రాజ్యసభ ఎంపీలు గులాం నబీ ఆజాద్, మిర్ మొహమ్మద్ ఫయాజ్, షాంసెర్ సింగ్, నజిర్ అహ్మెద్ లావయ్లు పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో వారికి వీడ్కోలు పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్పై ప్రశంసలు కురిపించారు మోదీ. మాట్లాడుతోన్న సమయంలో మోదీ భావోద్వేగానికి లోనయ్యారు.
" ప్రజల కోసం వారు చేసిన సేవకు దేశం కృతజ్ఞతలు తెలుపుతుంది. గులాం నబీ ఆజాద్ (రాజ్యసభలో ప్రతిపక్ష నేత) స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి ఆయన పనితీరును అందుకోవటం చాలా కష్టం. ఆజాద్.. తన పార్టీ కోసమే కాకుండా దేశం, పార్లమెంట్ కోసం పని చేశారు."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: 'పొత్తు' పొడుపు- అసోం రాజకీయాల్లో కొత్త మలుపు