ETV Bharat / bharat

భారత్​లో 21వేలు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Apr 23, 2020, 9:50 AM IST

Updated : Apr 23, 2020, 12:03 PM IST

దేశంలో కరోనా వైరస్​ కేసుల సంఖ్య 21వేలు దాటింది. 1,409 తాజా కేసులతో మొత్తం 21వేల 393మంది వైరస్​ బారిన పడ్డారు. 681మంది మృతి చెందారు.

total-number-of-corona-virus-cases-raises-to-21393-in-india
భారత్​లో 21వేలు దాటిన కరోనా వైరస్​ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 41మంది మరణించారు. 1,409 కొత్త కేసులు నమోదయ్యాయి.

total-number-of-corona-virus-cases-raises-to-21393-in-india
దేశంలో పరిస్థితి ఇలా

ఈ రోజు ఉదయం 9గంటల వరకు దేశవ్యాప్తంగా మొత్తం 4,85,172మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్​ఆర్​) వెల్లడించింది. ఇందులో 21,797 పాజిటివ్​గా తేలినట్లు తెలిపింది.

క్వారంటైన్​లో పోలీసు సిబ్బంది...

ఉత్తరప్రదేశ్​లోని 73మంది పోలీసు సిబ్బందిని అధికారులు బుధవారం క్వారంటైన్​ చేశారు. నావాబ్​పుర రాళ్ల దాడి ఘటనకు సంబంధించి 17మందిని పోలీసులు అరెస్టు చేయడం.. వారిలోని ఐదుగురికి వైరస్​ గుర్తించడం వల్ల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 73మంది పోలీసు సిబ్బంది నమూనాలను పరీక్షలకు పంపినట్టు వెల్లడించారు.

ఈ నెల 15న నవాబ్​పుర ప్రాంతంలో కరోనా సోకిన వ్యక్తిని ఐసోలేషన్​ వార్డుకు తరలిస్తుండగా ఆరోగ్య సిబ్బందిని కొందరు అడ్డుకున్నారు. వారిపై రాళ్ల దాడి చేశారు.

రాజస్థాన్​లో...

రాజస్థాన్​లో 47 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,935కు పెరిగింది. 27మంది మృతిచెందగా 344మంది కరోనాను జయించారు.

ఇదీ చూడండి:- అకడమిక్ క్యాలెండర్​లో మార్పుల దిశగా రాష్ట్రాల యోచన!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 41మంది మరణించారు. 1,409 కొత్త కేసులు నమోదయ్యాయి.

total-number-of-corona-virus-cases-raises-to-21393-in-india
దేశంలో పరిస్థితి ఇలా

ఈ రోజు ఉదయం 9గంటల వరకు దేశవ్యాప్తంగా మొత్తం 4,85,172మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్​ఆర్​) వెల్లడించింది. ఇందులో 21,797 పాజిటివ్​గా తేలినట్లు తెలిపింది.

క్వారంటైన్​లో పోలీసు సిబ్బంది...

ఉత్తరప్రదేశ్​లోని 73మంది పోలీసు సిబ్బందిని అధికారులు బుధవారం క్వారంటైన్​ చేశారు. నావాబ్​పుర రాళ్ల దాడి ఘటనకు సంబంధించి 17మందిని పోలీసులు అరెస్టు చేయడం.. వారిలోని ఐదుగురికి వైరస్​ గుర్తించడం వల్ల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 73మంది పోలీసు సిబ్బంది నమూనాలను పరీక్షలకు పంపినట్టు వెల్లడించారు.

ఈ నెల 15న నవాబ్​పుర ప్రాంతంలో కరోనా సోకిన వ్యక్తిని ఐసోలేషన్​ వార్డుకు తరలిస్తుండగా ఆరోగ్య సిబ్బందిని కొందరు అడ్డుకున్నారు. వారిపై రాళ్ల దాడి చేశారు.

రాజస్థాన్​లో...

రాజస్థాన్​లో 47 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,935కు పెరిగింది. 27మంది మృతిచెందగా 344మంది కరోనాను జయించారు.

ఇదీ చూడండి:- అకడమిక్ క్యాలెండర్​లో మార్పుల దిశగా రాష్ట్రాల యోచన!

Last Updated : Apr 23, 2020, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.