ETV Bharat / bharat

"అమేఠీ ప్రజలను 55 ఏళ్లుగా మోసం చేస్తోంది"

తాను పోటీ చేస్తున్న ఉత్తర్​ప్రదేశ్​లోని అమేఠీలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. ప్రజలు ఈసారి తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అమేఠీ ప్రజలను కాంగ్రెస్​ పార్టీ మోసం చేస్తోందని ఆరోపించారు.

author img

By

Published : Apr 7, 2019, 6:27 AM IST

Updated : Apr 7, 2019, 7:11 AM IST

స్మృతి ఇరానీ
అమేఠీ అభివృద్ధి విషయంలో రాహుల్​ గాంధీపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ విమర్శలు

కాంగ్రెస్​ పార్టీ 55 ఏళ్లుగా అమేఠీ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. ఇంత కాలం ఎంపీగా ఉన్న రాహుల్​ గాంధీ అభివృద్ధి పై ఏమాత్రం దృష్టి సారించలేదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో రాహుల్​పై విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

" రాముడి వనవాసం 14 ఏళ్లలో పూర్తయింది. కానీ అమేఠీ వనవాసం 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ముగుస్తుంది. మే6(పోలింగ్​ రోజు)న అమేఠీ ప్రజలు రాహుల్​ గాంధీని సాగనంపుతారు. కాంగ్రెస్​ 55ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తోంది" -స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి

అధికారం కోసం ఓట్లు అడిగేందుకు మాత్రమే రాహుల్​ గాంధీ అమేఠీ ప్రజల దగ్గరకు వస్తారని స్మృతి విమర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆయన కొంత కూడా ఆలోచించలేదని ఆరోపించారు.

కాంగ్రెస్​ నేతలు ఇటీవల చేసిన విమర్శలపైనా స్పందించారు ఇరానీ. విలువలు లేని వారే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
స్వాతంత్ర్యమొచ్చి 70ఏళ్లు దాటినా అమేఠీలో కనీస సదుపాయాలు లేవని, రైతులు సాగు చేస్తున్న పంటలకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు స్మృతి ఇరానీ.

కాలికాన్​ధామ్​లో ఫక్కడ్​ బాబా ఆశీర్వాదాలు తీసుకున్నారు స్మృతి. అక్కడి భక్తులతో కాసేపు మాట్లాడారు. దీదీ అని అప్యాయంగా పిలుస్తున్న అమేఠీ ప్రజలను ఎప్పటికీ విడిచి వెళ్లనని హామీ ఇచ్చారు ఇరానీ.

అమేఠీ అభివృద్ధి విషయంలో రాహుల్​ గాంధీపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ విమర్శలు

కాంగ్రెస్​ పార్టీ 55 ఏళ్లుగా అమేఠీ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. ఇంత కాలం ఎంపీగా ఉన్న రాహుల్​ గాంధీ అభివృద్ధి పై ఏమాత్రం దృష్టి సారించలేదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో రాహుల్​పై విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

" రాముడి వనవాసం 14 ఏళ్లలో పూర్తయింది. కానీ అమేఠీ వనవాసం 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ముగుస్తుంది. మే6(పోలింగ్​ రోజు)న అమేఠీ ప్రజలు రాహుల్​ గాంధీని సాగనంపుతారు. కాంగ్రెస్​ 55ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తోంది" -స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి

అధికారం కోసం ఓట్లు అడిగేందుకు మాత్రమే రాహుల్​ గాంధీ అమేఠీ ప్రజల దగ్గరకు వస్తారని స్మృతి విమర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆయన కొంత కూడా ఆలోచించలేదని ఆరోపించారు.

కాంగ్రెస్​ నేతలు ఇటీవల చేసిన విమర్శలపైనా స్పందించారు ఇరానీ. విలువలు లేని వారే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
స్వాతంత్ర్యమొచ్చి 70ఏళ్లు దాటినా అమేఠీలో కనీస సదుపాయాలు లేవని, రైతులు సాగు చేస్తున్న పంటలకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు స్మృతి ఇరానీ.

కాలికాన్​ధామ్​లో ఫక్కడ్​ బాబా ఆశీర్వాదాలు తీసుకున్నారు స్మృతి. అక్కడి భక్తులతో కాసేపు మాట్లాడారు. దీదీ అని అప్యాయంగా పిలుస్తున్న అమేఠీ ప్రజలను ఎప్పటికీ విడిచి వెళ్లనని హామీ ఇచ్చారు ఇరానీ.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Greece, Cyprus, Albania, USA, Australia, Canada, Romania, Netherlands, South America, France, Portugal, Israel and Germany. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: TAF Sports
DURATION:
STORYLINE:
Last Updated : Apr 7, 2019, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.