ETV Bharat / bharat

చైనాలోని 7 వైమానిక స్థావరాలపై భారత్​ నిఘా!

author img

By

Published : Aug 21, 2020, 5:44 AM IST

వాస్తవాధీన రేఖ వెంబడి చైనా వాయుసేన కార్యకలపాలు పెరుగుతన్న నేపథ్యంలో భారత్​ అప్రమత్తమైంది. వివిధ మార్గాల్లో చైనా కదలికలను భారత్​ నిశితంగా పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా నుంచి వచ్చే ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు భారత్​ పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశాయి.

plaaf
చైనా వాయుసేన స్థావరాలు

సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా వాయుసేన కదలికలపై భారత నిఘా ఏజెన్సీలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. లద్దాఖ్​ నుంచి ఆరుణాచల్​ ప్రదేశ్​ వరకు ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి పీపుల్స్​ లిబరేషన్ ఆర్మీ వాయుసేన కదలికలపై నిఘా ఉంచాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

"టిబెట్​, జిన్​జియాంగ్​ ప్రాంతాల్లోని హొటన్​, ఝార్​ గున్సా, కష్​ఘర్​, హాపింగ్, ఢొంగా జాంగ్​, లింఝి, పన్​ఘాట్​ వాయుస్థావరాలపై నిఘా పెట్టాం. ఇటీవల కాలంలో ఈ ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలు భారీగా పెరిగాయి."

- ప్రభుత్వ వర్గాలు

ఈ స్థావరాల్లో చైనా వాయుసేన వివిధ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటోంది. గుడారాలు, రన్​వే పొడిగింపు, అదనపు మానవ వనరులను సమకూర్చుకుంటోందని సమాచారం. ఈశాన్య రాష్ట్రాలకు సమీపంలోని లింఝిలో భారీగా హెలిపాడ్లను నిర్మించినట్లు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాలపై నిఘా పెట్టేందుకు చైనా ఈ చర్యలు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

విమానాల మోహరింపు..

లద్దాఖ్​ సెక్టార్​ సమీపంలో సుఖోయ్​-30, జే- శ్రేణి విమానాలను చైనా మోహరించినట్లు తెలుస్తోంది. వీటిపైనా భారత ఏజెన్సీలు శాటిలైట్​, ఇతర మార్గాల ద్వారా దృష్టి సారించినట్లు సమాచారం. చైనా దూకుడు నేపథ్యంలో దీటుగా స్పందించేందుకు భారత్​ కూడా అప్రమత్తమైంది. లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి సుఖోయ్​-30ఎంకేఐ, మిగ్-29ఎస్, మిరేజ్-2000 యుద్ధ విమానాలను భారీగా మోహరించింది.

ఇదీ చూడండి: 'సరిహద్దు సమస్యకు వేగవంతమైన పరిష్కారానికి కృషి'

సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా వాయుసేన కదలికలపై భారత నిఘా ఏజెన్సీలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. లద్దాఖ్​ నుంచి ఆరుణాచల్​ ప్రదేశ్​ వరకు ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి పీపుల్స్​ లిబరేషన్ ఆర్మీ వాయుసేన కదలికలపై నిఘా ఉంచాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

"టిబెట్​, జిన్​జియాంగ్​ ప్రాంతాల్లోని హొటన్​, ఝార్​ గున్సా, కష్​ఘర్​, హాపింగ్, ఢొంగా జాంగ్​, లింఝి, పన్​ఘాట్​ వాయుస్థావరాలపై నిఘా పెట్టాం. ఇటీవల కాలంలో ఈ ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలు భారీగా పెరిగాయి."

- ప్రభుత్వ వర్గాలు

ఈ స్థావరాల్లో చైనా వాయుసేన వివిధ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటోంది. గుడారాలు, రన్​వే పొడిగింపు, అదనపు మానవ వనరులను సమకూర్చుకుంటోందని సమాచారం. ఈశాన్య రాష్ట్రాలకు సమీపంలోని లింఝిలో భారీగా హెలిపాడ్లను నిర్మించినట్లు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాలపై నిఘా పెట్టేందుకు చైనా ఈ చర్యలు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

విమానాల మోహరింపు..

లద్దాఖ్​ సెక్టార్​ సమీపంలో సుఖోయ్​-30, జే- శ్రేణి విమానాలను చైనా మోహరించినట్లు తెలుస్తోంది. వీటిపైనా భారత ఏజెన్సీలు శాటిలైట్​, ఇతర మార్గాల ద్వారా దృష్టి సారించినట్లు సమాచారం. చైనా దూకుడు నేపథ్యంలో దీటుగా స్పందించేందుకు భారత్​ కూడా అప్రమత్తమైంది. లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి సుఖోయ్​-30ఎంకేఐ, మిగ్-29ఎస్, మిరేజ్-2000 యుద్ధ విమానాలను భారీగా మోహరించింది.

ఇదీ చూడండి: 'సరిహద్దు సమస్యకు వేగవంతమైన పరిష్కారానికి కృషి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.