ETV Bharat / bharat

'పీఎం కేర్స్'​​ నిధికి బీసీసీఐ రూ.51కోట్లు విరాళం

author img

By

Published : Mar 28, 2020, 6:08 PM IST

Updated : Mar 28, 2020, 11:07 PM IST

PM CARES Fund:  Prime Minister Narendra Modi announces emergency relief fund for coronavirus fight
'పీఎం కేర్స్​' నిధి ఏర్పాటు

21:13 March 28

కరోనాపై పోరు కోసం కేంద్రం ప్రారంభించిన పీఎం కేర్స్​ నిధికి రూ.51 కోట్లు విరాళం ప్రకటించింది బీసీసీఐ.

19:24 March 28

రైనా 52 లక్షల విరాళం...

కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ విరాళం ప్రకటించాడు భారత క్రికెటర్​ సురేశ్​ రైనా. మొత్తం 52 లక్షల రూపాయలు సాయం చేయనున్నట్లు తెలిపాడు. ఇందులో 31 లక్షలు పీఎం కేర్స్​కు, 21 లక్షలు యూపీ సీఎం జాతీయ విపత్తుల సహాయనిధికి అందజేయనున్నట్లు ప్రకటించాడు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా క్రీడా ప్రముఖులు ఇచ్చిన మొత్తంలో ఇదే అత్యధికం. 33 ఏళ్ల ఈ క్రికెటర్​ టీమిండియా తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. దాదాపు 2005 నుంచి 2018 వరకు భారత జట్టులో కొనసాగాడు.

18:56 March 28

జేఎన్​యూ ఉద్యోగుల విరాళం...

ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎం కేర్స్)కి విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చింది జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్​యూ). ఈ వర్సిటీలో పనిచేస్తోన్న టీచింగ్​, నాన్​ టీచింగ్​ ఉద్యోగులంతా కలిసి ఏప్రిల్​ నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని జేఎన్​యూ ఉపకులపతి ఎమ్​.జగదీశ్​ కుమార్​ వెల్లడించారు.

17:29 March 28

బాలీవుడ్​ హీరో అక్షయ్​ కుమార్​ భారీ విరాళం..

  • This is that time when all that matters is the lives of our people. And we need to do anything and everything it takes. I pledge to contribute Rs 25 crores from my savings to @narendramodi ji’s PM-CARES Fund. Let’s save lives, Jaan hai toh jahaan hai. 🙏🏻 https://t.co/dKbxiLXFLS

    — Akshay Kumar (@akshaykumar) March 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాలీవుడ్​ హీరో అక్షయ్​ కుమార్​ భారీ విరాళం..

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యల్ని మరింత ముమ్మరం చేసింది కేంద్రప్రభుత్వం. దాతల నుంచి విరాళాలు సేకరించి, కష్టాల్లో ఉన్నవారికి అందించే సదుద్దేశంతో "ప్రైమ్ మినిస్టర్స్​ సిటిజెన్ అసిస్టెన్స్​ అండ్ రిలీఫ్​ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్​ ఫండ్​"(పీఎం కేర్స్​) పేరిట ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. ఇందుకు చిన్న మొత్తాల్లో విరాళాలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని నేడు మోదీ ప్రారంభించారు.

  • నిధి ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేసిన కాసేపటికే ఐఏఎస్​ అధికారుల సంఘం స్పందించింది. తమ వంతుగా రూ.21 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా సభ్యులంతా కనీసం ఒక్క రోజు వేతనం ఇస్తారని తెలిపింది.
  • ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​.. పీఎం కేర్​ ఫండ్​కు రూ.25 కోట్లు విరాళం ఇచ్చారు.

21:13 March 28

కరోనాపై పోరు కోసం కేంద్రం ప్రారంభించిన పీఎం కేర్స్​ నిధికి రూ.51 కోట్లు విరాళం ప్రకటించింది బీసీసీఐ.

19:24 March 28

రైనా 52 లక్షల విరాళం...

కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ విరాళం ప్రకటించాడు భారత క్రికెటర్​ సురేశ్​ రైనా. మొత్తం 52 లక్షల రూపాయలు సాయం చేయనున్నట్లు తెలిపాడు. ఇందులో 31 లక్షలు పీఎం కేర్స్​కు, 21 లక్షలు యూపీ సీఎం జాతీయ విపత్తుల సహాయనిధికి అందజేయనున్నట్లు ప్రకటించాడు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా క్రీడా ప్రముఖులు ఇచ్చిన మొత్తంలో ఇదే అత్యధికం. 33 ఏళ్ల ఈ క్రికెటర్​ టీమిండియా తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. దాదాపు 2005 నుంచి 2018 వరకు భారత జట్టులో కొనసాగాడు.

18:56 March 28

జేఎన్​యూ ఉద్యోగుల విరాళం...

ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎం కేర్స్)కి విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చింది జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్​యూ). ఈ వర్సిటీలో పనిచేస్తోన్న టీచింగ్​, నాన్​ టీచింగ్​ ఉద్యోగులంతా కలిసి ఏప్రిల్​ నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని జేఎన్​యూ ఉపకులపతి ఎమ్​.జగదీశ్​ కుమార్​ వెల్లడించారు.

17:29 March 28

బాలీవుడ్​ హీరో అక్షయ్​ కుమార్​ భారీ విరాళం..

  • This is that time when all that matters is the lives of our people. And we need to do anything and everything it takes. I pledge to contribute Rs 25 crores from my savings to @narendramodi ji’s PM-CARES Fund. Let’s save lives, Jaan hai toh jahaan hai. 🙏🏻 https://t.co/dKbxiLXFLS

    — Akshay Kumar (@akshaykumar) March 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాలీవుడ్​ హీరో అక్షయ్​ కుమార్​ భారీ విరాళం..

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యల్ని మరింత ముమ్మరం చేసింది కేంద్రప్రభుత్వం. దాతల నుంచి విరాళాలు సేకరించి, కష్టాల్లో ఉన్నవారికి అందించే సదుద్దేశంతో "ప్రైమ్ మినిస్టర్స్​ సిటిజెన్ అసిస్టెన్స్​ అండ్ రిలీఫ్​ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్​ ఫండ్​"(పీఎం కేర్స్​) పేరిట ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. ఇందుకు చిన్న మొత్తాల్లో విరాళాలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని నేడు మోదీ ప్రారంభించారు.

  • నిధి ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేసిన కాసేపటికే ఐఏఎస్​ అధికారుల సంఘం స్పందించింది. తమ వంతుగా రూ.21 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా సభ్యులంతా కనీసం ఒక్క రోజు వేతనం ఇస్తారని తెలిపింది.
  • ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​.. పీఎం కేర్​ ఫండ్​కు రూ.25 కోట్లు విరాళం ఇచ్చారు.
Last Updated : Mar 28, 2020, 11:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.