దిల్లీలోని జవహార్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ)లో విద్యార్థులు రెచ్చిపోయారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కార్యక్రమం కవరేజీ కోసం వచ్చిన ఈటీవీ-భారత్ రిపోర్టర్పై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు కొంత మంది విద్యార్థులు.
కార్యక్రమం జరుతుండగానే రిపోర్టర్ను తోస్తూ అతని వద్ద ఉన్న మోజో కిట్ను లాక్కునేందుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో అతడిని చుట్టుముట్టిన విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.
అధికరణ 370 రద్దుపై జేఎన్యూలో గురువారం సెమినార్ నిర్వహించారు కేంద్రమంత్రి. ప్రభుత్వ నిర్ణయంపై ప్రసంగించారు జితేంద్ర సింగ్. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించిన కొంతమంది విద్యార్థులు.. కవరేజీ చేయొద్దని రిపోర్టర్పై దాడి చేశారు.
ఇదీ చూడండి: స్వచ్ఛభారత్ కోసం వింగ్ కమాండర్ వినూత్న ఫీట్