ETV Bharat / bharat

మళ్లీ కోర్టుకెళ్లిన నిర్భయ దోషి.. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు - నిర్భయ కేసులో మరో మలుపు

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలులో మరో అడ్డంకి ఏర్పడింది. మార్చి 3న మరణశిక్ష అమలు చేయాల్సి ఉండగా దోషుల్లో ఒకడైన పవన్​​కుమార్​గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం వల్ల శిక్ష అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

nirbhaya
నిర్భయ కేసులో మరో మలుపు
author img

By

Published : Feb 28, 2020, 4:56 PM IST

Updated : Mar 2, 2020, 9:08 PM IST

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. దోషుల్లో ఒకడైన పవన్​కుమార్ గుప్తా తనకు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోర్టుకు విన్నవించాడు. అదే సమయంలో ట్రయల్​ కోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పుపై స్టే విధించాలని తన పిటిషన్​లో పేర్కొన్నాడు గుప్తా.

మిగతా ముగ్గురు దోషులైన ముఖేశ్​కుమార్, వినయ్​శర్మ, అక్షయ్​కుమార్ తమకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకున్నారు. అయితే క్యూరేటివ్ పిటిషన్, రాష్ట్రపతి క్షమాభిక్షపై సవాలు అవకాశాలను పవన్​కుమార్ గుప్తా ఇంకా వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలోనే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు గుప్తా.

మార్చి 3న నిర్భయ దోషులకు మరణశిక్ష అమలు జరపాల్సి ఉంది. అయితే చట్టంలో ఉన్న అవకాశాలను వినియోగించి శిక్షను పొడిగిస్తూ వస్తున్నారు దోషులు. ఈ నేపథ్యంలో పవన్​కుమార్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్​తో ఉరి అమలు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చూడండి: నిర్భయకు న్యాయమేది? పేరుకేనా మరణ దండన?

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. దోషుల్లో ఒకడైన పవన్​కుమార్ గుప్తా తనకు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోర్టుకు విన్నవించాడు. అదే సమయంలో ట్రయల్​ కోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పుపై స్టే విధించాలని తన పిటిషన్​లో పేర్కొన్నాడు గుప్తా.

మిగతా ముగ్గురు దోషులైన ముఖేశ్​కుమార్, వినయ్​శర్మ, అక్షయ్​కుమార్ తమకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకున్నారు. అయితే క్యూరేటివ్ పిటిషన్, రాష్ట్రపతి క్షమాభిక్షపై సవాలు అవకాశాలను పవన్​కుమార్ గుప్తా ఇంకా వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలోనే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు గుప్తా.

మార్చి 3న నిర్భయ దోషులకు మరణశిక్ష అమలు జరపాల్సి ఉంది. అయితే చట్టంలో ఉన్న అవకాశాలను వినియోగించి శిక్షను పొడిగిస్తూ వస్తున్నారు దోషులు. ఈ నేపథ్యంలో పవన్​కుమార్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్​తో ఉరి అమలు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చూడండి: నిర్భయకు న్యాయమేది? పేరుకేనా మరణ దండన?

Last Updated : Mar 2, 2020, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.