ETV Bharat / bharat

ప్రపంచంలో ఏ శక్తీ నన్ను అడ్డుకోలేదు: రాహుల్‌

ఉత్తర్​ప్రదేశ్​లో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్​ నేతృత్వంలోని కాంగ్రెస్​ ఎంపీల బృందం హాథ్రస్​కు వెళ్లనున్నట్టు ఆ పార్టీ తెలిపింది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. దుఃఖంలో ఉన్న బాధితురాలి కుటుంబసభ్యులకు ఓదార్పు అందించకుండా ప్రపంచంలో ఏ శక్తీ తమను అడ్డుకోలేదని ట్విట్టర్​లో పేర్కొన్నారు రాహుల్​.

author img

By

Published : Oct 3, 2020, 12:05 PM IST

Rahul, Priyanka to head to Hathras again on Saturday to meet victim's family
ప్రపంచంలో ఏ శక్తీ నన్ను అడ్డుకోలేదు: రాహుల్‌

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో.. ఆ పార్టీ ఎంపీలు శనివారం మధ్యాహ్నం హాథ్రస్‌ బాధితురాలి కుటుంబాన్ని కలవనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ‌ ప్రకటన ద్వారా వెల్లడించింది. దుఃఖంలో మునిగి ఉన్న ఆ కుటుంబసభ్యులకు ఓదార్పు అందించకుండా ప్రపంచంలో ఏ శక్తీ తమను ఆపలేదని స్పష్టం చేశారు రాహుల్​.

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ అధికార దుర్వినియోగం, అసమర్థతలకు నిరసనగా.. అక్టోబర్‌ 5న దేశవ్యాప్తంగా తాము సత్యాగ్రహాన్ని చేపట్టనున్నట్టు తెలిపింది కాంగ్రెస్​.

Rahul and Priyanka to head to Hathras again on Saturday to meet victim's family
రాహుల్​ గాంధీ ట్వీట్​

అక్టోబర్​ 1న బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను.. పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. అనంతరం అక్కడ వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ కింద పడిపోయారు. పోలీసులు తనను పక్కకు తోసి లాఠీఛార్జి చేశారంటూ రాహుల్‌ ఆరోపించారు. తమను ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారో వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఈ దేశంలో భాజపా, ఆరెస్సెస్‌ నేతలకు తప్ప మిగిలిన వారికి రహదారిపై నడిచే అవకాశం కూడా లేదా? అని రాహుల్​ ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్‌కు రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదని.. ఆయన రాజీనామా చేయాలని ప్రియాంకా గాంధీ సైతం డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: అత్యాచార బాధితురాలి ఆత్మహత్య.. పోలీసులే కారణం!

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో.. ఆ పార్టీ ఎంపీలు శనివారం మధ్యాహ్నం హాథ్రస్‌ బాధితురాలి కుటుంబాన్ని కలవనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ‌ ప్రకటన ద్వారా వెల్లడించింది. దుఃఖంలో మునిగి ఉన్న ఆ కుటుంబసభ్యులకు ఓదార్పు అందించకుండా ప్రపంచంలో ఏ శక్తీ తమను ఆపలేదని స్పష్టం చేశారు రాహుల్​.

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ అధికార దుర్వినియోగం, అసమర్థతలకు నిరసనగా.. అక్టోబర్‌ 5న దేశవ్యాప్తంగా తాము సత్యాగ్రహాన్ని చేపట్టనున్నట్టు తెలిపింది కాంగ్రెస్​.

Rahul and Priyanka to head to Hathras again on Saturday to meet victim's family
రాహుల్​ గాంధీ ట్వీట్​

అక్టోబర్​ 1న బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను.. పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. అనంతరం అక్కడ వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ కింద పడిపోయారు. పోలీసులు తనను పక్కకు తోసి లాఠీఛార్జి చేశారంటూ రాహుల్‌ ఆరోపించారు. తమను ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారో వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఈ దేశంలో భాజపా, ఆరెస్సెస్‌ నేతలకు తప్ప మిగిలిన వారికి రహదారిపై నడిచే అవకాశం కూడా లేదా? అని రాహుల్​ ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్‌కు రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదని.. ఆయన రాజీనామా చేయాలని ప్రియాంకా గాంధీ సైతం డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: అత్యాచార బాధితురాలి ఆత్మహత్య.. పోలీసులే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.