ETV Bharat / bharat

రివ్యూ 2019: యుద్ధ వాకిట నుంచి శాంతి కూడలికి భారత్​-పాక్ - Indo-Pak ties in 2019: From brink of war to corridor of peace

భారత్​-పాకిస్థాన్​.. దాయాది దేశాలే అయినా ఈ రెండింటి మధ్య సఖ్యత అంతంతే. ఇందుకు చాలా కారణాలే ఉన్నప్పటికీ ముఖ్యంగా వినిపించేది మాత్రం పాకిస్థాన్​ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందన్న భారత్​ వాదన. 2019 ప్రారంభంలో జరిగిన పుల్వామా ఉగ్రదాడితో ఇరుదేశాల మధ్య సంబంధాలు ఒక్కసారిగా క్షీణించాయి. ఆ వెనువెంటనే జరిగిన పరిణామాలతో దాయాదుల మధ్య ఊహించని రీతిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి యుద్ధ పరిస్థితుల నుంచి శాంతియుత కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవం వరకు ఏడాది మొత్తం ప్రతికూల, అనుకూల పవనాలతో మమేకమై సాగిన భారత్-పాక్​ బంధం విశేషాలు మీకోసం..

Indo-Pak ties in 2019: From brink of war to corridor of peace
రివ్యూ 2019: యుద్ధమేఘాల నుంచి శాంతి కూడలికి భారత్​-పాక్
author img

By

Published : Dec 25, 2019, 4:58 PM IST

Updated : Dec 25, 2019, 6:54 PM IST

1965, 1971 ఈ ఏడాదులు చూస్తే.. గుర్తొచ్చేది భారత్​-పాక్ మధ్య జరిగిన యుద్ధాలు. 2019 కూడా వాటి సరసన చేరబోతోందా? అన్న సందేహాల నుంచి ఆర్టికల్​ 370 రద్దు, కుల్​భూషణ్​ జాదవ్​ కేసు, కర్తార్​పుర్​ నడవా ప్రారంభం వరకు ఈ ఏడాదిలో భారత్​-పాక్ మధ్య సాగిన మైత్రిని ఓసారి చూద్దాం.

మోదీకి ఇమ్రాన్​ శాంతి మంత్రం

2018 ఆగస్టులో పాక్ ప్రధానిగా ఇమ్రాన్​ఖాన్​ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్రధానిగా తొలి ప్రసంగంలోనే భారత్​తో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సరిహద్దు సహా ఇతర సమస్యలను చర్చలతో పరిష్కరించుకుందామని ప్రధాని మోదీకి స్నేహహస్తం అందించారు.

ముంచుకొచ్చిన యుద్ధమేఘాలు

ఇమ్రాన్​ఖాన్​ వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కాస్త మెరుగుపడొచ్చని అందరూ భావించారు. అయితే 2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్​ పుల్వామాలో పాక్​ ఆధారిత జైషే మహ్మద్​ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భారత సీఆర్పీఎఫ్​ జవాన్ల వాహనంపై దాడి చేశారు. ఈ ఘటనలో ఏకంగా 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థానీ​ ఉగ్ర సంస్థ దుశ్చర్యతో యావత్​ భారతం రగిలిపోయింది. పాక్​పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని దేశవ్యాప్తంగా చిన్నాపెద్ద తేడా లేకుండా భారతీయులంతా ప్రభుత్వాన్ని కోరారు.

భారత్​ ప్రతీకారం

సీఆర్పీఎఫ్​ జవాన్ల వీరమరణంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకున్నందున మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంది. ఫిబ్రవరి 26న భారత వాయుసేన దళాలు పాక్​ భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లి.. బాలాకోట్​లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. మన జవాన్లను బలిగొన్న వారి ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేశాయి. 1971 యుద్ధం తరువాత పాక్ భూభాగంలోకి భారత వాయుసేన విమానాలు ప్రవేశించడం ఇదే తొలిసారి.

యుద్ధ మేఘాలు

ఆ మరుసటి రోజే ఫిబ్రవరి 27న భారత్​-పాక్​ దేశాల వాయుసేనల మధ్య గగనతలంలో చిన్నపాటి యుద్ధం జరిగింది. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన పాక్ జెట్లను తరిమికొట్టే సమయంలో అనూహ్య రీతిలో వింగ్ కమాండర్​ అభినందన్ వర్ధమాన్​​ విమానం పాక్​ భూభాగంలో నేలకూలింది. గాయాల పాలైన వర్ధమాన్​ను పాక్​ సైనికులు బంధించారు.

భారత సైనికుడిని పాక్​ సేనలు బంధించినందున పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం భారత్​-పాక్​ వైపుకేసి చూసిన తరుణంలో.. దాయాది దేశాల మధ్య మరోమారు యుద్ధం తప్పదా? అన్న సందేహాలు చెలరేగాయి. అయితే అదే సమయంలో వర్ధమాన్​ అభినందన్​ను భారత్​కు తిరిగి అప్పగిస్తామని పాక్​ ప్రకటన చేసినందున.. యుద్ధ మేఘాలు కాస్త చల్లబడ్డాయి.

కర్తార్​పుర్​ చర్చలు

2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మరోసారి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో కర్తార్​పుర్​ నడవా నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న సమయంలో ఎన్నికల హామీలో భాగంగా జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370ని ఈ ఏడాది ఆగస్టులో రద్దు చేసింది మోదీ సర్కారు.

ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయంతో పాక్​ మరోమారు గుర్రుమంది. భారత్​తో ద్వైపాక్షిక సంబంధాలు ఉండవని తెగేసి చెప్పింది. పాక్​లోని భారత హై కమిషనర్​ను బహిష్కరించింది. భారత్​తో విమాన, రైల్వే, రోడ్డు మార్గాల సేవలను నిలిపివేసింది. ఈ పరిణామాల నడుమ కర్తార్​పుర్​ నడవా నిర్మాణం ఓ ప్రశ్నార్థకంగా మిగిలింది. కానీ, ఈ సందేహాలకు చెక్​ పెడుతూ అనుకున్న విధంగానే గురునానక్​ 550వ జయంతి సందర్భంగా ఈ ఏడాది నవంబరులో కర్తార్​పుర్​ నడవాను ఇరుదేశాలు వేర్వేరుగా ప్రారంభించాయి.

మరోమారు పాక్ వ్యతిరేక గళం

ఇటీవల పౌరసత్వ చట్టానికి మోదీ ప్రభుత్వం అంగీకారం తెలపడంపై పాక్​ అభ్యంతరం వ్యక్తం చేసింది. భాజపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో దక్షిణాసియాలో శరణార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందంటూ మోదీపై విమర్శనాస్త్రాలు సంధించింది. ఇదే ఏడాదిలోనే కుల్​భూషణ్​ జాదవ్​ కేసులో అంతర్జాతీయ కోర్టు సాక్షిగా భారత్​ దౌత్యపరమైన విజయం సాధించింది. ఇలా 2019వ ఏడాదిలో భారత్-పాకిస్థాన్​ దేశాల మైత్రి ఓసారి బలపడుతూ ఇంకోసారి క్షీణిస్తూ ఎవరి అంచనాలకు అందకుండా సాగింది.

ఇదీ చూడండి : తాగిన మత్తులో నాగుపాముకు ముద్దు ఇచ్చాడు.. తర్వాత ఏమైంది?

1965, 1971 ఈ ఏడాదులు చూస్తే.. గుర్తొచ్చేది భారత్​-పాక్ మధ్య జరిగిన యుద్ధాలు. 2019 కూడా వాటి సరసన చేరబోతోందా? అన్న సందేహాల నుంచి ఆర్టికల్​ 370 రద్దు, కుల్​భూషణ్​ జాదవ్​ కేసు, కర్తార్​పుర్​ నడవా ప్రారంభం వరకు ఈ ఏడాదిలో భారత్​-పాక్ మధ్య సాగిన మైత్రిని ఓసారి చూద్దాం.

మోదీకి ఇమ్రాన్​ శాంతి మంత్రం

2018 ఆగస్టులో పాక్ ప్రధానిగా ఇమ్రాన్​ఖాన్​ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్రధానిగా తొలి ప్రసంగంలోనే భారత్​తో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సరిహద్దు సహా ఇతర సమస్యలను చర్చలతో పరిష్కరించుకుందామని ప్రధాని మోదీకి స్నేహహస్తం అందించారు.

ముంచుకొచ్చిన యుద్ధమేఘాలు

ఇమ్రాన్​ఖాన్​ వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కాస్త మెరుగుపడొచ్చని అందరూ భావించారు. అయితే 2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్​ పుల్వామాలో పాక్​ ఆధారిత జైషే మహ్మద్​ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భారత సీఆర్పీఎఫ్​ జవాన్ల వాహనంపై దాడి చేశారు. ఈ ఘటనలో ఏకంగా 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థానీ​ ఉగ్ర సంస్థ దుశ్చర్యతో యావత్​ భారతం రగిలిపోయింది. పాక్​పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని దేశవ్యాప్తంగా చిన్నాపెద్ద తేడా లేకుండా భారతీయులంతా ప్రభుత్వాన్ని కోరారు.

భారత్​ ప్రతీకారం

సీఆర్పీఎఫ్​ జవాన్ల వీరమరణంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకున్నందున మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంది. ఫిబ్రవరి 26న భారత వాయుసేన దళాలు పాక్​ భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లి.. బాలాకోట్​లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. మన జవాన్లను బలిగొన్న వారి ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేశాయి. 1971 యుద్ధం తరువాత పాక్ భూభాగంలోకి భారత వాయుసేన విమానాలు ప్రవేశించడం ఇదే తొలిసారి.

యుద్ధ మేఘాలు

ఆ మరుసటి రోజే ఫిబ్రవరి 27న భారత్​-పాక్​ దేశాల వాయుసేనల మధ్య గగనతలంలో చిన్నపాటి యుద్ధం జరిగింది. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన పాక్ జెట్లను తరిమికొట్టే సమయంలో అనూహ్య రీతిలో వింగ్ కమాండర్​ అభినందన్ వర్ధమాన్​​ విమానం పాక్​ భూభాగంలో నేలకూలింది. గాయాల పాలైన వర్ధమాన్​ను పాక్​ సైనికులు బంధించారు.

భారత సైనికుడిని పాక్​ సేనలు బంధించినందున పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం భారత్​-పాక్​ వైపుకేసి చూసిన తరుణంలో.. దాయాది దేశాల మధ్య మరోమారు యుద్ధం తప్పదా? అన్న సందేహాలు చెలరేగాయి. అయితే అదే సమయంలో వర్ధమాన్​ అభినందన్​ను భారత్​కు తిరిగి అప్పగిస్తామని పాక్​ ప్రకటన చేసినందున.. యుద్ధ మేఘాలు కాస్త చల్లబడ్డాయి.

కర్తార్​పుర్​ చర్చలు

2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మరోసారి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో కర్తార్​పుర్​ నడవా నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న సమయంలో ఎన్నికల హామీలో భాగంగా జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370ని ఈ ఏడాది ఆగస్టులో రద్దు చేసింది మోదీ సర్కారు.

ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయంతో పాక్​ మరోమారు గుర్రుమంది. భారత్​తో ద్వైపాక్షిక సంబంధాలు ఉండవని తెగేసి చెప్పింది. పాక్​లోని భారత హై కమిషనర్​ను బహిష్కరించింది. భారత్​తో విమాన, రైల్వే, రోడ్డు మార్గాల సేవలను నిలిపివేసింది. ఈ పరిణామాల నడుమ కర్తార్​పుర్​ నడవా నిర్మాణం ఓ ప్రశ్నార్థకంగా మిగిలింది. కానీ, ఈ సందేహాలకు చెక్​ పెడుతూ అనుకున్న విధంగానే గురునానక్​ 550వ జయంతి సందర్భంగా ఈ ఏడాది నవంబరులో కర్తార్​పుర్​ నడవాను ఇరుదేశాలు వేర్వేరుగా ప్రారంభించాయి.

మరోమారు పాక్ వ్యతిరేక గళం

ఇటీవల పౌరసత్వ చట్టానికి మోదీ ప్రభుత్వం అంగీకారం తెలపడంపై పాక్​ అభ్యంతరం వ్యక్తం చేసింది. భాజపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో దక్షిణాసియాలో శరణార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందంటూ మోదీపై విమర్శనాస్త్రాలు సంధించింది. ఇదే ఏడాదిలోనే కుల్​భూషణ్​ జాదవ్​ కేసులో అంతర్జాతీయ కోర్టు సాక్షిగా భారత్​ దౌత్యపరమైన విజయం సాధించింది. ఇలా 2019వ ఏడాదిలో భారత్-పాకిస్థాన్​ దేశాల మైత్రి ఓసారి బలపడుతూ ఇంకోసారి క్షీణిస్తూ ఎవరి అంచనాలకు అందకుండా సాగింది.

ఇదీ చూడండి : తాగిన మత్తులో నాగుపాముకు ముద్దు ఇచ్చాడు.. తర్వాత ఏమైంది?

AP Video Delivery Log - 1800 GMT News
Tuesday, 24 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1745: US Trump Remarks AP Clients Only 4246236
Trump lashes out as impeachment trial is in limbo
AP-APTN-1728: US WI Dog Ice Rescue Must credit Argyle Adams Fire Department 4246234
Firefighters slide on the ice to rescue trapped dog
AP-APTN-1720: Venezuela Attack AP Clients Only 4246233
Maduro asks Brazil to arrest alleged military attackers
AP-APTN-1714: Space ISS Santa AP Clients Only 4246232
ISS astronauts track Santa around the world
AP-APTN-1705: Colombia Conflictive Peace AP Clients Only 4246231
Discord in Colombia over how to remember conflict
AP-APTN-1644: Brazil Landslide No access Brazil; Must credit TV Record 4246229
Brazil landslide kills seven gathered for Christmas
AP-APTN-1623: Hong Kong Tension AP Clients Only 4246228
HK protests continue into night on Christmas Eve
AP-APTN-1611: UK Royals Pudding AP Clients Only 4246226
Queen and her heirs bake festive treats together
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 25, 2019, 6:54 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.