ETV Bharat / bharat

శరద్ పవార్​కు ఐటీ శాఖ నోటీసులు - Aaditya Thackeray gets Income Tax notice

ఎన్​సీపీ అధినేత శరద్ పవార్​కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని పవార్ స్వయంగా వెల్లడించారు. తనతో పాటు లోక్​సభ ఎంపీ సుప్రియా సూలే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మంత్రి ఆదిత్య ఠాక్రేకు నోటీసులు అందినట్లు స్పష్టం చేశారు.

Sharad Pawar gets Income Tax notice over poll affidavits
శరద్ పవార్​కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు
author img

By

Published : Sep 22, 2020, 4:36 PM IST

ఆదాయపు పన్ను శాఖ తనకు నోటీసులు జారీ చేసినట్లు ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. ఎన్నికల కమిషన్​కు సమర్పించిన అఫిడవిట్​కు సంబంధించి వీటిని పంపించినట్లు చెప్పారు. పోల్ అఫిడవిట్​పై వివరణ కోరినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

"ఈ నోటీసులు నిన్న వచ్చాయి. ఎన్నికల కమిషన్ ఆదేశించిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ మాకు నోటీసులు జారీ చేసింది. దీనిపై మా స్పందన తెలియజేస్తాం. సభ్యులందరిలో మాపైనే వారు(కేంద్ర ప్రభుత్వం) ప్రేమ చూపించినందుకు సంతోషంగా ఉంది."

-శరద్ పవార్, ఎన్​సీపీ అధినేత

తనతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే, తన కుమార్తె, లోక్​సభ ఎంపీ సుప్రియా సూలే సైతం నోటీసులు అందుకున్నారని పవార్ తెలిపారు.

రాష్ట్రపతి పాలనపై

మరోవైపు.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించనున్నారనే వార్తలను పవార్ తీవ్రంగా ఖండించారు.

"రాష్ట్రపతి పాలన విధించడానికి ఏదైనా కారణం ఉందా? రాష్ట్రపతి పాలన ఏమైనా హాస్యాస్పదమా? మహా వికాస్ ఆఘాడీకి రాష్ట్ర అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉంది."

-శరద్ పవార్, ఎన్​సీపీ అధినేత

ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడాన్ని పవార్ తప్పుబట్టారు.

ఆదాయపు పన్ను శాఖ తనకు నోటీసులు జారీ చేసినట్లు ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. ఎన్నికల కమిషన్​కు సమర్పించిన అఫిడవిట్​కు సంబంధించి వీటిని పంపించినట్లు చెప్పారు. పోల్ అఫిడవిట్​పై వివరణ కోరినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

"ఈ నోటీసులు నిన్న వచ్చాయి. ఎన్నికల కమిషన్ ఆదేశించిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ మాకు నోటీసులు జారీ చేసింది. దీనిపై మా స్పందన తెలియజేస్తాం. సభ్యులందరిలో మాపైనే వారు(కేంద్ర ప్రభుత్వం) ప్రేమ చూపించినందుకు సంతోషంగా ఉంది."

-శరద్ పవార్, ఎన్​సీపీ అధినేత

తనతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే, తన కుమార్తె, లోక్​సభ ఎంపీ సుప్రియా సూలే సైతం నోటీసులు అందుకున్నారని పవార్ తెలిపారు.

రాష్ట్రపతి పాలనపై

మరోవైపు.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించనున్నారనే వార్తలను పవార్ తీవ్రంగా ఖండించారు.

"రాష్ట్రపతి పాలన విధించడానికి ఏదైనా కారణం ఉందా? రాష్ట్రపతి పాలన ఏమైనా హాస్యాస్పదమా? మహా వికాస్ ఆఘాడీకి రాష్ట్ర అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉంది."

-శరద్ పవార్, ఎన్​సీపీ అధినేత

ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడాన్ని పవార్ తప్పుబట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.