ETV Bharat / bharat

ఎంపీలతో సోనియా భేటీ- పార్లమెంట్​లో వ్యూహంపై చర్చ

రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తమ పార్టీ లోక్​సభ ఎంపీలతో సమావేశమయ్యారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సోనియా ఆయా సమస్యలపై నేతలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం.

author img

By

Published : Jul 11, 2020, 3:17 PM IST

sonia
కాంగ్రెస్ ఎంపీలతో సోనియా భేటీ- పార్లమెంట్​లో వ్యూహంపై చర్చ

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. తమ పార్టీకి చెందిన లోక్​సభ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం, గల్వాన్ లోయలో ఉద్రిక్తతలు సహా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్​ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ విమర్శలు చేస్తూ వస్తోంది. లాక్​డౌన్ అనంతరం వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తోంది. లద్దాఖ్​ ఉద్రిక్తతలు, పేదలకు ఆర్థిక సాయం, చమురు ధరల పెరుగుదల అంశాలను కాంగ్రెస్..​ పార్లమెంట్​లో లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. తమ పార్టీకి చెందిన లోక్​సభ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం, గల్వాన్ లోయలో ఉద్రిక్తతలు సహా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్​ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ విమర్శలు చేస్తూ వస్తోంది. లాక్​డౌన్ అనంతరం వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తోంది. లద్దాఖ్​ ఉద్రిక్తతలు, పేదలకు ఆర్థిక సాయం, చమురు ధరల పెరుగుదల అంశాలను కాంగ్రెస్..​ పార్లమెంట్​లో లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ప్రధాని మోదీ ఓ అసత్యాగ్రహి: రాహుల్​ గాంధీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.