2019 ఏడాదికిగానూ కేంద్ర సాహిత్య పురస్కారాల విజేతలను ప్రకటించింది 'ది నేషనల్ అకాడెమీ ఆఫ్ లెటర్స్'. మొత్తం 23 మంది ఈ అవార్డును అందుకోనున్నారు. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్తో పాటు నంద కిశోర్ ఆచార్య ఉన్నారు.
నాన్ ఫిక్షనల్ విభాగంలో థరూర్ ఆంగ్ల రచన 'యాన్ ఎరా ఆఫ్ డార్క్నెస్' పుస్తకానికిగానూ ఈ అవార్డు దక్కింది. భారత్పై బ్రిటిష్ పాలకుల ప్రభావం గురించి తెలియజేస్తూ థరూర్ ఈ పుస్తకం రాశారు. థరూర్తో పాటు మొత్తం 23 మంది ఈ అవార్డు అందుకోనున్నారు. హిందీ నవల 'చీలేతే హో ఆప్నే కో'కుగానూ కిశోర్ ఆచార్యకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు
2020 ఫిబ్రవరి 25న ప్రదానం
భారత వనరులను ఆంగ్లేయులు ఏ విధంగా అపహరించింది, పరిశ్రమల వినాశనాన్ని గురించి.. అందులో వివరించారు. శశిథరూర్ ఇదివరకు రియట్, ది గ్రేట్ ఇండియన్ నావెల్ వంటి నవలలు వై అయామ్ ఏ హిందూ, ది పారాడాక్సికల్ ప్రైమ్మినిస్టర్ వంటి నాన్ ఫిక్షనల్ కథలు రాశారు. 2020 ఫిబ్రవరి 25న దిల్లీలో జరిగే కార్యక్రమంలో పురస్కార గ్రహీతలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.