ETV Bharat / bharat

మద్యం మత్తులో భార్య కుటుంబాన్ని కడతేర్చిన పోలీస్​ - Four family members shot dead by cop by visiting in-laws house

పంజాబ్​లో ఓ హెడ్​కానిస్టేబుల్ అత్తగారింట్లో మారణకాండ సృష్టించాడు. భార్య సహా అత్త, బావమరిది, బావమరిది భార్యనూ ప్రభుత్వ ఏకే47తో దారుణంగా కాల్చి చంపాడు. ఈ ఘటనలో పదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. అనంతరం పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడా నిందితుడు.

PUNJAB moga-policeman-killed-four-including-mother-in-law-and-sister-in-law
మద్యం మత్తులో భార్య కుటుంబాన్ని కడతేర్చిన పోలీస్​
author img

By

Published : Feb 16, 2020, 7:58 PM IST

Updated : Mar 1, 2020, 1:28 PM IST

పంజాబ్​ మోగాలో ఓ హెడ్ కానిస్టేబుల్​ కుల్విందర్​ సింగ్.. సొంత కుటుంబ సభ్యులనే కాల్చిచంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. భార్య, అత్త, బావమరిది, బావమరిది భార్యను ప్రభుత్వ ఏకే-47తో దారుణంగా కాల్చి చంపాడు.

మద్యం మత్తులో భార్య కుటుంబాన్ని కడతేర్చిన పోలీస్​

కొద్ది రోజుల క్రితం అత్తగారి భూమిలో ఓ పందుల ఫాం​ పెట్టి వ్యాపారం మొదలెట్టాడు కుల్విందర్​. ఆ భూమిని అత్త, బావమరిది తిరిగి అడిగినందుకు తీవ్రంగా ఆగ్రహించిన కుల్విందర్​ తప్ప తాగి అత్తారింటికి వెళ్లాడు. మద్యం మత్తులో బావమరిదితో గొడవకు దిగాడు. ఉద్రేకంలో తన వద్ద ఉన్న ఏకే-47 తుపాకీతో కాల్పులు జరిపాడు.

ఘటనలో భార్య రాజ్విందర్​ కౌర్​, అత్త సుఖ్విందర్​ కౌర్​, బావమరిది జస్​కరణ్​ సింగ్​, బావమరిది భార్య ఇంద్రజిత్​ కౌర్​ మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన జస్​కరణ్​ సింగ్ పదేళ్ల కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

క్షణికావేశంలో నలుగురు కుటుంబసభ్యులను హతమార్చి పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు కుల్విందర్​. 2014లోనూ ఇలాగే అత్తగారింట్లో దాడికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి:ఔరా: చెక్క సైకిల్​ ఎంత చక్కగా ఉందో చూశారా?

పంజాబ్​ మోగాలో ఓ హెడ్ కానిస్టేబుల్​ కుల్విందర్​ సింగ్.. సొంత కుటుంబ సభ్యులనే కాల్చిచంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. భార్య, అత్త, బావమరిది, బావమరిది భార్యను ప్రభుత్వ ఏకే-47తో దారుణంగా కాల్చి చంపాడు.

మద్యం మత్తులో భార్య కుటుంబాన్ని కడతేర్చిన పోలీస్​

కొద్ది రోజుల క్రితం అత్తగారి భూమిలో ఓ పందుల ఫాం​ పెట్టి వ్యాపారం మొదలెట్టాడు కుల్విందర్​. ఆ భూమిని అత్త, బావమరిది తిరిగి అడిగినందుకు తీవ్రంగా ఆగ్రహించిన కుల్విందర్​ తప్ప తాగి అత్తారింటికి వెళ్లాడు. మద్యం మత్తులో బావమరిదితో గొడవకు దిగాడు. ఉద్రేకంలో తన వద్ద ఉన్న ఏకే-47 తుపాకీతో కాల్పులు జరిపాడు.

ఘటనలో భార్య రాజ్విందర్​ కౌర్​, అత్త సుఖ్విందర్​ కౌర్​, బావమరిది జస్​కరణ్​ సింగ్​, బావమరిది భార్య ఇంద్రజిత్​ కౌర్​ మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన జస్​కరణ్​ సింగ్ పదేళ్ల కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

క్షణికావేశంలో నలుగురు కుటుంబసభ్యులను హతమార్చి పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు కుల్విందర్​. 2014లోనూ ఇలాగే అత్తగారింట్లో దాడికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి:ఔరా: చెక్క సైకిల్​ ఎంత చక్కగా ఉందో చూశారా?

Last Updated : Mar 1, 2020, 1:28 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.