ETV Bharat / bharat

బుల్లెట్​ రైలుకు పర్యావరణ అనుమతులు - రైల్వే శాఖ

గుజరాత్​- మహారాష్ట్ర మధ్య నిర్మించనున్న బుల్లెట్​ రైలు ప్రాజెక్టకు పర్యావరణ అనుమతులు లభించాయని వెల్లడించారు రైల్వే బోర్డు ఛైర్మన్​ వీకే యాదవ్​. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 67శాతం భూమిని సేకరించినట్టు పేర్కొన్నారు.

Rlys got environmental clearances for Mumbai-Ahmedabad Bullet train
బులెట్​ రైలుకు దక్కిన పర్యావరణ అనుమతులు
author img

By

Published : Dec 2, 2020, 12:20 PM IST

అహ్మదాబాద్​-ముంబయి హై స్పీడ్​ రైల్​ కారిడార్​కు అవసరమైన పర్యావరణ (వన్యప్రాణి, అటవీ, కోస్టల్​ రెగ్యులేషన్​ జోన్)​ అనుమతులను పొందినట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. బుల్లెట్​ రైలు​ ప్రాజెక్ట్​పై ఏర్పాటు చేసిన వర్చువల్​ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు రైల్వే బోర్డు ఛైర్మన్​ వీకే. యాదవ్​.

ప్రాజెక్ట్​కు కావాల్సిన భూమిలో ఇప్పటివరకు 67శాతాన్ని సేకరించినట్టు యాదవ్​ తెలిపారు. గుజరాత్​లోని 956 హెక్టార్లలో 825 హెక్టార్లు సమకూర్చినట్టు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని 432 హెక్టార్లలో 97 హెక్టార్లు పొందినట్టు స్పష్టం చేశారు. దాద్రా నగర్​ హవేలీలో 7 హెక్టార్ల భూమి తమ ఆధీనంలో ఉందని వివరించారు యాదవ్​.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నాటి జపాన్​ ప్రధాని షింజో అబే.. 2017 సెప్టెంబర్​లో ఈ ప్రాజెక్ట్​కు శంకుస్థాపన చేశారు. దీని మొత్తం వ్యయం రూ. 1.08 లక్షల కోట్లు. 2023 నాటికి ఈ ప్రాజెక్ట్​ను పూర్తి చేయాల్సి ఉంది.

2022 నాటికి డీఎఫ్​సీ పూర్తి!

2022 నాటికి డీఎఫ్​సీ(డెడికేటెడ్​ ఫ్రైట్​ కారిడర్​) పనులు పూర్తవుతాయని వెల్లడించారు రైల్వే బోర్డు ఛైర్మన్​. దీని వ్యయం రూ. 81,459 కోట్లు అని స్పష్టం చేశారు.

ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద రైల్వే మౌలికవసతుల ప్రాజెక్ట్​ ఈ డీఎఫ్​సీ. దీని మొత్తం పొడవు 3,360 కిలోమీటర్లు.

ఇదీ చూడండి:- 'బుల్లెట్​ ట్రైన్ కాంట్రాక్టులు 72 శాతం దేశీయ సంస్థలకే'

అహ్మదాబాద్​-ముంబయి హై స్పీడ్​ రైల్​ కారిడార్​కు అవసరమైన పర్యావరణ (వన్యప్రాణి, అటవీ, కోస్టల్​ రెగ్యులేషన్​ జోన్)​ అనుమతులను పొందినట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. బుల్లెట్​ రైలు​ ప్రాజెక్ట్​పై ఏర్పాటు చేసిన వర్చువల్​ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు రైల్వే బోర్డు ఛైర్మన్​ వీకే. యాదవ్​.

ప్రాజెక్ట్​కు కావాల్సిన భూమిలో ఇప్పటివరకు 67శాతాన్ని సేకరించినట్టు యాదవ్​ తెలిపారు. గుజరాత్​లోని 956 హెక్టార్లలో 825 హెక్టార్లు సమకూర్చినట్టు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని 432 హెక్టార్లలో 97 హెక్టార్లు పొందినట్టు స్పష్టం చేశారు. దాద్రా నగర్​ హవేలీలో 7 హెక్టార్ల భూమి తమ ఆధీనంలో ఉందని వివరించారు యాదవ్​.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నాటి జపాన్​ ప్రధాని షింజో అబే.. 2017 సెప్టెంబర్​లో ఈ ప్రాజెక్ట్​కు శంకుస్థాపన చేశారు. దీని మొత్తం వ్యయం రూ. 1.08 లక్షల కోట్లు. 2023 నాటికి ఈ ప్రాజెక్ట్​ను పూర్తి చేయాల్సి ఉంది.

2022 నాటికి డీఎఫ్​సీ పూర్తి!

2022 నాటికి డీఎఫ్​సీ(డెడికేటెడ్​ ఫ్రైట్​ కారిడర్​) పనులు పూర్తవుతాయని వెల్లడించారు రైల్వే బోర్డు ఛైర్మన్​. దీని వ్యయం రూ. 81,459 కోట్లు అని స్పష్టం చేశారు.

ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద రైల్వే మౌలికవసతుల ప్రాజెక్ట్​ ఈ డీఎఫ్​సీ. దీని మొత్తం పొడవు 3,360 కిలోమీటర్లు.

ఇదీ చూడండి:- 'బుల్లెట్​ ట్రైన్ కాంట్రాక్టులు 72 శాతం దేశీయ సంస్థలకే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.