ETV Bharat / bharat

పల్లెల్ని కాపాడాలి.. కరోనాను జయించి తీరాలి: మోదీ

author img

By

Published : May 12, 2020, 6:36 AM IST

Updated : May 12, 2020, 6:55 AM IST

కరోనా వ్యాప్తి వేగం పుంజుకున్న నేపథ్యంలో గ్రామీణ భారతానికి ఆ మహమ్మారి విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో నెమ్మదిగా ఆర్థిక కార్యకలాపాలు మొదలయ్యాయని, త్వరలోనే అవి పుంజుకుంటాయన్నారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని... ఈ నెల 17 తరువాత లాక్​డౌన్ పొడిగించాలా, సడలించాలా అనే విషయంపై సవివరంగా మాట్లాడారు.

villages must be protected from coronavirus: PM modi
పల్లెల్ని కాపాడాలి.. కరోనాను జయించి తీరాలి: మోదీ

గ్రామీణ భారతానికి కరోనా మహమ్మారి విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. వలస కార్మికుల చేరవేతను అనుమతించడం సహా వివిధ సడలింపులను ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దేశానికి ఇదే పెద్ద సవాల్‌ అని పేర్కొన్నారు. నెమ్మదిగానైనా దేశంలో అనేక ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు మొదలయ్యాయనేది వాస్తవమని, రాబోయే రోజుల్లో ఇవి క్రమేపీ ఊపందుకునేలా సమతౌల్య వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. దీనిపై ఈ నెల 15 నాటికి బ్లూప్రింట్‌ ఇవ్వాలని సూచించారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రులతో మోదీ వీడియో సమావేశం నిర్వహించారు. ఈనెల 17 తర్వాత లాక్‌డౌన్‌ను పొడిగించాలా, సడలించాలా అనే విషయమై సవివరంగా మాట్లాడారు. కరోనా లేని ప్రాంతాల్లోనైనా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలంటూ డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం సుమారు 6గంటలపాటు కొనసాగింది. ఈసారి ఎక్కువమందికి మాట్లాడే అవకాశం లభించింది.

సూచనలు కావాలి...

ఇప్పటి చర్యలు తదుపరి దశలో అవసరం లేదు. ‘తొలి లాక్‌డౌన్‌లో తీసుకున్న చర్యలు రెండో దశలో అవసరం లేదు. రెండో దశనాటి చర్యలు మూడో దశలో అవసరం లేదు. ఇప్పుడు మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగో దశలో అవసరం లేదన్నది నా స్పష్టమైన అభిప్రాయం’’ అని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను ఎలా నిర్వహించాలనుకుంటున్నదీ ఒక స్థూల ప్రణాళికను సీఎంలు పంపాలని చెప్పారు. లాక్‌డౌన్‌తోపాటు, దాన్ని క్రమంగా ఎత్తేసిన తర్వాత వచ్చే చిన్నచిన్న సమస్యలను ఎలా అధిగమించాలనుకుంటున్నారో వివరాలు పంపాలని సూచించారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ కోసమే రైళ్లు ప్రారంభించామని, మున్ముందు అన్ని రూట్లలో కాకుండా కేవలం ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే వీటిని నడుపుతామని స్పష్టం చేశారు. ఇకముందూ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని, అయితే మరిన్ని వెసులుబాట్లు ఉంటాయని సంకేతాన్ని ఇచ్చారు. రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలను అనుమతించాలా, వద్దా అనే విషయం నుంచి రాష్ట్రాలకు వదిలిపెట్టాల్సిన నిర్ణయాల వరకు అనేకాంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. కరోనాపై పోరాటంలో రాష్ట్రాలు పోషిస్తున్న పాత్రను ప్రధాని కొనియాడారు. మహమ్మారి నుంచి భారత్‌ తనను తాను విజయవంతంగా కాపాడుకోగలుగుతోందనే భావన యావత్‌ ప్రపంచం నుంచి వ్యక్తమవుతోందని ఆయన చెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

జయించి తీరాలి...

"ప్రపంచ యుద్ధాల తర్వాత పరిస్థితులు ఎలా మారాయో అలాగే ఇప్పుడు మనం కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అన్నట్లు ప్రపంచ పరిస్థితులు ఉంటాయి. వ్యక్తిగతం కాకుండా మొత్తం మానవాళిని చూసుకోవాలన్నట్లు ‘జనం నుంచి జగం వరకు’ అన్న కొత్త సిద్ధాంతం ఆధారంగా కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. వ్యాక్సిన్‌ను కానీ, పరిష్కారాన్ని గానీ కనుక్కొనేంత వరకూ దీనిపై పోరాడటానికి అతిపెద్ద ఆయుధం భౌతిక దూరం పాటించడమే" - ప్రధాని నరేంద్ర మోదీ

పాఠ్యాంశాల బోధనకు ఆధునిక విధానాలపై దృష్టి సారించాలని విధాన రూపకర్తలకు సూచించారు. రైళ్లను పరిమితంగా నడపబోతున్న విషయాన్ని మోదీ ప్రస్తావిస్తూ ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి ఇది అవసరమైనట్లు పేర్కొన్నారు. అయితే అన్ని రూట్లను ఇప్పుడే ప్రారంభించబోమని, పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుస్తాయని చెప్పారు.

ప్రధానితో ముఖ్యమంత్రులు ఏమన్నారంటే...

రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించేందుకు అనువైన నిర్ణయాలు తీసుకొనే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలని పలువురు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లను ప్రకటించుకొనే బాధ్యతను కూడా తమకే అప్పగించాలన్నారు. జీవితాలు, జీవనోపాధులను కాపాడటానికి రాష్ట్రాలకు ద్రవ్య, ఆర్థికపరమైన సాధికారత కల్పించాలని కోరారు.

ఇదీ చూడండి: 'లాక్​డౌన్​ పొడిగిస్తే తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదు'

గ్రామీణ భారతానికి కరోనా మహమ్మారి విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. వలస కార్మికుల చేరవేతను అనుమతించడం సహా వివిధ సడలింపులను ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దేశానికి ఇదే పెద్ద సవాల్‌ అని పేర్కొన్నారు. నెమ్మదిగానైనా దేశంలో అనేక ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు మొదలయ్యాయనేది వాస్తవమని, రాబోయే రోజుల్లో ఇవి క్రమేపీ ఊపందుకునేలా సమతౌల్య వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. దీనిపై ఈ నెల 15 నాటికి బ్లూప్రింట్‌ ఇవ్వాలని సూచించారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రులతో మోదీ వీడియో సమావేశం నిర్వహించారు. ఈనెల 17 తర్వాత లాక్‌డౌన్‌ను పొడిగించాలా, సడలించాలా అనే విషయమై సవివరంగా మాట్లాడారు. కరోనా లేని ప్రాంతాల్లోనైనా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలంటూ డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం సుమారు 6గంటలపాటు కొనసాగింది. ఈసారి ఎక్కువమందికి మాట్లాడే అవకాశం లభించింది.

సూచనలు కావాలి...

ఇప్పటి చర్యలు తదుపరి దశలో అవసరం లేదు. ‘తొలి లాక్‌డౌన్‌లో తీసుకున్న చర్యలు రెండో దశలో అవసరం లేదు. రెండో దశనాటి చర్యలు మూడో దశలో అవసరం లేదు. ఇప్పుడు మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగో దశలో అవసరం లేదన్నది నా స్పష్టమైన అభిప్రాయం’’ అని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను ఎలా నిర్వహించాలనుకుంటున్నదీ ఒక స్థూల ప్రణాళికను సీఎంలు పంపాలని చెప్పారు. లాక్‌డౌన్‌తోపాటు, దాన్ని క్రమంగా ఎత్తేసిన తర్వాత వచ్చే చిన్నచిన్న సమస్యలను ఎలా అధిగమించాలనుకుంటున్నారో వివరాలు పంపాలని సూచించారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ కోసమే రైళ్లు ప్రారంభించామని, మున్ముందు అన్ని రూట్లలో కాకుండా కేవలం ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే వీటిని నడుపుతామని స్పష్టం చేశారు. ఇకముందూ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని, అయితే మరిన్ని వెసులుబాట్లు ఉంటాయని సంకేతాన్ని ఇచ్చారు. రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలను అనుమతించాలా, వద్దా అనే విషయం నుంచి రాష్ట్రాలకు వదిలిపెట్టాల్సిన నిర్ణయాల వరకు అనేకాంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. కరోనాపై పోరాటంలో రాష్ట్రాలు పోషిస్తున్న పాత్రను ప్రధాని కొనియాడారు. మహమ్మారి నుంచి భారత్‌ తనను తాను విజయవంతంగా కాపాడుకోగలుగుతోందనే భావన యావత్‌ ప్రపంచం నుంచి వ్యక్తమవుతోందని ఆయన చెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

జయించి తీరాలి...

"ప్రపంచ యుద్ధాల తర్వాత పరిస్థితులు ఎలా మారాయో అలాగే ఇప్పుడు మనం కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అన్నట్లు ప్రపంచ పరిస్థితులు ఉంటాయి. వ్యక్తిగతం కాకుండా మొత్తం మానవాళిని చూసుకోవాలన్నట్లు ‘జనం నుంచి జగం వరకు’ అన్న కొత్త సిద్ధాంతం ఆధారంగా కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. వ్యాక్సిన్‌ను కానీ, పరిష్కారాన్ని గానీ కనుక్కొనేంత వరకూ దీనిపై పోరాడటానికి అతిపెద్ద ఆయుధం భౌతిక దూరం పాటించడమే" - ప్రధాని నరేంద్ర మోదీ

పాఠ్యాంశాల బోధనకు ఆధునిక విధానాలపై దృష్టి సారించాలని విధాన రూపకర్తలకు సూచించారు. రైళ్లను పరిమితంగా నడపబోతున్న విషయాన్ని మోదీ ప్రస్తావిస్తూ ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి ఇది అవసరమైనట్లు పేర్కొన్నారు. అయితే అన్ని రూట్లను ఇప్పుడే ప్రారంభించబోమని, పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుస్తాయని చెప్పారు.

ప్రధానితో ముఖ్యమంత్రులు ఏమన్నారంటే...

రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించేందుకు అనువైన నిర్ణయాలు తీసుకొనే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలని పలువురు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లను ప్రకటించుకొనే బాధ్యతను కూడా తమకే అప్పగించాలన్నారు. జీవితాలు, జీవనోపాధులను కాపాడటానికి రాష్ట్రాలకు ద్రవ్య, ఆర్థికపరమైన సాధికారత కల్పించాలని కోరారు.

ఇదీ చూడండి: 'లాక్​డౌన్​ పొడిగిస్తే తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదు'

Last Updated : May 12, 2020, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.