ETV Bharat / bharat

'కరోనా 2.0.. గంగా నదిలో 300కుపైగా మృతదేహాలు'

author img

By

Published : Dec 24, 2021, 2:20 PM IST

River Ganga Corona virus dead bodies: కొవిడ్​ రెండో దశ వేళ.. పవిత్ర గంగానదిలో 300కుపైగా మృతదేహాలు కొట్టుకొచ్చాయని ఎన్​ఎమ్​సీజీ డైరక్టర్​ జనరల్​ రాజీవ్​ రంజన్​ మిశ్రా తెలిపారు. కరోనా మృతదేహాలను ఖననం చేయడంపై సరైన అవగాహన లేనందున కొందరు మృతదేహాలను గంగానదిలో పడేశారని పేర్కొన్నారు. మరికొందరు.. కొవిడ్​ చికిత్స కోసం డబ్బులు ఖర్చు పెట్టి, అంత్యక్రియలకు నిధులు లేకపోవడం వల్ల గంగానదిలో మృతదేహాలను పడేశారని తెలిపారు. ఈ విషయాలను ఇటీవల విడుదలైన పుస్తకంలో మిశ్రా రాసుకొచ్చారు.

corona dead bodies in ganga
'కరోనా 2.0.. గంగా నదిలో 300లకుపైగా మృతదేహాలు'

Corona dead bodies in Ganga: కరోనా 2.0 సమయంలో దేశం ఎదుర్కొన్న గడ్డుపరిస్థితులను భారతీయులు ఎన్నటికీ మర్చిపోలేరు. ఓవైపు చికిత్స కోసం ఆసుపత్రుల్లో పడకలు దొరకక ఇబ్బంది పడగా.. మరోవైపు కొవిడ్​తో మరణించిన వారి మృతదేహాలకు అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు ప్రజలు. ముఖ్యంగా గంగానదిలో మృతదేహాలు తేలడం ప్రజలను కలచివేసింది. గంగా నదికి, దేశానికి పట్టిన దీన స్థితితో కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు తాజాగా విడుదలైన ఓ పుస్తకం ద్వారా వెలుగులోకి వచ్చాయి.

'గంగా: రీఇమాజినింగ్​, రిజువనేటింగ్​, రీకనెక్టింగ్​' పుస్తకాన్ని.. ఎన్​ఎమ్​సీజీ(నేషనల్​ మిషన్​ ఫర్​ క్లీన్​ గంగ) డైరక్టర్​ జనరల్​ రాజీవ్​ రంజన్​ మిశ్రా రచించారు. కొవిడ్​ రెండో దశ సమయంలో వైరస్​​తో మరణించిన దాదాపు 300మంది మృతదేహాలను గంగా నదిలో పడేసినట్టు ఆ పుస్తకంలో ఆయన వివరించారు.

"కరోనా చికిత్స కోసం అధికంగా ఖర్చుపెట్టిన ప్రజలకు, తమ వారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు డబ్బులు సరిపోలేదు. అందుకే ఉత్తర్​ప్రదేశ్​లో వివిధ ఘాట్​ల వద్ద గంగా నదిలో మృతదేహాలను పడేశారు. కన్నౌజ్​లో ఈ తరహా ఘటనలు అధికంగా వెలుగుచూశాయి. అక్కడి నుంచి గంగా నది బిహార్​కు ప్రవహిస్తుండగా.. అక్కడ కూడా మృతదేహాలు కూడా ఎప్పటికప్పుడు నీటిపై తేలుతూ దర్శనమిచ్చాయి. కొవిడ్​ మృతదేహాలను ఎలా ఖననం చేయాలనే అంశంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ప్రజలు అలా గంగా నదిలో మృతదేహాలను పడేశారు," అని ఆ పుస్తకంలో రాసుకొచ్చారు మిశ్రా.

book on Ganga river Covid dead bodies
రాజీవ్​ రంజన్​ మిశ్రా

River Ganga Corona virus dead bodies: 1987 బ్యాచ్​ ఐఏఎస్​ అధికారైన మిశ్రాకు కరోనా రెండో దశలోనే వైరస్​ సోకింది. 'అలా గంగా నదిలో మృతదేహాలు తేలుతున్నాయన్న విషయం.. ఆసుపత్రి పడక మీద ఉన్నప్పుడు నాకు తెలిసింది,' అని ఆయన పేర్కొన్నారు.

కొవిడ్​ నుంచి కోలుకున్న వెంటనే రంగంలోకి దిగిన మిశ్రా.. తక్షణమే 59 జిల్లాస్థాయి గంగా నది కమిటీలకు, ఆయా జిల్లాల మెజిస్ట్రేట్​లకు, పంచాయతీల ఆఫీస్​ బేరర్లకు తగిన ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర విచారణ జరిపి నివేదికను అందించాలని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:-

Corona dead bodies in Ganga: కరోనా 2.0 సమయంలో దేశం ఎదుర్కొన్న గడ్డుపరిస్థితులను భారతీయులు ఎన్నటికీ మర్చిపోలేరు. ఓవైపు చికిత్స కోసం ఆసుపత్రుల్లో పడకలు దొరకక ఇబ్బంది పడగా.. మరోవైపు కొవిడ్​తో మరణించిన వారి మృతదేహాలకు అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు ప్రజలు. ముఖ్యంగా గంగానదిలో మృతదేహాలు తేలడం ప్రజలను కలచివేసింది. గంగా నదికి, దేశానికి పట్టిన దీన స్థితితో కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు తాజాగా విడుదలైన ఓ పుస్తకం ద్వారా వెలుగులోకి వచ్చాయి.

'గంగా: రీఇమాజినింగ్​, రిజువనేటింగ్​, రీకనెక్టింగ్​' పుస్తకాన్ని.. ఎన్​ఎమ్​సీజీ(నేషనల్​ మిషన్​ ఫర్​ క్లీన్​ గంగ) డైరక్టర్​ జనరల్​ రాజీవ్​ రంజన్​ మిశ్రా రచించారు. కొవిడ్​ రెండో దశ సమయంలో వైరస్​​తో మరణించిన దాదాపు 300మంది మృతదేహాలను గంగా నదిలో పడేసినట్టు ఆ పుస్తకంలో ఆయన వివరించారు.

"కరోనా చికిత్స కోసం అధికంగా ఖర్చుపెట్టిన ప్రజలకు, తమ వారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు డబ్బులు సరిపోలేదు. అందుకే ఉత్తర్​ప్రదేశ్​లో వివిధ ఘాట్​ల వద్ద గంగా నదిలో మృతదేహాలను పడేశారు. కన్నౌజ్​లో ఈ తరహా ఘటనలు అధికంగా వెలుగుచూశాయి. అక్కడి నుంచి గంగా నది బిహార్​కు ప్రవహిస్తుండగా.. అక్కడ కూడా మృతదేహాలు కూడా ఎప్పటికప్పుడు నీటిపై తేలుతూ దర్శనమిచ్చాయి. కొవిడ్​ మృతదేహాలను ఎలా ఖననం చేయాలనే అంశంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ప్రజలు అలా గంగా నదిలో మృతదేహాలను పడేశారు," అని ఆ పుస్తకంలో రాసుకొచ్చారు మిశ్రా.

book on Ganga river Covid dead bodies
రాజీవ్​ రంజన్​ మిశ్రా

River Ganga Corona virus dead bodies: 1987 బ్యాచ్​ ఐఏఎస్​ అధికారైన మిశ్రాకు కరోనా రెండో దశలోనే వైరస్​ సోకింది. 'అలా గంగా నదిలో మృతదేహాలు తేలుతున్నాయన్న విషయం.. ఆసుపత్రి పడక మీద ఉన్నప్పుడు నాకు తెలిసింది,' అని ఆయన పేర్కొన్నారు.

కొవిడ్​ నుంచి కోలుకున్న వెంటనే రంగంలోకి దిగిన మిశ్రా.. తక్షణమే 59 జిల్లాస్థాయి గంగా నది కమిటీలకు, ఆయా జిల్లాల మెజిస్ట్రేట్​లకు, పంచాయతీల ఆఫీస్​ బేరర్లకు తగిన ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర విచారణ జరిపి నివేదికను అందించాలని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.