దిల్లీ శాసనసభ ఎన్నికలను ఉద్దేశించి ట్విట్టర్లో వివాదాస్పద పోస్ట్ చేసిన భాజపా నేత కపిల్ మిశ్రాపై చర్యలకు ఉపక్రమించింది ఎన్నికల సంఘం. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు భాజపా నేతపై కేసు నమోదు చేశారు దిల్లీ పోలీసులు. అదే సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాలతో కపిల్ పోస్ట్ను తొలగించింది ట్విట్టర్. కపిల్ ట్వీట్పై వివరణ ఇవ్వాలని కోరుతూ అంతకుముందు షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఎన్నికల అధికారులు.
"వివాదాస్పద ట్విట్టర్ పోస్ట్ అంశమై కపిల్ మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోలీసులను ఆదేశించారు."
-దిల్లీ ముఖ్య ఎన్నికల నిర్వహణాధికారి
ఫిబ్రవరి 8న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఆ రోజున వీధుల్లో భారత్, పాకిస్థాన్ పోటీ పడతాయని ట్వీట్ చేశారు మిశ్రా. ఆయన చేసిన ట్విట్టర్ పోస్ట్ రాజకీయ దుమారం రేపింది.
ఇదీ చూడండి: దిల్లీ దంగల్: భాజపా నేత వివాదాస్పద ట్వీట్.. ఈసీ నోటీసులు