ETV Bharat / bharat

లోక్​సభను సోమవారానికి వాయిదా వేసిన స్పీకర్​

author img

By

Published : Feb 5, 2021, 9:15 AM IST

Updated : Feb 5, 2021, 6:42 PM IST

Delhi: Proceedings of Rajya Sabha begin. #BudgetSession2021
లైవ్ అప్​డేట్స్​​: రాజ్యసభ సమావేశాలు

18:14 February 05

వ్యవసాయ చట్టాల రద్దుకు పట్టుబడుతూ విపక్షాలు చేసిన ఆందోళనలతో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కాగానే సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు.

దీంతో జీరో అవర్ కొనసాగించాలని  స్పీకర్‌ ఓంబిర్లా విజ్ఞప్తి చేసినా ప్రతిపక్షాలు వినలేదు. విపక్షాల నినాదాల మధ్యే  కరోనా టీకాపై అనుబంధ ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ సమాధానం ఇచ్చారు.  

పలువురు సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు. వెనక్కి వెళ్లాలని స్పీకర్‌ ఓంబిర్లా పదే పదే సూచించినా.. సభ్యులు నిరసనలు కొనసాగించడంతో సభను స్పీకర్‌ సాయంత్రం ఆరు గంటలకు వాయిదా వేశారు. మళ్లీ సభ ప్రారంభంకాగానే.. విపక్ష నేతలు ఆందోళన కొనసాగించారు.

కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే సభ్యులు సాగు చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.  ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో సభను స్పీకర్‌ సోమవారానికి వాయిదా వేశారు.

16:21 February 05

సాయంత్రం 6గంటలకు లోక్​సభ వాయిదా  

నాలుగోరోజు కూడా లోక్​సభలో వాయిదా పర్వం కొనసాగింది. సాగు చట్టాలను రద్దు చేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించాలని సభ్యులకు స్పీకర్​ విజ్ఞప్తి చేశారు. కరోనాకు సంబంధించి అనేక ప్రశ్నలు పెండింగ్​లో ఉన్నాయని, సహకరించాలని కోరారు. అయితే స్పీకర్​ విజ్ఞప్తిని పట్టించుకోని విపక్షాలు.. నిరసన కొనసాగించాయి. మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని నినాదాలు చేశాయి. సభ్యులు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో స్పీకర్​ సభను వాయిదా వేశారు.

16:03 February 05

మోదీ ఛాంబర్‌లో కేంద్రమంత్రుల భేటీ  

సాయంత్రం నాలుగు గంటలకు లోక్​సభ ప్రారంభమైంది. అయితే సమావేశానికి ముందు ప్రధాని మోదీ ఛాంబర్‌లో కేంద్రమంత్రుల భేటీ జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రహ్లాద్ జోషి, జావడేకర్‌ తదితరులు హాజరయ్యారు.  

13:03 February 05

రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: తోమర్

  • కనీస మద్దతు ధర ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాం: తోమర్‌
  • ఉత్పత్తి వ్యయం కంటే 50 శాతం ఎక్కువగా మద్దతు ధర: తోమర్‌
  • సాగు మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష కోట్లు ఇచ్చాం: తోమర్‌
  • ఆత్మనిర్భర్‌ భారత్ ప్యాకేజీ ద్వారా రూ.లక్ష కోట్లు ఇచ్చాం: తోమర్‌
  • సాగురంగంలో పెట్టుబడులు పెంచేందుకు యత్నించాం: తోమర్‌
  • సాగు చట్టాల సవరణకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించాం: తోమర్‌
  • సవరణకు సిద్ధం అంటే చట్టాల్లో సమస్య ఉందని కాదు: తోమర్‌
  • ఒక రాష్ట్రానికి చెందిన రైతులు అపార్థం చేసుకున్నారు: తోమర్‌
  • సాగుచట్టాల విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు: తోమర్‌
  • భూములు ఆక్రమణకు గురవుతాయని రైతులు భయపడ్డారు: తోమర్‌
  • భూఆక్రమణకు అవకాశమిచ్చే ఒక్క నిబంధన కూడా చట్టంలో లేదు: తోమర్‌
  • రైతుల జీవితాలను మార్చాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం: తోమర్
  • రైళ్లలో పండ్లు, కూరగాయల రవాణాను ఎవరైనా ఊహించారా?: తోమర్
  • ఇప్పటికే 100 కిసాన్ రైళ్లను అందుబాటులోకి తెచ్చాం: తోమర్
  • రైతుల ఆదాయం రెట్టింపు చేసి జీడీపీని పెంచాలన్నదే లక్ష్యం: తోమర్
  • జీడీపీ వృద్ధిలో సాగు చట్టాల అమలు కీలకం కాబోతోంది: తోమర్
  • రైతుల సంక్షేమానికి మోదీ కట్టుబడి ఉన్నారు: తోమర్

12:18 February 05

  • గ్రామాలు అభివృద్ధి చెందాలన్నదే మోదీ ప్రభుత్వం లక్ష్యం: తోమర్
  • ప్రభుత్వ నిధులు గ్రామాలకు చేరితేనే అభివృద్ధి సాధ్యం: తోమర్
  • పంచాయతీలకు పెద్దఎత్తున నిధులు అందిస్తున్నాం: తోమర్
  • రూ.2.36 లక్షల కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు: తోమర్
  • 15వ ఆర్థిక సంఘం సిఫార్సును కేంద్రం ఆమోదించింది: తోమర్
  • గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కోసం రూ.43 వేల కోట్లు: తోమర్
  • ఐదేళ్లలో పంచాయతీలపై రూ.2.8 లక్షల కోట్లు ఖర్చుచేస్తాం: తోమర్
  • రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: తోమర్
  • సాంకేతికతతో ఉపాధి హామీ పథకంలో పారదర్శకత: తోమర్
  • ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అనేక పనులు: తోమర్
  • గరీభ్ కల్యాణ్ యోజన్ ద్వారా ఉపాధి కల్పిస్తున్నాం: తోమర్

11:54 February 05

వారు దేశ వ్యతిరేకులా..?

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. 'రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ఇప్పుడు రైతులు.. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారందరినీ కేంద్రం దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తోంది. గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని అవమానించడంపై యావత్ దేశం విచారం వ్యక్తం చేస్తోంది. అయితే ఆ ఘటనకు కారణమైన వారిని వదిలేసి రైతులను అరెస్టు చేయడం సరికాదు. జాతీయ జెండాను అవమానించిన దీప్‌ సిద్ధూ ఎక్కడ? ప్రభుత్వం ఆయనను ఎందుకు పట్టుకోలేకపోతోంది? రైతుల ఆందోళనపై దుష్ప్రచారం చేయడం సరికాదు' అని కేంద్రంపై మండిపడ్డారు. 

09:55 February 05

ఇది మానవ హక్కుల ఉల్లంఘనే..

దిల్లీలో రైతు ఆందోళనలు అణచివేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని రాజ్యసభలో ఆరోపించారు బీఎస్​పీ ఎంపీ సతీశ్​ మిశ్రా. వారికి నీళ్లు, విద్యుత్​ను అందకుండా చేశారని విమర్శించారు. మహిళలు ఉన్నారని కూడా చూడకుండా.. టాయిలెట్లనూ తొలగించారని అన్నారు. ఇది కూడా మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అన్నారు. 

రైతుల నిరసన స్థలాల వద్ద రోడ్లపై మేకులు కొట్టారని, అన్నదాతలను శత్రువులుగా చూస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. స్వార్థాన్ని వీడి.. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. పాక్​, చైనా సరిహద్దుల్లో కాకుండా.. దిల్లీ రోడ్లపై మేకులు బిగించడమేంటని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

09:48 February 05

రాష్ట్రపతి ప్రసంగంపైనే..

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగనున్నట్లు వెల్లడించారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు. 

09:29 February 05

భాజపా ఎంపీలకు విప్​ జారీ..

తమ రాజ్యసభ ఎంపీలకు విప్​ జారీ చేసింది భారతీయ జనతా పార్టీ(భాజపా). ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా ఫిబ్రవరి 8- 12 మధ్య తప్పనిసరిగా బడ్జెట్​ సమావేశాలకు హాజరుకావాలని స్పష్టం చేసింది.  

09:02 February 05

లైవ్ అప్​డేట్స్​​: రాజ్యసభ సమావేశాలు

రాజ్యసభ సమావేశాలు ప్రారంభం..

రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం రోజు.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండో రోజు చర్చ చేపట్టగా, సాగు చట్టాలపై రాజ్యసభలో అధికార విపక్ష నేతల మధ్య సంవాదం కొనసాగింది. జైకిసాన్‌ జైజవాన్ మన నినాదమన్న విపక్ష నేతలు.. విదేశీయులను కూడా దేశరాజధానిలోకి రానిస్తున్న మనం.. మన అన్నదాతలను రాకుండా రోడ్లపై మేకులు కొట్టి బారికేడ్లు పెట్టి అడ్డుకోవడం ఏంటని ఆర్‌జేడీ నేత మనోజ్‌కుమార్ ఝా ప్రశ్నించారు. రైతుల శ్రేయస్సుకు నరేంద్రమోదీ సర్కారు కట్టుబడి ఉందన్న భాజపా ఎంపీ జ్యోతిరాధిత్య సింథియా.. నాడు చట్టాల్లో మార్పులు కోరున్న కాంగ్రెస్, ఎన్‌సీపీ ఇప్పుడు అడ్డుపడడం ఏంటని నిలదీశారు. రైతుల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సభలో సభ్యుల సంవాదాలతో సమావేశాలు వాడీవేడీగా కొనసాగాయి.  

18:14 February 05

వ్యవసాయ చట్టాల రద్దుకు పట్టుబడుతూ విపక్షాలు చేసిన ఆందోళనలతో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కాగానే సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు.

దీంతో జీరో అవర్ కొనసాగించాలని  స్పీకర్‌ ఓంబిర్లా విజ్ఞప్తి చేసినా ప్రతిపక్షాలు వినలేదు. విపక్షాల నినాదాల మధ్యే  కరోనా టీకాపై అనుబంధ ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ సమాధానం ఇచ్చారు.  

పలువురు సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు. వెనక్కి వెళ్లాలని స్పీకర్‌ ఓంబిర్లా పదే పదే సూచించినా.. సభ్యులు నిరసనలు కొనసాగించడంతో సభను స్పీకర్‌ సాయంత్రం ఆరు గంటలకు వాయిదా వేశారు. మళ్లీ సభ ప్రారంభంకాగానే.. విపక్ష నేతలు ఆందోళన కొనసాగించారు.

కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే సభ్యులు సాగు చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.  ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో సభను స్పీకర్‌ సోమవారానికి వాయిదా వేశారు.

16:21 February 05

సాయంత్రం 6గంటలకు లోక్​సభ వాయిదా  

నాలుగోరోజు కూడా లోక్​సభలో వాయిదా పర్వం కొనసాగింది. సాగు చట్టాలను రద్దు చేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించాలని సభ్యులకు స్పీకర్​ విజ్ఞప్తి చేశారు. కరోనాకు సంబంధించి అనేక ప్రశ్నలు పెండింగ్​లో ఉన్నాయని, సహకరించాలని కోరారు. అయితే స్పీకర్​ విజ్ఞప్తిని పట్టించుకోని విపక్షాలు.. నిరసన కొనసాగించాయి. మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని నినాదాలు చేశాయి. సభ్యులు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో స్పీకర్​ సభను వాయిదా వేశారు.

16:03 February 05

మోదీ ఛాంబర్‌లో కేంద్రమంత్రుల భేటీ  

సాయంత్రం నాలుగు గంటలకు లోక్​సభ ప్రారంభమైంది. అయితే సమావేశానికి ముందు ప్రధాని మోదీ ఛాంబర్‌లో కేంద్రమంత్రుల భేటీ జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రహ్లాద్ జోషి, జావడేకర్‌ తదితరులు హాజరయ్యారు.  

13:03 February 05

రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: తోమర్

  • కనీస మద్దతు ధర ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాం: తోమర్‌
  • ఉత్పత్తి వ్యయం కంటే 50 శాతం ఎక్కువగా మద్దతు ధర: తోమర్‌
  • సాగు మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష కోట్లు ఇచ్చాం: తోమర్‌
  • ఆత్మనిర్భర్‌ భారత్ ప్యాకేజీ ద్వారా రూ.లక్ష కోట్లు ఇచ్చాం: తోమర్‌
  • సాగురంగంలో పెట్టుబడులు పెంచేందుకు యత్నించాం: తోమర్‌
  • సాగు చట్టాల సవరణకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించాం: తోమర్‌
  • సవరణకు సిద్ధం అంటే చట్టాల్లో సమస్య ఉందని కాదు: తోమర్‌
  • ఒక రాష్ట్రానికి చెందిన రైతులు అపార్థం చేసుకున్నారు: తోమర్‌
  • సాగుచట్టాల విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు: తోమర్‌
  • భూములు ఆక్రమణకు గురవుతాయని రైతులు భయపడ్డారు: తోమర్‌
  • భూఆక్రమణకు అవకాశమిచ్చే ఒక్క నిబంధన కూడా చట్టంలో లేదు: తోమర్‌
  • రైతుల జీవితాలను మార్చాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం: తోమర్
  • రైళ్లలో పండ్లు, కూరగాయల రవాణాను ఎవరైనా ఊహించారా?: తోమర్
  • ఇప్పటికే 100 కిసాన్ రైళ్లను అందుబాటులోకి తెచ్చాం: తోమర్
  • రైతుల ఆదాయం రెట్టింపు చేసి జీడీపీని పెంచాలన్నదే లక్ష్యం: తోమర్
  • జీడీపీ వృద్ధిలో సాగు చట్టాల అమలు కీలకం కాబోతోంది: తోమర్
  • రైతుల సంక్షేమానికి మోదీ కట్టుబడి ఉన్నారు: తోమర్

12:18 February 05

  • గ్రామాలు అభివృద్ధి చెందాలన్నదే మోదీ ప్రభుత్వం లక్ష్యం: తోమర్
  • ప్రభుత్వ నిధులు గ్రామాలకు చేరితేనే అభివృద్ధి సాధ్యం: తోమర్
  • పంచాయతీలకు పెద్దఎత్తున నిధులు అందిస్తున్నాం: తోమర్
  • రూ.2.36 లక్షల కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు: తోమర్
  • 15వ ఆర్థిక సంఘం సిఫార్సును కేంద్రం ఆమోదించింది: తోమర్
  • గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కోసం రూ.43 వేల కోట్లు: తోమర్
  • ఐదేళ్లలో పంచాయతీలపై రూ.2.8 లక్షల కోట్లు ఖర్చుచేస్తాం: తోమర్
  • రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: తోమర్
  • సాంకేతికతతో ఉపాధి హామీ పథకంలో పారదర్శకత: తోమర్
  • ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అనేక పనులు: తోమర్
  • గరీభ్ కల్యాణ్ యోజన్ ద్వారా ఉపాధి కల్పిస్తున్నాం: తోమర్

11:54 February 05

వారు దేశ వ్యతిరేకులా..?

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. 'రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ఇప్పుడు రైతులు.. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారందరినీ కేంద్రం దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తోంది. గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని అవమానించడంపై యావత్ దేశం విచారం వ్యక్తం చేస్తోంది. అయితే ఆ ఘటనకు కారణమైన వారిని వదిలేసి రైతులను అరెస్టు చేయడం సరికాదు. జాతీయ జెండాను అవమానించిన దీప్‌ సిద్ధూ ఎక్కడ? ప్రభుత్వం ఆయనను ఎందుకు పట్టుకోలేకపోతోంది? రైతుల ఆందోళనపై దుష్ప్రచారం చేయడం సరికాదు' అని కేంద్రంపై మండిపడ్డారు. 

09:55 February 05

ఇది మానవ హక్కుల ఉల్లంఘనే..

దిల్లీలో రైతు ఆందోళనలు అణచివేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని రాజ్యసభలో ఆరోపించారు బీఎస్​పీ ఎంపీ సతీశ్​ మిశ్రా. వారికి నీళ్లు, విద్యుత్​ను అందకుండా చేశారని విమర్శించారు. మహిళలు ఉన్నారని కూడా చూడకుండా.. టాయిలెట్లనూ తొలగించారని అన్నారు. ఇది కూడా మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అన్నారు. 

రైతుల నిరసన స్థలాల వద్ద రోడ్లపై మేకులు కొట్టారని, అన్నదాతలను శత్రువులుగా చూస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. స్వార్థాన్ని వీడి.. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. పాక్​, చైనా సరిహద్దుల్లో కాకుండా.. దిల్లీ రోడ్లపై మేకులు బిగించడమేంటని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

09:48 February 05

రాష్ట్రపతి ప్రసంగంపైనే..

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగనున్నట్లు వెల్లడించారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు. 

09:29 February 05

భాజపా ఎంపీలకు విప్​ జారీ..

తమ రాజ్యసభ ఎంపీలకు విప్​ జారీ చేసింది భారతీయ జనతా పార్టీ(భాజపా). ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా ఫిబ్రవరి 8- 12 మధ్య తప్పనిసరిగా బడ్జెట్​ సమావేశాలకు హాజరుకావాలని స్పష్టం చేసింది.  

09:02 February 05

లైవ్ అప్​డేట్స్​​: రాజ్యసభ సమావేశాలు

రాజ్యసభ సమావేశాలు ప్రారంభం..

రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం రోజు.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండో రోజు చర్చ చేపట్టగా, సాగు చట్టాలపై రాజ్యసభలో అధికార విపక్ష నేతల మధ్య సంవాదం కొనసాగింది. జైకిసాన్‌ జైజవాన్ మన నినాదమన్న విపక్ష నేతలు.. విదేశీయులను కూడా దేశరాజధానిలోకి రానిస్తున్న మనం.. మన అన్నదాతలను రాకుండా రోడ్లపై మేకులు కొట్టి బారికేడ్లు పెట్టి అడ్డుకోవడం ఏంటని ఆర్‌జేడీ నేత మనోజ్‌కుమార్ ఝా ప్రశ్నించారు. రైతుల శ్రేయస్సుకు నరేంద్రమోదీ సర్కారు కట్టుబడి ఉందన్న భాజపా ఎంపీ జ్యోతిరాధిత్య సింథియా.. నాడు చట్టాల్లో మార్పులు కోరున్న కాంగ్రెస్, ఎన్‌సీపీ ఇప్పుడు అడ్డుపడడం ఏంటని నిలదీశారు. రైతుల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సభలో సభ్యుల సంవాదాలతో సమావేశాలు వాడీవేడీగా కొనసాగాయి.  

Last Updated : Feb 5, 2021, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.