ETV Bharat / bharat

'కరసేవకులపై కాల్పులకు ఆదేశాలు ఇవ్వనందుకు గర్వపడుతున్నా'

author img

By

Published : Aug 1, 2020, 12:30 PM IST

Updated : Aug 1, 2020, 12:47 PM IST

అయోధ్యలో కరసేవకులు సమావేశమైన సమయంలో వారిపై కాల్పులకు ఆదేశాలు ఇవ్వనందుకు గర్వపడుతున్నానని ఉత్తర్​ప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ పేర్కొన్నారు. కాల్పులు జరిగి ఉంటే దేశంలో అలజడి తీవ్రస్థాయిలో ఉండేదని అన్నారు. ఐదు వందల ఏళ్ల శ్రమకు ఫలితం దక్కిందని రామ మందిర నిర్మాణాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానింంచారు.

Proud of not ordering firing on kar sewaks in Ayodhya: Former UP CM Kalyan Singh
'కరసేవకులపై కాల్పుల ఆదేశాలు ఇవ్వనందుకు గర్వపడుతున్నా'

1992 సంవత్సరంలో అయోధ్యలో సమావేశమైన కరసేవకులపై కాల్పులు జరిపేందుకు ఆదేశాలు ఇవ్వనందుకు గర్వపడుతున్నానని భాజపా సీనియర్​ నేత, ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ వ్యాఖ్యానించారు. కరసేవకులను నియంత్రించడానికి కాల్పులు కాకుండా ఇతర మార్గాలు చూడాలని ఆదేశించినట్లు తెలిపారు. కాల్పులు జరిగి ఉంటే దేశవ్యాప్తంగా అశాంతి తలెత్తేదని అన్నారు.

"1992లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయోధ్యలో సమావేశమైన కరసేవకులపై కాల్పులు చేయవద్దని ఆదేశించాను. కరసేవకులు ఉన్న సాకేత్ కళాశాల ప్రాంతంలో నాలుగు బెటాలియన్ల కేంద్ర ప్రభుత్వ బలగాలు మోహరించాయని జిల్లా యంత్రాగం నాకు సమాచారం అందించింది. కాల్పులు జరపకుండా వారిని నియంత్రించడానికి ఇతర మార్గాలు అన్వేషించాలని సూచించాను. దేశ నలుమూలల నుంచి ప్రజలు వచ్చారు కాబట్టి, కాల్పులు జరిగి ఉంటే తీవ్ర స్థాయిలో అలజడి ప్రారంభమయ్యేది. కరసేవకుల్లో ఒక్కరు కూడా మరణించనందుకు గర్వపడుతున్నాను. రాముడి కోసం రాష్ట్ర ప్రభుత్వం పడిపోయినందుకు కూడా నాకు బాధ లేదు."

-కళ్యాణ్ సింగ్, యూపీ మాజీ సీఎం

ఐదు వందల ఏళ్ల పోరాటానికి ఫలితమే అయోధ్య రామ మందిర నిర్మాణమని పేర్కొన్నారు కళ్యాణ్. భూమి పూజ జరుగుతుండటం చాలా సంతోషం కలిగిస్తోందని చెప్పారు. హిందువులను అవమానించడానికే బాబ్రీ మసీదును నిర్మించారని అన్నారు.

"1528లో బాబర్ కమాండర్ మిర్​ బాకీ దండయాత్ర చేసి రామ మందిరాన్ని కూల్చివేశారు. ఆ ప్రాంతంలో బాబ్రీ మసీదును నిర్మించారు. ఇది ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం కాదు, హిందువులను అవమానించడానికే చేశారు."

-కళ్యాణ్ సింగ్, యూపీ మాజీ సీఎం

ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సహా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్​ హాజరుకానున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి- బిహార్​ ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఈసీకి లేఖ

1992 సంవత్సరంలో అయోధ్యలో సమావేశమైన కరసేవకులపై కాల్పులు జరిపేందుకు ఆదేశాలు ఇవ్వనందుకు గర్వపడుతున్నానని భాజపా సీనియర్​ నేత, ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ వ్యాఖ్యానించారు. కరసేవకులను నియంత్రించడానికి కాల్పులు కాకుండా ఇతర మార్గాలు చూడాలని ఆదేశించినట్లు తెలిపారు. కాల్పులు జరిగి ఉంటే దేశవ్యాప్తంగా అశాంతి తలెత్తేదని అన్నారు.

"1992లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయోధ్యలో సమావేశమైన కరసేవకులపై కాల్పులు చేయవద్దని ఆదేశించాను. కరసేవకులు ఉన్న సాకేత్ కళాశాల ప్రాంతంలో నాలుగు బెటాలియన్ల కేంద్ర ప్రభుత్వ బలగాలు మోహరించాయని జిల్లా యంత్రాగం నాకు సమాచారం అందించింది. కాల్పులు జరపకుండా వారిని నియంత్రించడానికి ఇతర మార్గాలు అన్వేషించాలని సూచించాను. దేశ నలుమూలల నుంచి ప్రజలు వచ్చారు కాబట్టి, కాల్పులు జరిగి ఉంటే తీవ్ర స్థాయిలో అలజడి ప్రారంభమయ్యేది. కరసేవకుల్లో ఒక్కరు కూడా మరణించనందుకు గర్వపడుతున్నాను. రాముడి కోసం రాష్ట్ర ప్రభుత్వం పడిపోయినందుకు కూడా నాకు బాధ లేదు."

-కళ్యాణ్ సింగ్, యూపీ మాజీ సీఎం

ఐదు వందల ఏళ్ల పోరాటానికి ఫలితమే అయోధ్య రామ మందిర నిర్మాణమని పేర్కొన్నారు కళ్యాణ్. భూమి పూజ జరుగుతుండటం చాలా సంతోషం కలిగిస్తోందని చెప్పారు. హిందువులను అవమానించడానికే బాబ్రీ మసీదును నిర్మించారని అన్నారు.

"1528లో బాబర్ కమాండర్ మిర్​ బాకీ దండయాత్ర చేసి రామ మందిరాన్ని కూల్చివేశారు. ఆ ప్రాంతంలో బాబ్రీ మసీదును నిర్మించారు. ఇది ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం కాదు, హిందువులను అవమానించడానికే చేశారు."

-కళ్యాణ్ సింగ్, యూపీ మాజీ సీఎం

ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సహా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్​ హాజరుకానున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి- బిహార్​ ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఈసీకి లేఖ

Last Updated : Aug 1, 2020, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.