ఉత్తరాఖండ్ హరిద్వార్లో వచ్చే ఏడాది జనవరి నుంచి జరగనున్న మహా కుంభమేళాకు ఏర్పాట్లు ప్రారంభించకపోవడం పట్ల ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది అఖిల భారత అఖాడా పరిషత్(ఏబీఏపీ). ఈ మహాకార్యానికి ప్రభుత్వం సహకరించకపోతే.. తమ శక్తి, సామర్థ్యం మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. కుంభమేళా కార్యకలాపాలపై చర్చించడానికి నయా ఉదాసిన్ అఖాడా కంకల్తో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గతసారిలా.. ఘనంగా..
కుంభమేళా విషయంపై సీఎం తివేంద్ర సింగ్ రావత్కు వినతి పత్రాన్ని సమర్పించినట్లు ఏబీఏపీ అధ్యక్షుడు మహాంతి నరేంద్ర గిర్ తెలిపారు. "ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం ప్రభుత్వం బాధ్యత. అయితే ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నాం. అయితే ప్రభుత్వం సాయం ఉన్నా.. లేకపోయినా 2010లో జరిగినట్లు ఘనంగా నిర్వహిస్తాం" అని గిర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మహా కుంభమేళాను ఘనంగా నిర్వహించమని కోరుతామన్నారు.
2021 జనవరి నుంచి ఏప్రిల్ వరకు హరిద్వార్లో మహా కుంభమేళా జరగనుంది.
ఇదీ చూడండి: కరోనా కాలంలోనూ అదరగొట్టిన రైల్వే!