ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ను ఆయన నివాసంలో కలిశారు క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్. అరగంట పాటు ఇరువురు చర్చించుకున్నారు. భేటీలో రాజకీయ అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తెలిపారు. ఇది సాధారణ సమావేశమేనని పేర్కొన్నారు.
పాకిస్థాన్తో భారత్ ప్రపంచకప్ మ్యాచ్ ఆడాలనిసచిన్ చేసిన వ్యాఖ్యలను భాజపా మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. సచిన్పై విమర్శల వర్షం కురిపించారు.
ఈ విషయంలో సచిన్కు మద్దతుగా నిలిచారు శరద్ పవార్. పాకిస్థాన్ జట్టుపై విజయంతోనే సచిన్ తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని విమర్శకుల నోళ్లు మూయించారు.
మ్యాచ్ ఆడకుండా పాకిస్థాన్కు రెండు కీలక పాయింట్లు అప్పగించడానికి బదులు, మ్యాచ్ ఆడి విజయం సాధిస్తేనే సరైన జవాబిచ్చినట్లవుతుందని సచిన్ స్పష్టత ఇచ్చారు.
ప్రస్తుత భేటీలో దీనికి సంబంధించిన విషయాలే చర్చించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: 'మా నాన్న ఆ పని ఎప్పుడో చేయాల్సింది'