ETV Bharat / bharat

గుజరాత్​ స్థానిక పోరులో కమలం హవా- 42 చోట్ల ఆప్​

author img

By

Published : Mar 3, 2021, 6:11 AM IST

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా హవా కొనసాగింది. మొత్తం 31జిల్లా పంచాయతీలు ఉండగా, అన్ని స్థానాల్లోనూ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే తరహాలో ఫలితాలు పునరావృతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. మరోవైపు తొలిసారి బరిలో నిలిచిన ఆప్ 42 చోట్ల గెలుపొందగా.. ఎంఐఎం 17 స్థానాలు కైవసం చేసుకుంది.

BJPs lotus blooms in local body elections in Gujarat, what would happen if assembly polls are held today ?
గుజరాత్​ స్థానిక పోరులో కమలం హవా- 42 చోట్ల ఆప్​

గుజరాత్‌లో‌ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భాజపా హవా చాటింది. జిల్లా పంచాయతీలు, మున్సిపాలిటీలు, తాలుకా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు భారీ విజయం అందించారు. మొత్తం 31జిల్లా పంచాయతీలు ఉండగా, అన్ని స్థానాల్లోనూ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే తరహాలో ఫలితాలు పునరావృతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. భాజపా ప్రభుత్వ సుపరిపాలనకు ఈ ఫలితాలే నిదర్శనమంటూ ట్వీట్‌ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 31 జిల్లా పంచాయతీలు, 81 మున్సిపాలిటీలు, 231 తాలుకా పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. 81 మున్సిపాలిటీలకు గానూ భాజపా 74 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. 31 జిల్లా పంచాయతీల్లో 980 స్థానాలు ఉండగా వీటిలో 742 స్థానాల్లో భాజపా విజయకేతనం ఎగురవేయగా.. కాంగ్రెస్‌ కేవలం 137 చోట్లకే పరిమితమైపోయింది. ఇక 231 తాలూకా పంచాయతీల్లో 196 చోట్ల కమలం పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్​ 4 మున్సిపాలిటీలు, 33 తాలుకా పంచయతీల్లో మాత్రమే విజయం సాధించింది.

ఆప్​ 42

ఇక తొలిసారి పోటీ చేసిన ఆమ్​ ఆద్మీ పార్టీ అభ్యర్థులు 42 స్థానాల్లో విజయం సాధించారు. తాలూకాల్లో 31 చోట్ల, జిల్లా పంచాయతీల్లో 2 చోట్ల, మున్సిపాలిటీల్లో 9 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. స్వతంత్రులు 286 స్థానాల్లోనూ విజయం సాధించారు.

17 చోట్ల ఖాతా తెరిచిన ఎంఐఎం

హైదరాబాద్​ ఎంపీ అసుదుద్దీన్​ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం గుజరాత్​ స్థానిక బరిలో దిగి.. మూడు మున్సిపాలిటీల్లో 17 స్థానాలు గెలుచుకొంది. మరో రెండు చోట్ల ద్వితీయ స్థానంలో నిలిచి కాంగ్రెస్​ను వెనక్కు నెట్టింది. గత నెల 21న అహ్మదాబాద్​ కార్పొరేషన్​కు జరిగిన ఎన్నికల్లోనూ ఎంఐఎం 7 సీట్లు సాధించింది.

ప్రజలకు మోదీ, షా, నడ్డా కృతజ్ఞతలు

‘గుజరాత్‌లో జరిగిన నగరపాలిక, తాలూకా, జిల్లా పంచాయతీ ఎన్నికల ఫలితాలు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. భాజపా అభివృద్ధి, సుపరిపాలన ఎజెండాకే రాష్ట్రం మొత్తం మద్దతు తెలిపింది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. పార్టీ పట్ల చూపించిన విశ్వాసం, ఆప్యాయతలకు గుజరాత్‌ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. భాజపా పట్ల మరోసారి నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు కేంద్ర మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన గుజరాత్‌ ప్రజలకు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: ఎమర్జెన్సీ విధించడం తప్పే: రాహుల్​

గుజరాత్‌లో‌ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భాజపా హవా చాటింది. జిల్లా పంచాయతీలు, మున్సిపాలిటీలు, తాలుకా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు భారీ విజయం అందించారు. మొత్తం 31జిల్లా పంచాయతీలు ఉండగా, అన్ని స్థానాల్లోనూ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే తరహాలో ఫలితాలు పునరావృతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. భాజపా ప్రభుత్వ సుపరిపాలనకు ఈ ఫలితాలే నిదర్శనమంటూ ట్వీట్‌ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 31 జిల్లా పంచాయతీలు, 81 మున్సిపాలిటీలు, 231 తాలుకా పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. 81 మున్సిపాలిటీలకు గానూ భాజపా 74 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. 31 జిల్లా పంచాయతీల్లో 980 స్థానాలు ఉండగా వీటిలో 742 స్థానాల్లో భాజపా విజయకేతనం ఎగురవేయగా.. కాంగ్రెస్‌ కేవలం 137 చోట్లకే పరిమితమైపోయింది. ఇక 231 తాలూకా పంచాయతీల్లో 196 చోట్ల కమలం పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్​ 4 మున్సిపాలిటీలు, 33 తాలుకా పంచయతీల్లో మాత్రమే విజయం సాధించింది.

ఆప్​ 42

ఇక తొలిసారి పోటీ చేసిన ఆమ్​ ఆద్మీ పార్టీ అభ్యర్థులు 42 స్థానాల్లో విజయం సాధించారు. తాలూకాల్లో 31 చోట్ల, జిల్లా పంచాయతీల్లో 2 చోట్ల, మున్సిపాలిటీల్లో 9 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. స్వతంత్రులు 286 స్థానాల్లోనూ విజయం సాధించారు.

17 చోట్ల ఖాతా తెరిచిన ఎంఐఎం

హైదరాబాద్​ ఎంపీ అసుదుద్దీన్​ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం గుజరాత్​ స్థానిక బరిలో దిగి.. మూడు మున్సిపాలిటీల్లో 17 స్థానాలు గెలుచుకొంది. మరో రెండు చోట్ల ద్వితీయ స్థానంలో నిలిచి కాంగ్రెస్​ను వెనక్కు నెట్టింది. గత నెల 21న అహ్మదాబాద్​ కార్పొరేషన్​కు జరిగిన ఎన్నికల్లోనూ ఎంఐఎం 7 సీట్లు సాధించింది.

ప్రజలకు మోదీ, షా, నడ్డా కృతజ్ఞతలు

‘గుజరాత్‌లో జరిగిన నగరపాలిక, తాలూకా, జిల్లా పంచాయతీ ఎన్నికల ఫలితాలు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. భాజపా అభివృద్ధి, సుపరిపాలన ఎజెండాకే రాష్ట్రం మొత్తం మద్దతు తెలిపింది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. పార్టీ పట్ల చూపించిన విశ్వాసం, ఆప్యాయతలకు గుజరాత్‌ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. భాజపా పట్ల మరోసారి నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు కేంద్ర మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన గుజరాత్‌ ప్రజలకు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: ఎమర్జెన్సీ విధించడం తప్పే: రాహుల్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.