ETV Bharat / bharat

అన్నీ అయిపోయాయి.. చివరకు కోర్టు బయట హైడ్రామా

author img

By

Published : Mar 19, 2020, 3:45 PM IST

నిర్భయ దోషులకు రేపు ఉరిశిక్ష అమలు కానున్న తరుణంలో హైడ్రామా నడిచింది. దోషుల్లో ఒకడైన అక్షయ్​ సింగ్​ భార్య దిల్లీ పటియాలా హౌస్​ కోర్టు బయట ఏడ్చి స్పృహ తప్పి పడిపోయింది. అటు ఆమె హాజరు కాకపోవడం వల్ల విడాకుల పిటిషన్​ విచారణను బిహార్​ కోర్టు మార్చి 24కు వాయిదా వేసింది.

Nirbhaya case
అన్నీ అయిపోయాయి.. చివరికి కోర్టు బయట హైడ్రామా!

ఎప్పుడెప్పుడా అని యావత్​ దేశం ఎదురుచూస్తోన్న నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. మరణశిక్షను తప్పించుకోవడానికి దోషులు వేయని ఎత్తులు లేవు.. వాడని పిటిషన్​లు లేవు. ఎట్టకేలకు అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల్లో ఒకడి భార్య కోర్టు బయట హైడ్రామాకు తెరలేపింది.

దోషుల్లో ఒకడైన అక్షయ్​ సింగ్​ భార్య పునీతా దేవి ఉదయం దిల్లీ పటియాలా హౌస్​ కోర్టుకు హజరైంది. దోషులకు ఏ కోర్టులోనూ ఎటువంటి పిటిషన్​లూ పెండింగ్​లో లేవని కోర్టుకు తెలియజేశారు అధికారులు. ఇది అయిన కాసేపటికే అక్షయ్​ భార్య కోర్టు బయట కూర్చొని ఏడుపు మొదలు పెట్టింది. తన చెప్పుతో తానే కొట్టుకుంటూ నాకు న్యాయం చేయండి అంటూ రోదించి స్పృహ తప్పి పడిపోయింది.

అన్నీ అయిపోయాయి.. చివరికి కోర్టు బయట హైడ్రామా!

"నాకూ న్యాయం కావాలి. నన్ను చంపేయండి. నాకు బతకాలని లేదు. నా భర్త అమాయకుడు. ఎందుకు ఈ సమాజం మమ్మల్ని ద్వేషిస్తోంది. మాకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఇన్నాళ్లూ ఉన్నాం. కానీ ఏడేళ్లుగా మమ్మల్ని రోజూ చంపుతూనే ఉన్నారు." - అక్షయ్​ భార్య

అటు మరో డ్రామా...

ఉరిశిక్ష నుంచి తప్పించడానికి తన భర్తతో విడాకులిప్పించాలని అక్షయ్ భార్య నిన్న బిహార్​ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై నేడు విచారణ జరగాల్సి ఉండగా ఆమె కోర్టుకు హాజరుకాలేదు.

పిటిషన్​దారు లేని కారణంగా బిహార్​ కోర్టు విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. హత్యాచారం చేసిన వ్యక్తికి వితంతువుగా జీవించలేనంటూ నిన్న పిటిషన్​​ దాఖలు చేసిన ఆమే.. నేడు తన భర్త అమాయకుడని చెప్పడం గమనార్హం.

ఇదీ చూడండి: నిర్భయ దోషులకు ఉరి తప్పదు... సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఎప్పుడెప్పుడా అని యావత్​ దేశం ఎదురుచూస్తోన్న నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. మరణశిక్షను తప్పించుకోవడానికి దోషులు వేయని ఎత్తులు లేవు.. వాడని పిటిషన్​లు లేవు. ఎట్టకేలకు అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల్లో ఒకడి భార్య కోర్టు బయట హైడ్రామాకు తెరలేపింది.

దోషుల్లో ఒకడైన అక్షయ్​ సింగ్​ భార్య పునీతా దేవి ఉదయం దిల్లీ పటియాలా హౌస్​ కోర్టుకు హజరైంది. దోషులకు ఏ కోర్టులోనూ ఎటువంటి పిటిషన్​లూ పెండింగ్​లో లేవని కోర్టుకు తెలియజేశారు అధికారులు. ఇది అయిన కాసేపటికే అక్షయ్​ భార్య కోర్టు బయట కూర్చొని ఏడుపు మొదలు పెట్టింది. తన చెప్పుతో తానే కొట్టుకుంటూ నాకు న్యాయం చేయండి అంటూ రోదించి స్పృహ తప్పి పడిపోయింది.

అన్నీ అయిపోయాయి.. చివరికి కోర్టు బయట హైడ్రామా!

"నాకూ న్యాయం కావాలి. నన్ను చంపేయండి. నాకు బతకాలని లేదు. నా భర్త అమాయకుడు. ఎందుకు ఈ సమాజం మమ్మల్ని ద్వేషిస్తోంది. మాకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఇన్నాళ్లూ ఉన్నాం. కానీ ఏడేళ్లుగా మమ్మల్ని రోజూ చంపుతూనే ఉన్నారు." - అక్షయ్​ భార్య

అటు మరో డ్రామా...

ఉరిశిక్ష నుంచి తప్పించడానికి తన భర్తతో విడాకులిప్పించాలని అక్షయ్ భార్య నిన్న బిహార్​ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై నేడు విచారణ జరగాల్సి ఉండగా ఆమె కోర్టుకు హాజరుకాలేదు.

పిటిషన్​దారు లేని కారణంగా బిహార్​ కోర్టు విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. హత్యాచారం చేసిన వ్యక్తికి వితంతువుగా జీవించలేనంటూ నిన్న పిటిషన్​​ దాఖలు చేసిన ఆమే.. నేడు తన భర్త అమాయకుడని చెప్పడం గమనార్హం.

ఇదీ చూడండి: నిర్భయ దోషులకు ఉరి తప్పదు... సుప్రీం కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.