బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. సీఆర్పీఎఫ్ బలగాలతో జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. గవర్నర్కు భద్రత పరంగా ముప్పు ఉందన్న సమాచారం మేరకు ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
దేశంలో ఆయన ఎక్కడికి ప్రయాణించినా దాదాపు 8 నుంచి 9 మందితో కూడిన సాయుధ బృందం గవర్నర్ వెంట ఉండనుంది. త్వరలోనే భద్రతా బలగాలు ఆయన బాధ్యతను తీసుకుంటాయని అధికారులు తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సహా పలువురు వీఐపీలకు సీఆర్పీఎఫ్ జెడ్ కేటగిరీ భద్రత ఉంది.
తృణమూల్ ఆక్షేపణ...
గవర్నర్కు జెడ్ కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించటంపై తృణమూల్ కాంగ్రెస్ ఆక్షేపించింది. కాషాయ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చటానికి ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ గవర్నర్కు భద్రత పరంగా ముప్పు వాటిల్లనప్పుడు... ప్రత్యేకంగా ఇప్పుడు భద్రత పెంచడం ఎందుకని ప్రశ్నించింది.
ఇదీ చూడండి : ప్రసంగం మధ్యలో సభకు తలవంచి మోదీ అభివాదం!