ETV Bharat / bharat

హైదరాబాద్ నుంచి డ్రగ్స్ రవాణా- 70 కిలోలు సీజ్ - hyderabadi supply drugs to indore

మధ్యప్రదేశ్​లో మాదకద్రవ్యాల రవాణా గుట్టురట్టు చేశారు పోలీసులు. రూ. 70 కోట్ల విలువైన డ్రగ్స్​ను పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇందోర్​కు వీటిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ ఫ్యాక్టరీ నెలకొల్పిన వ్యక్తి.. సరఫరా చేసినట్లు వెల్లడించారు. దక్షిణాఫ్రికాకు వీటిని పంపించాలని నిందితులు అనుకున్నారని స్పష్టం చేశారు.

Indore cop seize MDMA drugs from five accused
హైదరాబాద్ నుంచి డ్రగ్స్ రవాణా- 70 కిలోలు సీజ్
author img

By

Published : Jan 6, 2021, 9:26 PM IST

మధ్యప్రదేశ్​లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 70 కిలోల ఎండీఎంఏ(మిథైల్ ఎనిడియోక్సి మెథాంఫేటమిన్)ను ఇందోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్​లో ఈ డ్రగ్స్ విలువ రూ.70 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. దేశంలో భారీగా పట్టుబడ్డ మాదకద్రవ్యాల్లో ఇది ఒకటని వెల్లడించారు.

Indore cop seize MDMA drugs from five accused
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్​తో పోలీసులు

ఈ డ్రగ్స్​ను హైదరాబాద్ నుంచి ఇందోర్​కు తరలిస్తున్నారని ఇందోర్ అదనపు డీజీపీ యోగేశ్ దేశ్​ముఖ్ తెలిపారు. నిందితుల నుంచి రూ. 13 లక్షలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

"హైదరాబాద్​లో నివాసం ఉండే వేద్ ప్రకాశ్ వ్యాస్.. డ్రగ్స్​ డెలివరీ చేయడానికి తన డ్రైవర్​తో పాటు ఇందోర్​కు వచ్చాడు. క్రైమ్ బ్రాంచ్ అదనపు ఎస్పీ గురుప్రసాద్ పరాషార్​ వీరి గురించి సమాచారం అందుకున్నారు. వెంటనే స్పందించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు."

-యోగేశ్ దేశ్​ముఖ్, ఇందోర్ అదనపు డీజీపీ

ఇందోర్ నుంచి దక్షిణాఫ్రికాకు ఈ మాదకద్రవ్యాలను సరఫరా చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు దేశ్​ముఖ్ వెల్లడించారు.

డ్రగ్స్ సరఫరా చేసిన వ్యాస్.. ఇదివరకు ఓ ఫార్మా సంస్థలో పనిచేశాడని పోలీసులు తెలిపారు. ఇందోర్, ఉజ్జయిన్, మంద్​సౌర్​లో నివాసం ఉండేవాడని చెప్పారు. ఇటీవలే తెలంగాణలో ఔషధ ఫ్యాక్టరీ నెలకొల్పాడని.. ఎండీఎంఏ డ్రగ్​ను ఔషధాల తయారీలో ఉపయోగించకుండా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: లైవ్​లో ఆత్మహత్యాయత్నం.. పోలీసుల చాకచక్యం!

మధ్యప్రదేశ్​లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 70 కిలోల ఎండీఎంఏ(మిథైల్ ఎనిడియోక్సి మెథాంఫేటమిన్)ను ఇందోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్​లో ఈ డ్రగ్స్ విలువ రూ.70 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. దేశంలో భారీగా పట్టుబడ్డ మాదకద్రవ్యాల్లో ఇది ఒకటని వెల్లడించారు.

Indore cop seize MDMA drugs from five accused
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్​తో పోలీసులు

ఈ డ్రగ్స్​ను హైదరాబాద్ నుంచి ఇందోర్​కు తరలిస్తున్నారని ఇందోర్ అదనపు డీజీపీ యోగేశ్ దేశ్​ముఖ్ తెలిపారు. నిందితుల నుంచి రూ. 13 లక్షలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

"హైదరాబాద్​లో నివాసం ఉండే వేద్ ప్రకాశ్ వ్యాస్.. డ్రగ్స్​ డెలివరీ చేయడానికి తన డ్రైవర్​తో పాటు ఇందోర్​కు వచ్చాడు. క్రైమ్ బ్రాంచ్ అదనపు ఎస్పీ గురుప్రసాద్ పరాషార్​ వీరి గురించి సమాచారం అందుకున్నారు. వెంటనే స్పందించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు."

-యోగేశ్ దేశ్​ముఖ్, ఇందోర్ అదనపు డీజీపీ

ఇందోర్ నుంచి దక్షిణాఫ్రికాకు ఈ మాదకద్రవ్యాలను సరఫరా చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు దేశ్​ముఖ్ వెల్లడించారు.

డ్రగ్స్ సరఫరా చేసిన వ్యాస్.. ఇదివరకు ఓ ఫార్మా సంస్థలో పనిచేశాడని పోలీసులు తెలిపారు. ఇందోర్, ఉజ్జయిన్, మంద్​సౌర్​లో నివాసం ఉండేవాడని చెప్పారు. ఇటీవలే తెలంగాణలో ఔషధ ఫ్యాక్టరీ నెలకొల్పాడని.. ఎండీఎంఏ డ్రగ్​ను ఔషధాల తయారీలో ఉపయోగించకుండా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: లైవ్​లో ఆత్మహత్యాయత్నం.. పోలీసుల చాకచక్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.