ETV Bharat / bharat

'మహా'లో కరోనా ఉగ్రరూపం- కొత్తగా 9,431 కేసులు

author img

By

Published : Jul 26, 2020, 7:29 PM IST

Updated : Jul 26, 2020, 10:06 PM IST

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 9,431 కేసులు వెలుగుచూశాయి. మరో 267మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 75వేలు దాటింది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్​ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతోంది. తమిళనాడులో కొత్తగా 6,986 కేసులు నమోదు కాగా.. కర్ణాటకలో మరో 5,199 మందికి వైరస్​ సోకింది.

maharashtra  reports 9,431 new #COVID19 cases
'మహా'లో కరోనా ఉగ్రరూపం- కొత్తగా 9,431 కేసులు

దేశంలోనే కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 9,431 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 267 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 3,75,799కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 13,656మంది మృతి చెందారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 1,48,601గా ఉంది.

తమిళనాడులో..

దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో మరో 6,986 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 85మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,13,723కి పెరిగింది. మొత్తం మృతుల సంఖ్య 3,494కి చేరింది.

కర్ణాటకలో

వైరస్​ వ్యాప్తి అధికంగా ఉన్న కర్ణాటకలో కొత్తగా 5,199మంది వైరస్ బారినపడ్డారు. మరో 82 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 96,141కి చేరింది. వైరస్ కారణంగా ఇప్పటివరకు 1,878మంది మృత్యువాతపడ్డారు.

కేరళలో..

కేరళలోనూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 927మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 18,957కి చేరింది. వైరస్​ కారణంగా 59మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: ఆ నగరంలో 3వేల మంది కరోనా రోగులు మిస్సింగ్​

దేశంలోనే కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 9,431 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 267 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 3,75,799కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 13,656మంది మృతి చెందారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 1,48,601గా ఉంది.

తమిళనాడులో..

దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో మరో 6,986 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 85మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,13,723కి పెరిగింది. మొత్తం మృతుల సంఖ్య 3,494కి చేరింది.

కర్ణాటకలో

వైరస్​ వ్యాప్తి అధికంగా ఉన్న కర్ణాటకలో కొత్తగా 5,199మంది వైరస్ బారినపడ్డారు. మరో 82 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 96,141కి చేరింది. వైరస్ కారణంగా ఇప్పటివరకు 1,878మంది మృత్యువాతపడ్డారు.

కేరళలో..

కేరళలోనూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 927మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 18,957కి చేరింది. వైరస్​ కారణంగా 59మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: ఆ నగరంలో 3వేల మంది కరోనా రోగులు మిస్సింగ్​

Last Updated : Jul 26, 2020, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.