ETV Bharat / bharat

'రఫేల్​ విషయంలో దేశ ఖజానా దోపిడీకి గురైంది'

author img

By

Published : Aug 22, 2020, 3:01 PM IST

రఫేల్ కొనుగోలులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ యుద్ధవిమానాల కోసం దేశ ఖజానా దోపిడీకి గురైందంటూ ఆరోపించారు.

Money was stolen from Indian exchequer: Rahul Gandhi attacks Centre over Rafale deal
రాఫెల్​పై రాహుల్ మరోసారి విమర్శల పర్వం

రఫేల్ అంశంపై కేంద్రంపై మరోమారు విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రఫేల్ కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపించారు. డసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి ఈ జెట్ల కొనుగోలు విషయంలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ట్వీట్ చేశారు.

ఓ వార్తా పత్రిక కథనాన్ని ఉటంకిస్తూ.. దేశ ఖజానా దోపిడీకి గురైందంటూ ఆరోపించారు రాహుల్. 'సత్యం ఒక్కటే, కానీ మార్గాలు ఎన్నో' అని మహాత్మా గాంధీ చెప్పిన సూక్తిని తన ట్వీట్​లో ప్రస్తావించారు.

"రఫేల్​ కోసం భారత ఖజానా నుంచి డబ్బు దోపిడీకి గురైంది."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

36 రఫేల్ జెట్ల కోసం 2016 సెప్టెంబర్​లో రూ. 59 వేల కోట్లతో ఫ్రాన్స్​ సంస్థ డసాల్ట్ ఏవియేషన్​తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఐదు రఫేల్ విమానాలు భారత్​కు చేరుకున్నాయి. ప్రస్తుతం అంబాలాలోని వైమానిక స్థావరంలో వీటిని మోహరించారు.

రఫేల్ అంశంపై కేంద్రంపై మరోమారు విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రఫేల్ కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపించారు. డసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి ఈ జెట్ల కొనుగోలు విషయంలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ట్వీట్ చేశారు.

ఓ వార్తా పత్రిక కథనాన్ని ఉటంకిస్తూ.. దేశ ఖజానా దోపిడీకి గురైందంటూ ఆరోపించారు రాహుల్. 'సత్యం ఒక్కటే, కానీ మార్గాలు ఎన్నో' అని మహాత్మా గాంధీ చెప్పిన సూక్తిని తన ట్వీట్​లో ప్రస్తావించారు.

"రఫేల్​ కోసం భారత ఖజానా నుంచి డబ్బు దోపిడీకి గురైంది."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

36 రఫేల్ జెట్ల కోసం 2016 సెప్టెంబర్​లో రూ. 59 వేల కోట్లతో ఫ్రాన్స్​ సంస్థ డసాల్ట్ ఏవియేషన్​తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఐదు రఫేల్ విమానాలు భారత్​కు చేరుకున్నాయి. ప్రస్తుతం అంబాలాలోని వైమానిక స్థావరంలో వీటిని మోహరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.