ETV Bharat / bharat

'నిర్భయ' దోషుల్ని పట్టించింది ఆ బస్సు చక్రమే

author img

By

Published : Mar 20, 2020, 3:19 PM IST

23ఏళ్ల యువతిని కదులుతున్న బస్సులో ఆరుగురు అత్యాచారం చేసిన ఘటన 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది జరిగిన కొద్ది రోజులకు ఆ యువతి మరణించింది. కానీ 'నిర్భయ'గా ప్రపంచానికి గుర్తుండిపోయింది. అయితే నిర్భయకు న్యాయం చేయడంలో, ఆ మృగాళ్లకు శిక్ష పడటంలో ఆ బస్సే కీలక పాత్ర పోషించింది. అదేలా అంటే...

Missing hubcap, colour of bus helped police identify vehicle in which 'Nirbhaya' was gangraped
'నిర్భయ' దోషుల్ని పట్టించింది ఆ బస్సు చక్రమే

2012 డిసెంబర్​ 16.. దిల్లీ మునిరక బస్​ స్టాండ్​. ఓ 23ఏళ్ల యువతి.. తన స్నేహితుడితో కలిసి బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో పసుపు పచ్చ చారలున్న ఓ బస్సు అటువైపు వచ్చింది. బస్సులోని ఓ యువకుడు "ద్వారకా.. పాలమ్​ మోడ్​, ద్వారకా.. పాలమ్​ మోడ్​" అని అరుస్తూ ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్నాడు. కొద్ది సేపటి అనంతరం తన స్నేహితుడితో కలిసి యువతి ఆ బస్సు ఎక్కింది.

అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ యువతికి.. ఆ రాత్రి కాళరాత్రిగా మిగిలిపోయింది. ఆ ఘటన యావత్​ భారత దేశాన్నే కుదిపేసింది. బస్సులోని ఆరుగురు మృగాళ్లు.. ఆమె స్నేహితుడిని కట్టిపడేసి విచక్షణారహితంగా కొట్టారు. ఆ యువతిపై అతి కిరాతకంగా దాడి చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. అది జరిగిన కొద్ది రోజులకు ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. కానీ ఆమె మాత్రం ప్రపంచానికి 'నిర్భయ'గా గుర్తుండిపోయింది.

బస్సే పట్టించింది...

ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే యావత్​ భారత దేశం ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ ఆరుగురిని పట్టుకోవడానికి దిల్లీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వారి అన్వేషణలో ఆ బస్సే కీలక పాత్ర పోషించింది. బస్సు రంగు, ముందు భాగంలోని ఎడమ చక్రానికి హబ్​క్యాప్​ లేకపోవడం... దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది.

17వ తేదీ వేకువజామునే దిల్లీ రవాణాశాఖ ఆధికారులను నిద్రలేపారు దిల్లీ పోలీసులు. రిజిస్టర్​ అయి ఉన్న అన్ని తెల్ల బస్సుల వివరాలను తెలుసుకున్నారు. అలాంటివి 320 వాహనాలు ఉన్నట్లు గుర్తించారు.

మరో పోలీసు బృందం.. అదే సమయంలో జాతీయ రహదారిపై ఉన్న అన్ని హోటళ్లు, గెస్ట్​ హౌస్​ల సీసీటీవీ ఫుటేజ్​ స్కాన్​ చేసింది. హోటల్​ 'దిల్లీ ఎయిర్​పోర్ట్​' వద్ద ఓ తెల్ల రంగు బస్సును పోలీసులు గుర్తించారు. దానిపై "యాదవ్​" అనే పేరు పెయింట్​ చేసి ఉంది. ఆ బస్సు దిల్లీ నుంచి గురుగ్రామ్​ వైపు వెళుతూ కనిపించింది. 19 నిమిషాల తర్వాత.. తిరిగి అదే రూట్​లో బస్సు వెళ్లడాన్ని పోలీసులు గమనించారు.

ఈ ఫుటేజ్​ను నిర్భయ స్నేహితుడికి చూపించారు. ఎడమ చక్రానికి హబ్​క్యాప్​ లేకపోవడం వల్ల బస్సును అతడు సులభంగా గుర్తించాడు.

ఆ బస్సు ఉత్తర్​ ప్రదేశ్​లోని నోయిడాకు చెందిన దినేశ్​ యాదవ్​ది. ఎరుపు రంగు సీట్లు, పసుపు రంగు కర్టెన్లు, ఒకవైపు "యాదవ్​" అని రాసున్న బస్సు తనదేనని అతడు అంగీకరించాడు. దర్యాప్తులో భాగంగా బస్సు డ్రైవర్​ వివరాలను పోలీసులకు అందించాడు.

ఇక్కడే ఆరుగురిలో మొదటి మృగం పేరు 'రామ్​ సింగ్​' అని తెలిసింది. అతడు ఆర్​.కె పురంలో గురు రవిదాస్​ ఆశ్రమం సమీపంలోని ఓ గుడిసెలో ఉంటాడని ఓనర్​ స్పష్టం చేశాడు. ఆశ్రమం వద్దకు వెళ్లిన పోలీసుల బృందం.. బస్సును స్వాధీనం చేసుకుని రామ్​ సింగ్​ను అదుపులోకి తీసుకుంది.

మరో సవాలు...

బస్సును స్వాధీనం చేసుకునే సమయానికి దేశం మొత్తానికి నిర్భయ ఘటన సమాచారం తెలిసింది. నిర్భయకు జరిగిన అన్యాయానికి.. వసంత్​ విహార్​ పోలీస్​ స్టేషన్​ వద్ద అందోళనలు తీవ్రస్థాయిలో జరిగాయి. కేసులో ఎంతో ముఖ్యమైన ఆధారమైన బస్సును ఆ సమయంలో పోలీస్​ స్టేషన్​లో పెట్టడం సరైనది కాదని అధికారులు భావించారు. త్యాగరాజ్​ స్టేడియంలోని పార్కింగ్​ ప్రాంతంలో బస్సును ఉంచి.. ఫోరెన్సిక్​ నిపుణుల బృందాన్ని పిలిచారు.

దిల్లీ మాజీ కమిషనర్​ నీరజ్​ కుమార్​ ఈ వివరాలను.. తాను రాసిన పుస్తకం "ఖాకీ ఫైల్స్​"లో వెల్లడించారు.

ఇదీ చూడండి:- స్నానం, టిఫిన్​ లేకుండానే నిర్భయ దోషులకు ఉరి

2012 డిసెంబర్​ 16.. దిల్లీ మునిరక బస్​ స్టాండ్​. ఓ 23ఏళ్ల యువతి.. తన స్నేహితుడితో కలిసి బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో పసుపు పచ్చ చారలున్న ఓ బస్సు అటువైపు వచ్చింది. బస్సులోని ఓ యువకుడు "ద్వారకా.. పాలమ్​ మోడ్​, ద్వారకా.. పాలమ్​ మోడ్​" అని అరుస్తూ ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్నాడు. కొద్ది సేపటి అనంతరం తన స్నేహితుడితో కలిసి యువతి ఆ బస్సు ఎక్కింది.

అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ యువతికి.. ఆ రాత్రి కాళరాత్రిగా మిగిలిపోయింది. ఆ ఘటన యావత్​ భారత దేశాన్నే కుదిపేసింది. బస్సులోని ఆరుగురు మృగాళ్లు.. ఆమె స్నేహితుడిని కట్టిపడేసి విచక్షణారహితంగా కొట్టారు. ఆ యువతిపై అతి కిరాతకంగా దాడి చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. అది జరిగిన కొద్ది రోజులకు ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. కానీ ఆమె మాత్రం ప్రపంచానికి 'నిర్భయ'గా గుర్తుండిపోయింది.

బస్సే పట్టించింది...

ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే యావత్​ భారత దేశం ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ ఆరుగురిని పట్టుకోవడానికి దిల్లీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వారి అన్వేషణలో ఆ బస్సే కీలక పాత్ర పోషించింది. బస్సు రంగు, ముందు భాగంలోని ఎడమ చక్రానికి హబ్​క్యాప్​ లేకపోవడం... దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది.

17వ తేదీ వేకువజామునే దిల్లీ రవాణాశాఖ ఆధికారులను నిద్రలేపారు దిల్లీ పోలీసులు. రిజిస్టర్​ అయి ఉన్న అన్ని తెల్ల బస్సుల వివరాలను తెలుసుకున్నారు. అలాంటివి 320 వాహనాలు ఉన్నట్లు గుర్తించారు.

మరో పోలీసు బృందం.. అదే సమయంలో జాతీయ రహదారిపై ఉన్న అన్ని హోటళ్లు, గెస్ట్​ హౌస్​ల సీసీటీవీ ఫుటేజ్​ స్కాన్​ చేసింది. హోటల్​ 'దిల్లీ ఎయిర్​పోర్ట్​' వద్ద ఓ తెల్ల రంగు బస్సును పోలీసులు గుర్తించారు. దానిపై "యాదవ్​" అనే పేరు పెయింట్​ చేసి ఉంది. ఆ బస్సు దిల్లీ నుంచి గురుగ్రామ్​ వైపు వెళుతూ కనిపించింది. 19 నిమిషాల తర్వాత.. తిరిగి అదే రూట్​లో బస్సు వెళ్లడాన్ని పోలీసులు గమనించారు.

ఈ ఫుటేజ్​ను నిర్భయ స్నేహితుడికి చూపించారు. ఎడమ చక్రానికి హబ్​క్యాప్​ లేకపోవడం వల్ల బస్సును అతడు సులభంగా గుర్తించాడు.

ఆ బస్సు ఉత్తర్​ ప్రదేశ్​లోని నోయిడాకు చెందిన దినేశ్​ యాదవ్​ది. ఎరుపు రంగు సీట్లు, పసుపు రంగు కర్టెన్లు, ఒకవైపు "యాదవ్​" అని రాసున్న బస్సు తనదేనని అతడు అంగీకరించాడు. దర్యాప్తులో భాగంగా బస్సు డ్రైవర్​ వివరాలను పోలీసులకు అందించాడు.

ఇక్కడే ఆరుగురిలో మొదటి మృగం పేరు 'రామ్​ సింగ్​' అని తెలిసింది. అతడు ఆర్​.కె పురంలో గురు రవిదాస్​ ఆశ్రమం సమీపంలోని ఓ గుడిసెలో ఉంటాడని ఓనర్​ స్పష్టం చేశాడు. ఆశ్రమం వద్దకు వెళ్లిన పోలీసుల బృందం.. బస్సును స్వాధీనం చేసుకుని రామ్​ సింగ్​ను అదుపులోకి తీసుకుంది.

మరో సవాలు...

బస్సును స్వాధీనం చేసుకునే సమయానికి దేశం మొత్తానికి నిర్భయ ఘటన సమాచారం తెలిసింది. నిర్భయకు జరిగిన అన్యాయానికి.. వసంత్​ విహార్​ పోలీస్​ స్టేషన్​ వద్ద అందోళనలు తీవ్రస్థాయిలో జరిగాయి. కేసులో ఎంతో ముఖ్యమైన ఆధారమైన బస్సును ఆ సమయంలో పోలీస్​ స్టేషన్​లో పెట్టడం సరైనది కాదని అధికారులు భావించారు. త్యాగరాజ్​ స్టేడియంలోని పార్కింగ్​ ప్రాంతంలో బస్సును ఉంచి.. ఫోరెన్సిక్​ నిపుణుల బృందాన్ని పిలిచారు.

దిల్లీ మాజీ కమిషనర్​ నీరజ్​ కుమార్​ ఈ వివరాలను.. తాను రాసిన పుస్తకం "ఖాకీ ఫైల్స్​"లో వెల్లడించారు.

ఇదీ చూడండి:- స్నానం, టిఫిన్​ లేకుండానే నిర్భయ దోషులకు ఉరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.