జమ్ము కశ్మీర్ కథువాలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో వెళ్తోన్న ఓ ట్రక్కును భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. అందులోని జైషే మహమ్మద్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నాయి. నాలుగు ఏకే 56, రెండు ఏకే-47 రైఫిళ్లు, ఆరు మేగజైన్లు, 180 రౌండ్ల తుపాకీ గుళ్లు స్వాధీనం చేసుకున్నాయి.
ఉగ్రవాదులు పంజాబ్లోని బమ్యాల్ ప్రాంతం నుంచి కశ్మీర్కు ఆయుధాలు తరలించడానికి ప్రయత్నించినట్లు భద్రతాదళాలు గుర్తించాయి.
ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇదే అదనుగా ఉగ్రదాడులకు ప్రయత్నిస్తున్నారు పాక్ ఆధారిత ముష్కరులు.
ఇదీ చూడండి: భారత్ X చైనా: మరోసారి సరిహద్దు ఉద్రిక్తతలు