కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ శుక్రవారం అన్ని రాష్ట్రాల్లోని రాజ్భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 'కిసాన్ అధికార్ దివాస్' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
దిల్లీలోని రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.