పాకిస్థాన్ సైన్యం ఒక్క రోజులో రెండు సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము కశ్మీర్ రాజౌరీ జిల్లా, కుప్వారాలో కాల్పులకు తెగబడింది. కుప్వారా మాచిల్ సెక్టార్ నియంత్రిణ రేఖ వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాను పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
"నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ కాల్పులకు తెగబడింది. మోర్టార్ షెల్స్, ఆయుధాలతో పాక్ దాడికి దిగింది. భారత సైన్యం ఇందుకు సమాధానమిచ్చింది."
-భారత సైన్యాధికారి
రాజౌరీ జిల్లాలోనూ పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంట కాల్పులు జరిపింది.
"దాదాపు మధ్యాహ్నం 3.50 నిమిషాల ప్రాంతంలో రాజౌరీలో కాల్పులకు తెగబడింది పాక్ సైన్యం. ఓ మోస్తరు నుంచి భారీ ఆయుధాలును ఉపయోగించి దాడికి పాల్పడింది. "
-భారత సైన్యాధికారి
సెప్టెంబర్ నెలలో దాదాపు 44 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్. సుందర్బాని సెక్టార్లో ఆదివారం రాత్రి పాక్ కాల్పుల్లో ఓ జవాను మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కేరీ సెక్టార్లో సెప్టెంబర్ 2న ఓ జేసీఓ ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదికి జీవితఖైదు