ETV Bharat / bharat

విశాఖ దుర్ఘటనపై మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

author img

By

Published : May 7, 2020, 12:09 PM IST

ఆంధ్రప్రదేశ్​ విశాఖపట్టణంలో జరిగిన గ్యాస్​ లీక్​ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సీఎం జగన్​మోహన్​రెడ్డితో ఫోన్​లో మాట్లాడి.. సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్​నామ్​ కోవింద్​, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా విచారం వ్యక్తం చేశారు.

Vizag gas leak 'disturbing', closely monitoring situation: Amit Shah
విశాఖ 'గ్యాస్​ దుర్ఘటన'పై మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

విశాఖ గ్యాస్​ దుర్ఘటనపై అత్యవసర సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్​డీఎంఏ) సహా సంబంధిత అధికారులతో అర గంటపాటు సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టడంపై కీలక సూచనలు చేశారు. ఈ సమీక్షలో హోం మంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పాల్గొన్నారు.

అంతకుముందు... ఈ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్​ చేశారు. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డితో ఫోన్​లో మాట్లాడిన ప్రధాని.. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Vizag gas leak 'disturbing', closely monitoring situation: Amit Shah
మోదీ ట్వీట్​

రాష్ట్రపతి​ విచారం...

Vizag gas leak 'disturbing', closely monitoring situation: Amit Shah
రాష్ట్రపతి విచారం

విశాఖ గ్యాస్​ లీక్​ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

విశాఖ రసాయన కర్మాగారంలో జరిగిన ఘటన.. కలచివేసిందిని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ట్వీట్​ చేశారు. విపత్తు నిర్వహణ అధికారులతో మాట్లాడినట్లు తెలిపిన అమిత్‌షా.. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

విశాఖ గ్యాస్​ దుర్ఘటనపై అత్యవసర సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్​డీఎంఏ) సహా సంబంధిత అధికారులతో అర గంటపాటు సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టడంపై కీలక సూచనలు చేశారు. ఈ సమీక్షలో హోం మంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పాల్గొన్నారు.

అంతకుముందు... ఈ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్​ చేశారు. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డితో ఫోన్​లో మాట్లాడిన ప్రధాని.. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Vizag gas leak 'disturbing', closely monitoring situation: Amit Shah
మోదీ ట్వీట్​

రాష్ట్రపతి​ విచారం...

Vizag gas leak 'disturbing', closely monitoring situation: Amit Shah
రాష్ట్రపతి విచారం

విశాఖ గ్యాస్​ లీక్​ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

విశాఖ రసాయన కర్మాగారంలో జరిగిన ఘటన.. కలచివేసిందిని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ట్వీట్​ చేశారు. విపత్తు నిర్వహణ అధికారులతో మాట్లాడినట్లు తెలిపిన అమిత్‌షా.. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.