ప్రజా భద్రత చట్టం కింద జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధాన్ని మరో మూడు నెలలు పొడిగించారు అధికారులు. ఈ మేరకు శ్రీనగర్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ప్రస్తుత నిర్బంధ గడువు ముగియనున్న కొన్ని గంటల ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం గతేడాది ఆగస్టు 5న ముఫ్తీకి నిర్బంధం విధించారు అధికారులు. అప్పటి నుంచి 8నెలల పాటు పోలీసులు ఏర్పాటు చేసిన రెండు సబ్ జైళ్లలో ఉంచారు. ఈ నెల 7నుంచి ఆమెను ఇంట్లోనే నిర్బంధంలోనే ఉంచారు.
గృహ నిర్బంధంలో కశ్మీర్ నేతలు ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లాలకు ఇటీవలే విముక్తి కల్పించారు అధికారులు