ETV Bharat / bharat

సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​ శంకుస్థాపనకు సుప్రీం అనుమతి

పెండింగ్​ వ్యాజ్యాలపై నిర్ణయం తీసుకునే వరకు సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టకూడదని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. అందుకు కేంద్రం హామీ ఇవ్వటంతో ప్రాజెక్టు శంకుస్థాపన చేసేందుకు అనుమతి ఇచ్చింది.

author img

By

Published : Dec 7, 2020, 11:23 AM IST

Updated : Dec 7, 2020, 11:45 AM IST

supreme court
సుప్రీం కోర్టు

దిల్లీలో రాష్ట్రపతి భవన్​ నుంచి ఇండియా గేట్​ వరకు నిర్మించ తలపెట్టిన సెంట్రల్​ విస్టాపై కీలక ఆదేశాలిచ్చింది సుప్రీం కోర్టు. ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పెండింగ్​లో ఉన్న వ్యాజ్యాలపై నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి నిర్మాణాలు, లేదా కూల్చివేతలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. అయితే.. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన కాగితపు వర్క్​, ప్రతిపాదిత గ్రౌండ్​ బ్రేకింగ్​ వేడుకలతో ముందుకుసాగొచ్చని చెప్పింది.

సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​పై దాఖలైన పలు వ్యాజ్యాలపై.. జస్టిస్​ ఏఎం ఖాన్​విల్కర్​ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రాజెక్టు పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది ధర్మాసనం. ఈ సందర్భంగా.. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం వెలువడే వరకు ప్రాజెక్టులో నిర్మాణాలు, కూల్చువేతల వంటివి చేపట్టబోమని ధర్మాసనానికి హామీ ఇచ్చారు సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా. ఆ క్రమంలో.. సెంట్రల్​ విస్టా ప్రాజెస్ట్​ శంకుస్థాపనకు అనుమతించింది న్యాయస్థానం.

నూతన పార్లమెంట్​ భవనం సహా ఇతర విభాగాల నిర్మాణాలు ఒకే చోట చేపట్టేందుకు గత ఏడాది సెప్టెంబర్​లో ఈ ప్రాజెక్టును ప్రకటించింది కేంద్రం. దేశ 75స్వాతంత్య్ర దినోత్సవం 2022, ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే ప్రాజెక్టులో ఉమ్మడి కేంద్ర సచివాలయాన్ని 2024 వరకు నిర్మించతలపెట్టారు.

డిసెంబర్​ 10న పార్లమెంట్​ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. రూ.971 కోట్లతో చేపడుతోన్న ఈ నిర్మాణాన్ని 2022లోపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా.

ఇదీ చూడండి: సెంట్రల్​ విస్టా నిర్మాణం మంచిదే: కేంద్రం

దిల్లీలో రాష్ట్రపతి భవన్​ నుంచి ఇండియా గేట్​ వరకు నిర్మించ తలపెట్టిన సెంట్రల్​ విస్టాపై కీలక ఆదేశాలిచ్చింది సుప్రీం కోర్టు. ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పెండింగ్​లో ఉన్న వ్యాజ్యాలపై నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి నిర్మాణాలు, లేదా కూల్చివేతలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. అయితే.. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన కాగితపు వర్క్​, ప్రతిపాదిత గ్రౌండ్​ బ్రేకింగ్​ వేడుకలతో ముందుకుసాగొచ్చని చెప్పింది.

సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​పై దాఖలైన పలు వ్యాజ్యాలపై.. జస్టిస్​ ఏఎం ఖాన్​విల్కర్​ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రాజెక్టు పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది ధర్మాసనం. ఈ సందర్భంగా.. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం వెలువడే వరకు ప్రాజెక్టులో నిర్మాణాలు, కూల్చువేతల వంటివి చేపట్టబోమని ధర్మాసనానికి హామీ ఇచ్చారు సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా. ఆ క్రమంలో.. సెంట్రల్​ విస్టా ప్రాజెస్ట్​ శంకుస్థాపనకు అనుమతించింది న్యాయస్థానం.

నూతన పార్లమెంట్​ భవనం సహా ఇతర విభాగాల నిర్మాణాలు ఒకే చోట చేపట్టేందుకు గత ఏడాది సెప్టెంబర్​లో ఈ ప్రాజెక్టును ప్రకటించింది కేంద్రం. దేశ 75స్వాతంత్య్ర దినోత్సవం 2022, ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే ప్రాజెక్టులో ఉమ్మడి కేంద్ర సచివాలయాన్ని 2024 వరకు నిర్మించతలపెట్టారు.

డిసెంబర్​ 10న పార్లమెంట్​ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. రూ.971 కోట్లతో చేపడుతోన్న ఈ నిర్మాణాన్ని 2022లోపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా.

ఇదీ చూడండి: సెంట్రల్​ విస్టా నిర్మాణం మంచిదే: కేంద్రం

Last Updated : Dec 7, 2020, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.