ETV Bharat / bharat

బాబ్రీ కేసులో సుప్రీంకోర్టు కొత్త డెడ్‌లైన్‌

author img

By

Published : Aug 22, 2020, 7:29 PM IST

బాబ్రీ మసీదు కేసు విచారణ గడువును మరో నెలరోజుల పాటు పొడింగించింది సుప్రీంకోర్టు. కొత్త డెడ్​లైన్​ను విధిస్తూ విచారణను సెప్టెంబర్​ 30 నాటికి పూర్తి చేసి తీర్పును వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది.

Babri-Masjid-Demolition-case-Verdict
బాబ్రీ కేసులో సుప్రీం కోర్టు కొత్త డెడ్‌లైన్‌

బాబ్రీ మసీదు కేసు విచారణను సెప్టెంబర్‌ 30 నాటికి పూర్తి చేసి తీర్పు వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మరింత సమయం కావాలని కోరిన నేపథ్యంలో ఆగస్టు 31తో ముగియనున్న గడువును సర్వోన్నత న్యాయస్థానం మరో నెల రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు జస్టిస్‌ రొహింటన్‌ నారీమన్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

మూడోసారి..

1992 బాబ్రీ మసీదు కేసులో భాజపా అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో రెండేళ్లలో విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని 2017లో సుప్రీం కోర్టు ఆదేశించింది. 2019 జులైలో ఆ గడువును మరో 9 నెలలు, ఈ ఏడాది మేలో మరో మూడు నెలల(ఆగస్టు 31) వరకు గడువును పొడిగించింది. అయితే మరోసారి గడువు పొడిగించాలంటూ తాజాగా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సురేంద్రకుమార్‌ యాదవ్‌ కోరిన నేపథ్యంలో ఈ సారి మరో నెల రోజులు గడువు పొడిగించింది.

వాంగ్మూలాల నమోదు..

మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొటుంటున్న అడ్వాణీ, జోషి ఇటీవలే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. 100 ప్రశ్నలను సీబీఐ న్యాయస్థానం సంధించగా.. తనపై వచ్చిన ఆరోపణలను అడ్వాణీ ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగా తమను ఈ కేసులో ఇరికించారని మురళీ మనోహర్‌ జోషి కోర్టుకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌, ఉమా భారతి కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. మరో ముగ్గురు వృద్ధాప్యంతో ఇప్పటికే కన్నుమూశారు.

ఇదీ చూడండి: బాబ్రీ కేసు నిందితుల వాంగ్మూలం నమోదు పూర్తి

బాబ్రీ మసీదు కేసు విచారణను సెప్టెంబర్‌ 30 నాటికి పూర్తి చేసి తీర్పు వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మరింత సమయం కావాలని కోరిన నేపథ్యంలో ఆగస్టు 31తో ముగియనున్న గడువును సర్వోన్నత న్యాయస్థానం మరో నెల రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు జస్టిస్‌ రొహింటన్‌ నారీమన్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

మూడోసారి..

1992 బాబ్రీ మసీదు కేసులో భాజపా అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో రెండేళ్లలో విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని 2017లో సుప్రీం కోర్టు ఆదేశించింది. 2019 జులైలో ఆ గడువును మరో 9 నెలలు, ఈ ఏడాది మేలో మరో మూడు నెలల(ఆగస్టు 31) వరకు గడువును పొడిగించింది. అయితే మరోసారి గడువు పొడిగించాలంటూ తాజాగా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సురేంద్రకుమార్‌ యాదవ్‌ కోరిన నేపథ్యంలో ఈ సారి మరో నెల రోజులు గడువు పొడిగించింది.

వాంగ్మూలాల నమోదు..

మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొటుంటున్న అడ్వాణీ, జోషి ఇటీవలే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. 100 ప్రశ్నలను సీబీఐ న్యాయస్థానం సంధించగా.. తనపై వచ్చిన ఆరోపణలను అడ్వాణీ ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగా తమను ఈ కేసులో ఇరికించారని మురళీ మనోహర్‌ జోషి కోర్టుకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌, ఉమా భారతి కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. మరో ముగ్గురు వృద్ధాప్యంతో ఇప్పటికే కన్నుమూశారు.

ఇదీ చూడండి: బాబ్రీ కేసు నిందితుల వాంగ్మూలం నమోదు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.