ఓ అడవి ఏనుగు మనిషిని తొక్కి చంపేసిన ఘటన బంగాల్ ఆలిపుర్ద్వార్లో జరిగింది. జల్దపారా మహారణ్యం నుంచి పొలాల్లోకి వచ్చేసిన గజరాజు... అక్కడ ఎదురైన ఓ వ్యక్తిని చంపేసింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆ ఏనుగును వెనక్కి తరిమేశారు. మరణించిన వ్యక్తిని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు దేశంలో పెద్ద సంఖ్యలో ఏనుగులు మరణిస్తున్నాయి. మనుషుల కారణంగా కొన్ని బలైపోతుంటే.. మరికొన్ని ఆవాసం కోల్పోయి మృత్యువాత పడుతున్నాయి. కొన్ని ఏనుగులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: నీటిపై తేలిన కోతుల మృతదేహాలు.. కారణం?