ETV Bharat / bharat

'మైనారిటీ' పిల్​పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

author img

By

Published : Aug 28, 2020, 3:58 PM IST

దేశంలో మైనార్టీలు ఎవరో గుర్తించే పద్ధతిని మార్చాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని.. శుక్రవారం విచారించింది సుప్రీంకోర్టు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.

SC notice to Centre on PILto frame guidelines for identifying minorities at state level
మైనారిటీల జాబితా విషయంలో కేంద్రానికి సుప్రీం నోటీసులు

మైనార్టీలను జాతీయ స్థాయి గణాంకాల ఆధారంగా కాకుండా రాష్ట్ర స్థాయి గణాంకాల ప్రకారం గుర్తించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం(ఆగస్టు 28న) విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. మైనార్టీలను గుర్తించేందుకు రాష్ట్ర స్థాయిలో కేంద్రం రూపొందించిన విధి విధానాలను తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ, న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖలకు నోటీసులు జారీ చేసింది.

వ్యాజ్యం దాఖలు చేసిన భాజపా నేత, న్యాయవాది అశ్వినీకుమార్​ ఉపాధ్యాయ.. దాదాపు 10 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నట్లు ఆ పిల్​లో పేర్కొన్నారు. అయితే వారిని మైనార్టీలుగా ప్రకటించలేదని ఆయన కోర్టుకు తెలిపారు.

ఇదీ వాదన...

ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలను మైనార్టీలుగా గుర్తిస్తూ 26 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసింది. దాన్ని సవాలు చేస్తూ 'మైనార్టీ' అనే పదాన్ని రాష్ట్రస్థాయి జనాభా ఆధారంగా నిర్వచించాలని అశ్వినీకుమార్​ పిటిషన్​ దాఖలు చేశారు. జాతీయ మైనార్టీ విద్యా సంస్థ చట్టం 2004లోని సెక్షన్ 2 చెల్లుబాటును ఆయన సవాలు చేశారు. ఈ విషయంలో కేంద్రానికి విశేష అధికారులు ఇవ్వటం, ఏకపక్షంగా, అహేతుకంగా ఉందని పేర్కొన్నారు.

జాతీయ స్థాయి గణాంకాల ఆధారంగా మెజార్టీగా ఉన్న హిందువులు.. కొన్ని ఈశాన్య రాష్ట్రాలతో పాటు, జమ్ముకశ్మీర్​లో మైనార్టీలుగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు పిటిషనర్​. ఆయా రాష్ట్రాల్లో హిందువులకు మైనార్టీలకు అందాల్సిన ప్రయోజనాలు లభించడం లేదని తెలిపారు. 2011 ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం.. 8 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్న విషయం తెలిసిందే.

మైనార్టీలను జాతీయ స్థాయి గణాంకాల ఆధారంగా కాకుండా రాష్ట్ర స్థాయి గణాంకాల ప్రకారం గుర్తించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం(ఆగస్టు 28న) విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. మైనార్టీలను గుర్తించేందుకు రాష్ట్ర స్థాయిలో కేంద్రం రూపొందించిన విధి విధానాలను తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ, న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖలకు నోటీసులు జారీ చేసింది.

వ్యాజ్యం దాఖలు చేసిన భాజపా నేత, న్యాయవాది అశ్వినీకుమార్​ ఉపాధ్యాయ.. దాదాపు 10 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నట్లు ఆ పిల్​లో పేర్కొన్నారు. అయితే వారిని మైనార్టీలుగా ప్రకటించలేదని ఆయన కోర్టుకు తెలిపారు.

ఇదీ వాదన...

ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలను మైనార్టీలుగా గుర్తిస్తూ 26 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసింది. దాన్ని సవాలు చేస్తూ 'మైనార్టీ' అనే పదాన్ని రాష్ట్రస్థాయి జనాభా ఆధారంగా నిర్వచించాలని అశ్వినీకుమార్​ పిటిషన్​ దాఖలు చేశారు. జాతీయ మైనార్టీ విద్యా సంస్థ చట్టం 2004లోని సెక్షన్ 2 చెల్లుబాటును ఆయన సవాలు చేశారు. ఈ విషయంలో కేంద్రానికి విశేష అధికారులు ఇవ్వటం, ఏకపక్షంగా, అహేతుకంగా ఉందని పేర్కొన్నారు.

జాతీయ స్థాయి గణాంకాల ఆధారంగా మెజార్టీగా ఉన్న హిందువులు.. కొన్ని ఈశాన్య రాష్ట్రాలతో పాటు, జమ్ముకశ్మీర్​లో మైనార్టీలుగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు పిటిషనర్​. ఆయా రాష్ట్రాల్లో హిందువులకు మైనార్టీలకు అందాల్సిన ప్రయోజనాలు లభించడం లేదని తెలిపారు. 2011 ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం.. 8 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్న విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.