ETV Bharat / bharat

ట్రంప్ భారత పర్యటన శుష్క ప్రయత్నం: కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్

author img

By

Published : Feb 26, 2020, 6:03 PM IST

Updated : Mar 2, 2020, 4:00 PM IST

అమెరికా అధ్యక్షుడు చేపట్టిన రెండు రోజుల భారత పర్యటన వల్ల ఒరిగిందేమీలేదని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. వాణిజ్యం, భద్రత వంటి రంగాల్లో ఎలాంటి కీలక ప్రకటనలు లేకుండానే ముగిసిందని విమర్శించారు. ఈ పర్యటన అధ్యక్షుడు ట్రంప్​కే లాభదాయకమని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్రంప్ పర్యటన సహా పలు విషయాలపై సీనియర్ పాత్రికేయులు అమిత్ అగ్నిహోత్రికి ఇచ్చిన ముఖాముఖిలో చర్చించారు.

Salman Khurshid
సల్మాన్ ఖుర్షీద్
సల్మాన్ ఖుర్షీద్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్యం భద్రత వంటి రంగాలలో పెద్దగా కీలక ప్రకటనలేవీ లేకుండానే ముగిసింది. ట్రంప్ పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ పెదవి విరిచారు. నమస్తే ట్రంప్ అంటూ గుజరాత్​లో జరిగిన ప్రదర్శన శుష్కమైనదిగా సీనియర్ పాత్రికేయుడు అమిత్ అగ్నిహోత్రికి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. ట్రంప్ పర్యటన వల్ల నిర్మాణాత్మకమైన ప్రయోజనాలు సమకూరలేదని విమర్శించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశ పర్యటనపై భారీ అంచనాలతో విస్తృత ప్రచారం జరిగింది. ఈ పర్యటన వలన విదేశీ విధాన పరంగా దేశానికి బహుళ ప్రయోజనాలు చూకూరాయని మోదీ ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ పర్యటనను మీరెలా చూస్తారు?

ఇందులో ప్రచార ఆర్భాటం తప్ప ఒరిగింది శూన్యం. ఈ పర్యటన కోసం ఎంతో ఖర్చు చేశారు. ఒక ప్రధాన దేశాధినేత మన దేశం వచ్చి, మనతో స్నేహ పూర్వకంగా కనిపించడం మనకూ గర్వ కారణమే. అయితే అంతా ముగిసిన తరువాత మనకు ఒనగూరిన ప్రయోజనాలు ఏమీ లేవనే అనిపిస్తోంది. పర్యటనకు ఇంత భారీ స్థాయిలో ప్రచారం చేసినప్పటికీ మనకు జరిగిన లాభాలు బేరీజు వేసుకుంటే మనకు చేకూరిన లాభాలు ఏమీ లేవు. ఈ పర్యటన కేవలం ట్రంప్​కే లాభం.

అమెరికా అధ్యక్షుడి పర్యటన కేవలం త్వరలో జరగనున్న ఆ దేశ అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జరిగిందా? ట్రంప్ యావ కేవలం అధ్యక్ష ఎన్నికలపైనే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు?

అందులో నిజం లేకపోలేదు. మరో ఆరు నెలల్లో ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. సహజంగా ఎన్నికలపైనే ఆ దృష్టంతా ఉంటుంది. దేశాల మధ్య సంబంధాలు వ్యక్తులను ఆధారంగా చేసుకుని జరగవు. ఇరు దేశాల ప్రజలను ఆధారంగా చేసుకుని ఉంటాయి. అమెరికాతో మన సంబంధాలు ఆ దేశ ప్రజలతో కూడుకున్నది. గతంలో మనకు అమెరికాతో కొన్ని సమస్యలున్న మాట వాస్తవం. ప్రపంచంలోని పలు అంశాలలో అమెరికాతో మనం ఏకీభవించము. వారి విధానాలన్నింటినీ మనం ఆమోదించలేదు. ఇన్నింటికీ మధ్య ఇరుదేశాల మధ్య సత్సంబంధాలుంటే అది మంచి విషయమే. ఎవరూ తప్పు పట్టలేరు. అయితే ఆ సత్సంబంధాల వల్ల మనకు లాభించిందేమిటన్నదే పెద్ద ప్రశ్న.

చైనా, యూకే, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో భారత్​కు ఏర్పడిన సంబంధాలు, ఒక బలమైన నేతగా మోదీకున్న ప్రతిష్ఠ, ప్రపంచంలో మన దేశ ప్రతిష్ఠను పెంచుతుందా?

నిజంగా అలా జరుగుతోందా. ఏ దేశం మనతో సంప్రదించి ఏ నిర్ణయం తీసుకుంటోంది. జెరూసలేంతో ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో ముందుగా భారత్​ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడుగుతున్నారా. చైనా ఏదో పెద్ద రోడ్ ప్రాజెక్ట్ చేపడుతోంది ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా అని మనల్ని ఫోన్​లో సంప్రదిస్తున్నారా. పాకిస్థాన్ మాకు మిత్రదేశం అనే ముందు ఆయన మనల్ని అడుగుతున్నారా. ముందుగా మనకు వాగ్దానం చేసిన పెట్టుబడులు, ప్రయోజనాలు నిజంగా వచ్చాయా. చైనా, జపాన్ దేశాలు మన వ్యవహార శైలితో సంతృప్తిగా ఉన్నాయా.

ట్రంప్, మోదీల మధ్య సంబంధాల విషయమై ఇప్పుడు గొప్పలు చెప్పుకునే ముందు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు దారులు వేసిన చారిత్రక ఘట్టాలను మరువరాదు, ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నెడీ, అప్పటి మన ప్రధాని నెహ్రూతో కలసి వేసిన అడుగులను మరువరాదు. జాక్వెలిన్ కెనడీని ప్రత్యేకించి మన దేశానికి పంపిన ఘటనను మరువరాదు. ఇరుదేశాల మధ్య ఎంతో జరిగింది ఈ విషయాలన్నీ మోదీకి తెలిసినట్లు లేదు.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్రతిష్ఠ అనూహ్యంగా పెరగలేదంటారా?

ఇప్పుడు కొత్తగా పెరిగిందేమీ లేదు. ఎప్పటి నుంచో భారత్​కు ఆ ప్రతిష్ఠ ఉంది. అలీనోద్యమంలో ప్రపంచంలో మనమే ముందున్నాము. బ్రిక్స్​లో మనం ప్రధాన సీనియర్ భాగస్వామిగా, సార్క్​లో అత్యంత ముఖ్యమైన దేశంగా, ఆసియాన్ దేశాలలో ఆసియా పసిఫిక్ దేశాలలో మనుకున్న ముఖ్యత్వం మోదీ కంటే ముందే జరిగింది. ఆ ప్రతిష్ఠను ఆయన కొనసాగిస్తున్నారు. గత ప్రతిష్ఠను మనం కోల్పోలేదన్నది నా అభిప్రాయం.

భారత్-పాకిస్థాన్ సంబంధాలు ఏవిధంగా ముందుకెళ్లనున్నాయి? మన విదేశీ విధానంలో పాకిస్థాన్​దీ ఓ ముఖ్య పాత్రే కదా?

మనం ఆ దేశంతో పోరాడాలా, ఆ దేశాన్ని తుదముట్టించాలా, మనల్ని మనం కాపాడుకునేందుకు ఆ దేశాన్ని పట్టించుకోకుండా వదిలెయ్యాలా అన్న విషయం నాకు తెలియదు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటామని అంటున్నారు. అది సాధ్యమేనా?

అలా చెయ్యొద్దని ఎవరూ చెప్పడం లేదు. కాకపోతే మేమది చేస్తాం ఇది చేస్తామంటూ ప్రగల్భాలెందుకు. చెయ్యాలనుకున్నది చేసెయ్యండి. మనం పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామంటే దాని ప్రకారం వెళ్లాలి. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసిన తరువాత జరిగే పరిణామాలేమిటి. పాక్ ఆక్రమిత కశ్మీర్ పౌరులు సఖ్యతగా ఉండే పౌరులుగా ఉంటారా లేక మరో తలనొప్పిగా పరిణమించనున్నారా.

దక్షిణాసియా ప్రాంతంలో మనం మెరుగైన అభివృద్ది సాధించామా?

దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి కూటమి(సార్క్) అదృశ్యమైపోయింది. పొరుగు దేశాల నుంచి మనం పొందగలిగి ఉండే విశ్వాసం, మద్దతు ఉందా అన్నది ప్రశ్నార్థకం. అది బాధాకరం. మన పొరుగు దేశాలతో మన సంబంధాలు సత్సంబంధాలు కొనసాగుతుంటే మంచిదే. అందుకు ఎవరు కారకులైనా వారిని అభినందించాలి.

మోదీ ప్రభుత్వ విదేశీ విధానాల లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి?

విదేశీ విధానం మన ప్రయోజనాలు పరిరక్షించేదిగా ఉండాలి. మన విదేశీ విధానంలో ఉన్న తాత్వికతను ప్రపంచమే కొనియాడింది. మనకు అమెరికా, రష్యా, చైనాలాగా మిలటరీ శక్తి సామర్థ్యాలు లేవు. కానీ వాటికి మించి సాంస్కృతికంగా ప్రభావితం చెయ్యగలిగే ఔన్నత్యం మనకుంది. దాన్ని మనమెందుకు లక్ష్యంగా చేసుకోరాదు. గొప్పలు చెప్పుకుంటూ గుండెలు చరచుకోవడం మేలనిపించుకోదు.

ఇదీ చూడండి: గ్రౌండ్​ జీరోలో డోభాల్​- స్థానికుల్లో భరోసా నింపే యత్నం

సల్మాన్ ఖుర్షీద్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్యం భద్రత వంటి రంగాలలో పెద్దగా కీలక ప్రకటనలేవీ లేకుండానే ముగిసింది. ట్రంప్ పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ పెదవి విరిచారు. నమస్తే ట్రంప్ అంటూ గుజరాత్​లో జరిగిన ప్రదర్శన శుష్కమైనదిగా సీనియర్ పాత్రికేయుడు అమిత్ అగ్నిహోత్రికి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. ట్రంప్ పర్యటన వల్ల నిర్మాణాత్మకమైన ప్రయోజనాలు సమకూరలేదని విమర్శించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశ పర్యటనపై భారీ అంచనాలతో విస్తృత ప్రచారం జరిగింది. ఈ పర్యటన వలన విదేశీ విధాన పరంగా దేశానికి బహుళ ప్రయోజనాలు చూకూరాయని మోదీ ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ పర్యటనను మీరెలా చూస్తారు?

ఇందులో ప్రచార ఆర్భాటం తప్ప ఒరిగింది శూన్యం. ఈ పర్యటన కోసం ఎంతో ఖర్చు చేశారు. ఒక ప్రధాన దేశాధినేత మన దేశం వచ్చి, మనతో స్నేహ పూర్వకంగా కనిపించడం మనకూ గర్వ కారణమే. అయితే అంతా ముగిసిన తరువాత మనకు ఒనగూరిన ప్రయోజనాలు ఏమీ లేవనే అనిపిస్తోంది. పర్యటనకు ఇంత భారీ స్థాయిలో ప్రచారం చేసినప్పటికీ మనకు జరిగిన లాభాలు బేరీజు వేసుకుంటే మనకు చేకూరిన లాభాలు ఏమీ లేవు. ఈ పర్యటన కేవలం ట్రంప్​కే లాభం.

అమెరికా అధ్యక్షుడి పర్యటన కేవలం త్వరలో జరగనున్న ఆ దేశ అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జరిగిందా? ట్రంప్ యావ కేవలం అధ్యక్ష ఎన్నికలపైనే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు?

అందులో నిజం లేకపోలేదు. మరో ఆరు నెలల్లో ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. సహజంగా ఎన్నికలపైనే ఆ దృష్టంతా ఉంటుంది. దేశాల మధ్య సంబంధాలు వ్యక్తులను ఆధారంగా చేసుకుని జరగవు. ఇరు దేశాల ప్రజలను ఆధారంగా చేసుకుని ఉంటాయి. అమెరికాతో మన సంబంధాలు ఆ దేశ ప్రజలతో కూడుకున్నది. గతంలో మనకు అమెరికాతో కొన్ని సమస్యలున్న మాట వాస్తవం. ప్రపంచంలోని పలు అంశాలలో అమెరికాతో మనం ఏకీభవించము. వారి విధానాలన్నింటినీ మనం ఆమోదించలేదు. ఇన్నింటికీ మధ్య ఇరుదేశాల మధ్య సత్సంబంధాలుంటే అది మంచి విషయమే. ఎవరూ తప్పు పట్టలేరు. అయితే ఆ సత్సంబంధాల వల్ల మనకు లాభించిందేమిటన్నదే పెద్ద ప్రశ్న.

చైనా, యూకే, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో భారత్​కు ఏర్పడిన సంబంధాలు, ఒక బలమైన నేతగా మోదీకున్న ప్రతిష్ఠ, ప్రపంచంలో మన దేశ ప్రతిష్ఠను పెంచుతుందా?

నిజంగా అలా జరుగుతోందా. ఏ దేశం మనతో సంప్రదించి ఏ నిర్ణయం తీసుకుంటోంది. జెరూసలేంతో ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో ముందుగా భారత్​ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడుగుతున్నారా. చైనా ఏదో పెద్ద రోడ్ ప్రాజెక్ట్ చేపడుతోంది ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా అని మనల్ని ఫోన్​లో సంప్రదిస్తున్నారా. పాకిస్థాన్ మాకు మిత్రదేశం అనే ముందు ఆయన మనల్ని అడుగుతున్నారా. ముందుగా మనకు వాగ్దానం చేసిన పెట్టుబడులు, ప్రయోజనాలు నిజంగా వచ్చాయా. చైనా, జపాన్ దేశాలు మన వ్యవహార శైలితో సంతృప్తిగా ఉన్నాయా.

ట్రంప్, మోదీల మధ్య సంబంధాల విషయమై ఇప్పుడు గొప్పలు చెప్పుకునే ముందు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు దారులు వేసిన చారిత్రక ఘట్టాలను మరువరాదు, ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నెడీ, అప్పటి మన ప్రధాని నెహ్రూతో కలసి వేసిన అడుగులను మరువరాదు. జాక్వెలిన్ కెనడీని ప్రత్యేకించి మన దేశానికి పంపిన ఘటనను మరువరాదు. ఇరుదేశాల మధ్య ఎంతో జరిగింది ఈ విషయాలన్నీ మోదీకి తెలిసినట్లు లేదు.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్రతిష్ఠ అనూహ్యంగా పెరగలేదంటారా?

ఇప్పుడు కొత్తగా పెరిగిందేమీ లేదు. ఎప్పటి నుంచో భారత్​కు ఆ ప్రతిష్ఠ ఉంది. అలీనోద్యమంలో ప్రపంచంలో మనమే ముందున్నాము. బ్రిక్స్​లో మనం ప్రధాన సీనియర్ భాగస్వామిగా, సార్క్​లో అత్యంత ముఖ్యమైన దేశంగా, ఆసియాన్ దేశాలలో ఆసియా పసిఫిక్ దేశాలలో మనుకున్న ముఖ్యత్వం మోదీ కంటే ముందే జరిగింది. ఆ ప్రతిష్ఠను ఆయన కొనసాగిస్తున్నారు. గత ప్రతిష్ఠను మనం కోల్పోలేదన్నది నా అభిప్రాయం.

భారత్-పాకిస్థాన్ సంబంధాలు ఏవిధంగా ముందుకెళ్లనున్నాయి? మన విదేశీ విధానంలో పాకిస్థాన్​దీ ఓ ముఖ్య పాత్రే కదా?

మనం ఆ దేశంతో పోరాడాలా, ఆ దేశాన్ని తుదముట్టించాలా, మనల్ని మనం కాపాడుకునేందుకు ఆ దేశాన్ని పట్టించుకోకుండా వదిలెయ్యాలా అన్న విషయం నాకు తెలియదు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటామని అంటున్నారు. అది సాధ్యమేనా?

అలా చెయ్యొద్దని ఎవరూ చెప్పడం లేదు. కాకపోతే మేమది చేస్తాం ఇది చేస్తామంటూ ప్రగల్భాలెందుకు. చెయ్యాలనుకున్నది చేసెయ్యండి. మనం పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామంటే దాని ప్రకారం వెళ్లాలి. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసిన తరువాత జరిగే పరిణామాలేమిటి. పాక్ ఆక్రమిత కశ్మీర్ పౌరులు సఖ్యతగా ఉండే పౌరులుగా ఉంటారా లేక మరో తలనొప్పిగా పరిణమించనున్నారా.

దక్షిణాసియా ప్రాంతంలో మనం మెరుగైన అభివృద్ది సాధించామా?

దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి కూటమి(సార్క్) అదృశ్యమైపోయింది. పొరుగు దేశాల నుంచి మనం పొందగలిగి ఉండే విశ్వాసం, మద్దతు ఉందా అన్నది ప్రశ్నార్థకం. అది బాధాకరం. మన పొరుగు దేశాలతో మన సంబంధాలు సత్సంబంధాలు కొనసాగుతుంటే మంచిదే. అందుకు ఎవరు కారకులైనా వారిని అభినందించాలి.

మోదీ ప్రభుత్వ విదేశీ విధానాల లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి?

విదేశీ విధానం మన ప్రయోజనాలు పరిరక్షించేదిగా ఉండాలి. మన విదేశీ విధానంలో ఉన్న తాత్వికతను ప్రపంచమే కొనియాడింది. మనకు అమెరికా, రష్యా, చైనాలాగా మిలటరీ శక్తి సామర్థ్యాలు లేవు. కానీ వాటికి మించి సాంస్కృతికంగా ప్రభావితం చెయ్యగలిగే ఔన్నత్యం మనకుంది. దాన్ని మనమెందుకు లక్ష్యంగా చేసుకోరాదు. గొప్పలు చెప్పుకుంటూ గుండెలు చరచుకోవడం మేలనిపించుకోదు.

ఇదీ చూడండి: గ్రౌండ్​ జీరోలో డోభాల్​- స్థానికుల్లో భరోసా నింపే యత్నం

Last Updated : Mar 2, 2020, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.