ETV Bharat / bharat

'నల్లకోటుతో కాదు.. తెల్లచొక్కాతోనే విచారణ' - 'నల్లకోటుతో కాదు.. తెల్లచొక్కాతోనే కేసుల విచారణ'

న్యాయమూర్తులు, న్యాయవాదులు నల్లకోటు ధరించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీం కోర్టు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ నియమం అమల్లో ఉంటుందని వెల్లడించింది. కరోనా వైరస్​ వేగంగా వ్యాపించే అవకాశం ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

SC asks lawyers not to put on coat, long gowns during COVID-19 pandemic
నల్లకోటుతో కాదు తెల్లచొక్కాతోనే కేసుల విచారణ
author img

By

Published : May 13, 2020, 8:16 PM IST

Updated : May 13, 2020, 8:23 PM IST

దేశంలో కరోనా వైరస్​ వ్యాప్తి తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. వీడియో కాన్ఫరెన్స్​ విచారణ సమయంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు నల్లకోటు, పొడవాటి గౌను ధరించకూడదని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. వైరస్​ను నిర్ములించే ఔషధాలు వచ్చే వరకు లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. వాటిని ధరించడం వల్ల వైరస్​ సులభంగా సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

"వైరస్​ వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో.. వైద్యుల సలహాలను పరిగణలోకి తీసుకుని అందరికీ ఈ సమాచారం తెలియజేస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరుగుతున్న కేసు విచారణ సమయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు 'సాధారణ తెలుపు చొక్కా లేదా తెలుపు సల్వార్​ కమీజ్​ లేదా తెలుపు చీర, సాధారణ తెలుపు టై'ని ధరించాలి. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది." -సుప్రీంకోర్టు ఉత్తర్వులు

విచారణ సమయంలో...

బుధవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఓ కేసు విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే, జస్టిస్​ ఇందు మల్హోత్రా, జస్టిస్​ హృషికేశ్​ రాయ్​ నల్లకోటు ధరించకుండా కనిపించారు. ఆ సమయంలో సీనియర్​ అడ్వకేట్​ కపిల్​ సిబల్​ వాదనలు వినిపిస్తున్నారు. కొంత కాలం వరకు విచారణల్లో అసలు కోటు ధరించకూడదని ధర్మాసనం ప్రకటించింది.

ఇదీ చూడండి: 'ఆర్థిక ప్యాకేజీతో వ్యాపారుల సమస్యలు మాయం'

దేశంలో కరోనా వైరస్​ వ్యాప్తి తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. వీడియో కాన్ఫరెన్స్​ విచారణ సమయంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు నల్లకోటు, పొడవాటి గౌను ధరించకూడదని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. వైరస్​ను నిర్ములించే ఔషధాలు వచ్చే వరకు లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. వాటిని ధరించడం వల్ల వైరస్​ సులభంగా సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

"వైరస్​ వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో.. వైద్యుల సలహాలను పరిగణలోకి తీసుకుని అందరికీ ఈ సమాచారం తెలియజేస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరుగుతున్న కేసు విచారణ సమయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు 'సాధారణ తెలుపు చొక్కా లేదా తెలుపు సల్వార్​ కమీజ్​ లేదా తెలుపు చీర, సాధారణ తెలుపు టై'ని ధరించాలి. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది." -సుప్రీంకోర్టు ఉత్తర్వులు

విచారణ సమయంలో...

బుధవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఓ కేసు విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే, జస్టిస్​ ఇందు మల్హోత్రా, జస్టిస్​ హృషికేశ్​ రాయ్​ నల్లకోటు ధరించకుండా కనిపించారు. ఆ సమయంలో సీనియర్​ అడ్వకేట్​ కపిల్​ సిబల్​ వాదనలు వినిపిస్తున్నారు. కొంత కాలం వరకు విచారణల్లో అసలు కోటు ధరించకూడదని ధర్మాసనం ప్రకటించింది.

ఇదీ చూడండి: 'ఆర్థిక ప్యాకేజీతో వ్యాపారుల సమస్యలు మాయం'

Last Updated : May 13, 2020, 8:23 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.