ETV Bharat / bharat

'ప్రజలకు పోరాడే హక్కు ఉంది కానీ...' - హింసాత్మకంగా పౌరచట్ట ఆందోళన

సీఏఏకు వ్యతిరేకంగా దిల్లీ షాహీన్​భాగ్​లో గత రెండు నెలలుగా కొనసాగుతున్న నిరసనలపై దాఖలైన పిటిషన్​పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ప్రభుత్వ విధానాలపై పోరాడే హక్కు ప్రజలకు ఉన్నా సమతూకం పాటించాలని అభిప్రాయపడింది. ప్రజలకు ఇబ్బంది కలగని మరోచోట ఆందోళనలు చేపట్టేందుకు నిరసనకారులను ఒప్పించాలని ఇద్దరు న్యాయవాదులను నియమించింది.

supreme
షహీన్​భాగ్ నిరసనలపై సుప్రీం విచారణ
author img

By

Published : Feb 17, 2020, 4:45 PM IST

Updated : Mar 1, 2020, 3:18 PM IST

ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడటం ప్రజల ప్రాథమిక హక్కు అయినప్పటికీ ఉద్యమాలకు సంయమనం అవసరమని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. రహదారులను దిగ్బంధించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని వ్యాఖ్యానించింది. సీఏఏకు వ్యతిరేకంగా దిల్లీ షాహీన్​భాగ్​లో జరుగుతున్న ఆందోళనలపై న్యాయవాది అమిత్​ సాహ్నీ దాఖలు చేసిన పిటిషన్​పై జస్టిస్ ఎస్​కే కౌల్, కేఎం జోసెఫ్​ల ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు సీనియర్ న్యాయవాదులు సంజయ్ హెగ్డే, సాధన రామచంద్రన్​ను మధ్యవర్తులుగా నియమించింది సుప్రీంకోర్టు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగని చోట నిరసన తెలిపేలా ఆందోళనకారులను ఒప్పించాలని సూచించింది. ఒకవేళ ఫలితం లేకుంటే నిర్ణయాధికారం అధికారులకే వదిలేస్తామని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.

వాదనల సందర్భంగా

అభిప్రాయాలను వ్యక్తీకరించడం ఆధారంగానే ప్రజాస్వామ్యం పనిచేస్తుందని... అయితే అందుకు కొన్ని హద్దులుంటాయని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా ఓ అభ్యర్థనను న్యాయస్థానం ముందుంచారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. నిరసనలతో ప్రతి వ్యవస్థ లొంగిపోతుందనే సందేశాన్ని ఇవ్వకూడదని కోరారు. సుప్రీం ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు.

ప్రాథమిక హక్కుల సంగతేమిటి?

ఆందోళనల కారణంగా ఇబ్బంది పడుతున్న సాధారణ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని మరో పిటిషన్ దాఖలు చేశారు భాజపా నేత నందకిషోర్ గార్గ్​. షాహీన్​భాగ్ నిరసనకారులను అక్కడినుంచి తరలించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ దిల్లీలోని షాహీన్‌ బాగ్‌లో గత రెండు నెలలుగా కొందరు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా నిరసన పేరుతో రోడ్లను నిర్బంధించడంపై దాఖలైన పిటిషన్లపైనే ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇదీ చూడండి: ఆప్​: 'ఇదే సరైన తరుణం.. జాతీయ పార్టీగా ఎదుగుదాం'

ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడటం ప్రజల ప్రాథమిక హక్కు అయినప్పటికీ ఉద్యమాలకు సంయమనం అవసరమని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. రహదారులను దిగ్బంధించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని వ్యాఖ్యానించింది. సీఏఏకు వ్యతిరేకంగా దిల్లీ షాహీన్​భాగ్​లో జరుగుతున్న ఆందోళనలపై న్యాయవాది అమిత్​ సాహ్నీ దాఖలు చేసిన పిటిషన్​పై జస్టిస్ ఎస్​కే కౌల్, కేఎం జోసెఫ్​ల ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు సీనియర్ న్యాయవాదులు సంజయ్ హెగ్డే, సాధన రామచంద్రన్​ను మధ్యవర్తులుగా నియమించింది సుప్రీంకోర్టు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగని చోట నిరసన తెలిపేలా ఆందోళనకారులను ఒప్పించాలని సూచించింది. ఒకవేళ ఫలితం లేకుంటే నిర్ణయాధికారం అధికారులకే వదిలేస్తామని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.

వాదనల సందర్భంగా

అభిప్రాయాలను వ్యక్తీకరించడం ఆధారంగానే ప్రజాస్వామ్యం పనిచేస్తుందని... అయితే అందుకు కొన్ని హద్దులుంటాయని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా ఓ అభ్యర్థనను న్యాయస్థానం ముందుంచారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. నిరసనలతో ప్రతి వ్యవస్థ లొంగిపోతుందనే సందేశాన్ని ఇవ్వకూడదని కోరారు. సుప్రీం ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు.

ప్రాథమిక హక్కుల సంగతేమిటి?

ఆందోళనల కారణంగా ఇబ్బంది పడుతున్న సాధారణ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని మరో పిటిషన్ దాఖలు చేశారు భాజపా నేత నందకిషోర్ గార్గ్​. షాహీన్​భాగ్ నిరసనకారులను అక్కడినుంచి తరలించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ దిల్లీలోని షాహీన్‌ బాగ్‌లో గత రెండు నెలలుగా కొందరు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా నిరసన పేరుతో రోడ్లను నిర్బంధించడంపై దాఖలైన పిటిషన్లపైనే ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇదీ చూడండి: ఆప్​: 'ఇదే సరైన తరుణం.. జాతీయ పార్టీగా ఎదుగుదాం'

Last Updated : Mar 1, 2020, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.