ETV Bharat / bharat

కర్ణాటకీయం: కుమార 'పరీక్ష'కు ఎమ్మెల్యేల గైర్హాజరు?

రోజుకో పరిణామంతో ఉత్కంఠ రేపిన కర్ణాటక రాజకీయాలకు తెరపడేలా కనిపిస్తోంది. కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో.. వ్యవహారం విశ్వాస పరీక్షదాకా చేరుకుంది. ఈ నెల 18న విధానసభలో బల నిరూపణ చేసుకోనున్నారు కుమారస్వామి. అయితే ఈ కీలక ఘట్టానికి రెబల్​ ఎమ్మెల్యేలు గైర్హాజరు కానున్నారని సమాచారం.

author img

By

Published : Jul 16, 2019, 6:10 AM IST

Updated : Jul 16, 2019, 8:35 AM IST

కర్ణాటకీయం: కుమార 'పరీక్ష'కు ఎమ్మెల్యేల గైర్హాజరు?
కర్ణాటకీయం: కుమార 'పరీక్ష'కు ఎమ్మెల్యేల గైర్హాజరు?

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. అధికార కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో నెలకొన్న సంక్షోభం.. శాసనసభలో విశ్వాస పరీక్ష వరకూ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న బల నిరూపణ చేసుకోనున్నారు ముఖ్యమంత్రి కుమారస్వామి. అయితే ఈ విశ్వాస పరీక్షకు ముంబయిలో ఉన్న రెబల్​ ఎమ్మెల్యేలందరూ గైర్హాజరు అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రాజీనామాపై వెనక్కి తగ్గని నేతలందరూ.. వచ్చే గురువారం నాడు ముంబయి హోటల్​ గదికే పరిమితమవనున్నారని సమాచారం. ఒకవేళ అదే జరిగితే కన్నడ అసెంబ్లీలో.. కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి బలం 116 నుంచి 100కు పడిపోనుంది. ప్రతిపక్ష భాజపా అధికారం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కుర్చీ కుమారస్వామికి దూరమయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్​-జేడీఎస్​ నేతలు ఏం చేయనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మరోసారి బుజ్జగింపులు

కాంగ్రెస్​-జేడీఎస్​ ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకున్న తరుణంలో.. చివరిసారిగా రెబల్​ ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు చేయనున్నారు కూటమి సీనియర్​ నేతలు. మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు మరికొందరు సీనియర్​ నేతలు ముంబయికి వెళ్లి రెబల్​ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపే అవకాశముందని తెలుస్తోంది.

ఇదివరకే రెబల్​ ఎమ్మెల్యేలను పలుమార్లు బుజ్జగించినప్పటకీ ఫలించలేదు. ఈ తరుణంలో కీలకమైన విశ్వాస పరీక్షకు ముందు జరపాలని భావిస్తున్న మంతనాలు సఫలమయ్యేనో లేదో చూడాలి.

ఎవరితోనూ భేటీ వద్దు...

కాంగ్రెస్​ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని.. అందుకే మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్​తో పాటు ఎవరితోనూ భేటీ అవ్వాలనే ఆలోచనే లేదని ముంబయిలో ఉంటున్న రెబల్​ నేతలు ఇదివరకే పోలీసులకు లేఖ రాశారు.

గురువారం ఉదయం 11 గంటలకు...

సోమవారం కర్ణాటక శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు బీఏసీ సమావేశమైంది. ఈ భేటీలో బలపరీక్ష కోసం ఒత్తిడి తెచ్చింది భాజపా. సుప్రీం కోర్టు విచారణ తర్వాత.. నిర్ణయం తీసుకుందామని సభ్యులకు సూచించారు స్పీకర్​. అయితే.. ఎంతకూ తగ్గని కాషాయ పార్టీ.. అవిశ్వాస తీర్మాన నోటీసును స్పీకర్​కు అందించింది. చివరకు.. ఈ నెల 18న సీఎం విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు సభాపతి. అనంతరం.. కాంగ్రెస్​ శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య దీనిపై స్పష్టతనిచ్చారు. 18న ఉదయం 11 గంటలకు విశ్వాస పరీక్షపై చర్చ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

కర్ణాటకీయం: కుమార 'పరీక్ష'కు ఎమ్మెల్యేల గైర్హాజరు?

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. అధికార కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో నెలకొన్న సంక్షోభం.. శాసనసభలో విశ్వాస పరీక్ష వరకూ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న బల నిరూపణ చేసుకోనున్నారు ముఖ్యమంత్రి కుమారస్వామి. అయితే ఈ విశ్వాస పరీక్షకు ముంబయిలో ఉన్న రెబల్​ ఎమ్మెల్యేలందరూ గైర్హాజరు అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రాజీనామాపై వెనక్కి తగ్గని నేతలందరూ.. వచ్చే గురువారం నాడు ముంబయి హోటల్​ గదికే పరిమితమవనున్నారని సమాచారం. ఒకవేళ అదే జరిగితే కన్నడ అసెంబ్లీలో.. కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి బలం 116 నుంచి 100కు పడిపోనుంది. ప్రతిపక్ష భాజపా అధికారం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కుర్చీ కుమారస్వామికి దూరమయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్​-జేడీఎస్​ నేతలు ఏం చేయనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మరోసారి బుజ్జగింపులు

కాంగ్రెస్​-జేడీఎస్​ ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకున్న తరుణంలో.. చివరిసారిగా రెబల్​ ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు చేయనున్నారు కూటమి సీనియర్​ నేతలు. మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు మరికొందరు సీనియర్​ నేతలు ముంబయికి వెళ్లి రెబల్​ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపే అవకాశముందని తెలుస్తోంది.

ఇదివరకే రెబల్​ ఎమ్మెల్యేలను పలుమార్లు బుజ్జగించినప్పటకీ ఫలించలేదు. ఈ తరుణంలో కీలకమైన విశ్వాస పరీక్షకు ముందు జరపాలని భావిస్తున్న మంతనాలు సఫలమయ్యేనో లేదో చూడాలి.

ఎవరితోనూ భేటీ వద్దు...

కాంగ్రెస్​ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని.. అందుకే మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్​తో పాటు ఎవరితోనూ భేటీ అవ్వాలనే ఆలోచనే లేదని ముంబయిలో ఉంటున్న రెబల్​ నేతలు ఇదివరకే పోలీసులకు లేఖ రాశారు.

గురువారం ఉదయం 11 గంటలకు...

సోమవారం కర్ణాటక శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు బీఏసీ సమావేశమైంది. ఈ భేటీలో బలపరీక్ష కోసం ఒత్తిడి తెచ్చింది భాజపా. సుప్రీం కోర్టు విచారణ తర్వాత.. నిర్ణయం తీసుకుందామని సభ్యులకు సూచించారు స్పీకర్​. అయితే.. ఎంతకూ తగ్గని కాషాయ పార్టీ.. అవిశ్వాస తీర్మాన నోటీసును స్పీకర్​కు అందించింది. చివరకు.. ఈ నెల 18న సీఎం విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు సభాపతి. అనంతరం.. కాంగ్రెస్​ శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య దీనిపై స్పష్టతనిచ్చారు. 18న ఉదయం 11 గంటలకు విశ్వాస పరీక్షపై చర్చ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

AP Video Delivery Log - 2100 GMT News
Monday, 15 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2024: US Mnuchin Trump Tweets AP Clients Only 4220531
Mnuchin doesn't find Trump's tweets racist
AP-APTN-2021: Afghanistan Blast AP Clients Only 4220520
Roadside bomb in Afghanistan kills at least 11
AP-APTN-2017: US CA Australian Model Sentencing AP Clients Only 4220530
Australian model sentenced in flight crew assault
AP-APTN-2015: Iraq Palestinian PM AP Clients Only 4220529
Shtayyeh visits Iraq, meets Abdul-Mahdi
AP-APTN-2012: US Mnuchin Cryptocurrency AP Clients Only 4220528
US: Facebook currency plan ripe for illicit use
AP-APTN-2009: Bolivia Japanese Princess AP Clients Only 4220527
Princess Mako arrives in La Paz
AP-APTN-1956: Russia Protest AP Clients Only 4220525
Opposition protest over access to Moscow election
AP-APTN-1945: Serbia Macron Vucic AP Clients Only 4220524
Macron vows to help restart Serbia-Kosovo talks
AP-APTN-1938: US FL Immigration Democrats Must credit WSVN-TV; No access Miami market; No use US Broadcast networks; No re-sale, re-use or archive;AP Clients Only 4220522
Democrats visit migrant center, cite child trauma
AP-APTN-1933: UK Cricket May Part No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4220521
World Cup winning cricketers meet May
AP-APTN-1913: US MS Storm Flooding Must Credit WJTV, No Access Jackson and U.S Broadcast Networks, No Re-Sale, Re-Use or Archive 4220519
Barry causes flooding in Mississippi
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 16, 2019, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.