ETV Bharat / bharat

పటోలేకు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు - nana patole latest news

మహారాష్ట్ర కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడిగా నానా పటోలేను నియమించింది అదిష్ఠానం. మరో ఆరుగురు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

Nana Patole appointed president of Maharashtra congress
పటోలేకు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి పగ్గాలు
author img

By

Published : Feb 5, 2021, 4:22 PM IST

నానా పటోలేను మహారాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడిగా నియమించింది పార్టీ అధిష్ఠానం. ఆ పదవి నుంచి బాబా సాహెబ్​ తోరట్​ను తొలిగించిన కాంగ్రెస్​.. పార్టీ పగ్గాలను పటోలేకు అప్పగించింది. ఈ కారణంగానే స్పీకరు పదవికి ఆయన రాజీనామా చేశారు. ఉపాధ్యక్షుడిగా మాజీ రాజ్యసభ సభ్యుడు ఉస్సేన్​ దల్​వాయిని నియమించిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఆరుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు.

గతంలో కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన పటోలే 2014లో భండారా-గోండియా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017లో కమలం పార్టీకి గుడ్‌ బై చెప్పి 2018లో తిరిగి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. 2019లో మహారాష్ట్రలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ సారథ్యంలో ఏర్పాటైన మహావికాస్‌ అఘాడీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

నానా పటోలేను మహారాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడిగా నియమించింది పార్టీ అధిష్ఠానం. ఆ పదవి నుంచి బాబా సాహెబ్​ తోరట్​ను తొలిగించిన కాంగ్రెస్​.. పార్టీ పగ్గాలను పటోలేకు అప్పగించింది. ఈ కారణంగానే స్పీకరు పదవికి ఆయన రాజీనామా చేశారు. ఉపాధ్యక్షుడిగా మాజీ రాజ్యసభ సభ్యుడు ఉస్సేన్​ దల్​వాయిని నియమించిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఆరుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు.

గతంలో కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన పటోలే 2014లో భండారా-గోండియా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017లో కమలం పార్టీకి గుడ్‌ బై చెప్పి 2018లో తిరిగి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. 2019లో మహారాష్ట్రలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ సారథ్యంలో ఏర్పాటైన మహావికాస్‌ అఘాడీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

ఇదీ చూడండి: జైపుర్​లో అన్నదాతల ట్రాక్టర్​ ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.