఉంటుందని, అయితే ఇది మాత్రం అరుదైన కేసు అని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కేకే గుప్తా తెలిపారు. తల్లీబిడ్డలిద్దరికీ మరోసారి ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇరువురి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు.

ఉత్తర్​ప్రదేశ్ వారణాసికి చెందిన ఓ మహిళ కొవిడ్(COVID) సోకిన బిడ్డకు జన్మనిచ్చింది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్​లో మే 24న ఆ మహిళ చేరింది. కరోనా టెస్టు(Covid test)లో ఆమెకు నెగెటివ్​(negative)గా తేలింది. అయితే, మహిళకు పుట్టిన శిశువుకు మే 26న ఆర్​టీ-పీసీఆర్ పరీక్ష(RT-PCR test) నిర్వహించగా.. పాజిటివ్ అని వెల్లడైంది.

సాధారణంగా శిశువులకు తల్లుల నుంచే కరోనా సోకే ప్రమాదం ఉంటుందని, అయితే ఇది మాత్రం అరుదైన కేసు అని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కేకే గుప్తా తెలిపారు. తల్లీబిడ్డలిద్దరికీ మరోసారి ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇరువురి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి- Covid-19: కరోనా చేసిన ఘోరం- బిడ్డలకు తల్లి లాలన దూరం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.