ETV Bharat / bharat

సభ్య దేశాల నుంచి భారత్​కు శుభాకాంక్షల వెల్లువ

author img

By

Published : Jun 18, 2020, 3:50 PM IST

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికల్లో భారత్​ ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలిపాయి అందులోని సభ్యదేశాలు. ప్రపంచ శాంతి, భద్రత కోసం కలసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాయి.

UNSC permanent members congratulate India on election win
సభ్య దేశాల నుంచి భారత్​కు శుభాకాంక్షల వెల్లువ

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారీ మెజారిటీతో ఎన్నికైనందుకు భారత్​కు శుభాకాంక్షాలు తెలియజేశాయి అందులోని శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలు. ప్రపంచ శాంతి, భద్రత కోసం కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన మరో మూడు దేశాలు ఐర్లాండ్, మెక్సికో, నార్వేలకూ అభినందనలు తెలిపాయి.

75వ జనరల్​ అసెంబ్లీ సమావేశానికి అధ్యక్షునిగా ఎన్నికైనందుకు టర్కీ సీనియర్​ దౌత్యవేత్త వోల్కన్​ బోజ్​కిర్​కు అభినందనలు తెలిపారు ఐరాసలో అమెరికా ప్రతినిధి, రాయబారి కెల్లీ క్రాఫ్ట్​. అలాగే యూఎన్​ఎస్​సీలో తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికైన భారత్​, ఐర్లాండ్, మెక్సికో, నార్వేలకు శుభాకాంక్షలు చెప్పారు. కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ట్వీట్​ చేశారు.

చైనా కూడా నూతనంగా ఎన్నికైన దేశాలకు అభినందనలు తెలిపింది. 2021 జనవరి 1 నుంచి యూఎన్​ఎస్​సీలో అధికారిక బాధ్యతలు చేపట్టనున్న నూతన సభ్య దేశాలతో ఫలవంతంగా పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు రష్యా ట్వీట్ చేసింది. ఫ్రెంచ్, బ్రిటన్​ కూడా నాలుగు దేశాలకూ అభినందనలు తెలిపాయి.

వియత్నాం, ఎస్తోనియా, బెల్జియం, డొమెనికన్​ రిపబ్లిక్​, జర్మనీ, ఇండోనేసియా కూడా నూతనంగా ఎన్నికైన సభ్య దేశాలకు అభినందనలు తెలిపాయి.

గర్వకారణం..

గతేడాది మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని న్యూయార్క్​లో 'ఇండియా ఫర్ హ్యుమానిటీ' ప్రత్యేక కార్యక్రమాలకు భాగస్వామ్యం వహించిన ప్రేమ్​ భండారీ.. ఈ విజయం భారత్​కు గర్వకారణం అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ప్రపంచవ్యాప్తంగా భారత్​ ఖ్యాతి పెరుగుతోందన్నారు.

ఘన విజయం..

193 సభ్యదేశాలు కలిగిన యూఎన్‌ఎస్​సీలో 2021-2022 సంవత్సరాలకుగాను తాత్కాలిక సభ్యదేశంగా భారత్‌ ఎన్నికైంది. మొత్తం 192ఓట్లు పోలవ్వగా భారత్‌కు 184దేశాల మద్దతు లభించింది. ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, రష్యా దేశాలు మాత్రమే ఉన్నాయి. అయితే, శాశ్వత సభ్యదేశాలు కాని సభ్యుల కోసం ప్రతిరెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. దీనిలో భాగంగా బుధవారం జరిగిన ఎన్నికల్లో భారత్‌ భారీ మద్దతు సాధించింది. భారత్‌తోపాటు ఐర్లాండ్‌, మెక్సికో, నార్వే దేశాలు కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందాయి. కెనడా మాత్రం ఓటమి పాలయ్యింది.

ప్రస్తుతం తాత్కాలిక సభ్యదేశాలుగా ఉన్న బెల్జియం, డొమెనికన్​ రిపబ్లిక్​, జర్మనీ, ఇండోనేసియా, దక్షిణాఫ్రికాల గడువు ఈ ఏడాదితో పూర్తవుతుంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారీ మెజారిటీతో ఎన్నికైనందుకు భారత్​కు శుభాకాంక్షాలు తెలియజేశాయి అందులోని శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలు. ప్రపంచ శాంతి, భద్రత కోసం కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన మరో మూడు దేశాలు ఐర్లాండ్, మెక్సికో, నార్వేలకూ అభినందనలు తెలిపాయి.

75వ జనరల్​ అసెంబ్లీ సమావేశానికి అధ్యక్షునిగా ఎన్నికైనందుకు టర్కీ సీనియర్​ దౌత్యవేత్త వోల్కన్​ బోజ్​కిర్​కు అభినందనలు తెలిపారు ఐరాసలో అమెరికా ప్రతినిధి, రాయబారి కెల్లీ క్రాఫ్ట్​. అలాగే యూఎన్​ఎస్​సీలో తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికైన భారత్​, ఐర్లాండ్, మెక్సికో, నార్వేలకు శుభాకాంక్షలు చెప్పారు. కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ట్వీట్​ చేశారు.

చైనా కూడా నూతనంగా ఎన్నికైన దేశాలకు అభినందనలు తెలిపింది. 2021 జనవరి 1 నుంచి యూఎన్​ఎస్​సీలో అధికారిక బాధ్యతలు చేపట్టనున్న నూతన సభ్య దేశాలతో ఫలవంతంగా పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు రష్యా ట్వీట్ చేసింది. ఫ్రెంచ్, బ్రిటన్​ కూడా నాలుగు దేశాలకూ అభినందనలు తెలిపాయి.

వియత్నాం, ఎస్తోనియా, బెల్జియం, డొమెనికన్​ రిపబ్లిక్​, జర్మనీ, ఇండోనేసియా కూడా నూతనంగా ఎన్నికైన సభ్య దేశాలకు అభినందనలు తెలిపాయి.

గర్వకారణం..

గతేడాది మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని న్యూయార్క్​లో 'ఇండియా ఫర్ హ్యుమానిటీ' ప్రత్యేక కార్యక్రమాలకు భాగస్వామ్యం వహించిన ప్రేమ్​ భండారీ.. ఈ విజయం భారత్​కు గర్వకారణం అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ప్రపంచవ్యాప్తంగా భారత్​ ఖ్యాతి పెరుగుతోందన్నారు.

ఘన విజయం..

193 సభ్యదేశాలు కలిగిన యూఎన్‌ఎస్​సీలో 2021-2022 సంవత్సరాలకుగాను తాత్కాలిక సభ్యదేశంగా భారత్‌ ఎన్నికైంది. మొత్తం 192ఓట్లు పోలవ్వగా భారత్‌కు 184దేశాల మద్దతు లభించింది. ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, రష్యా దేశాలు మాత్రమే ఉన్నాయి. అయితే, శాశ్వత సభ్యదేశాలు కాని సభ్యుల కోసం ప్రతిరెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. దీనిలో భాగంగా బుధవారం జరిగిన ఎన్నికల్లో భారత్‌ భారీ మద్దతు సాధించింది. భారత్‌తోపాటు ఐర్లాండ్‌, మెక్సికో, నార్వే దేశాలు కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందాయి. కెనడా మాత్రం ఓటమి పాలయ్యింది.

ప్రస్తుతం తాత్కాలిక సభ్యదేశాలుగా ఉన్న బెల్జియం, డొమెనికన్​ రిపబ్లిక్​, జర్మనీ, ఇండోనేసియా, దక్షిణాఫ్రికాల గడువు ఈ ఏడాదితో పూర్తవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.