ETV Bharat / bharat

రోదసిపై సొంత అంతరిక్ష కేంద్రం: ఇస్రో

చంద్రయాన్​-2 ప్రయోగ తేదీని ప్రకటించిన భారత అంతరిక్ష కేంద్రం ఇస్రో.. మరిన్ని కీలక ప్రాజెక్టులకు సంకల్పించింది. రోదసిపై భారత్​ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు ఇస్రో ఛైర్మన్​ కె. శివన్​. అంతరిక్షంపైకి మనిషిని పంపే ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​.

author img

By

Published : Jun 13, 2019, 5:24 PM IST

Updated : Jun 13, 2019, 7:43 PM IST

రోదసిపై సొంత అంతరిక్ష కేంద్రం: ఇస్రో
రోదసిపై సొంత అంతరిక్ష కేంద్రం: ఇస్రో

భారత అంతరిక్ష కేంద్రం ఇస్రో.. త్వరలో కీలక ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చంద్రయాన్​-2 ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. జులై 15న అంతరిక్షంలోకి స్పేస్​క్రాఫ్ట్​(వాహక నౌక)ను పంపనుంది ఇస్రో.

రోదసిలో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఇస్రో. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో ఛైర్మన్​ కె.శివన్ విలేకరులకు వెల్లడించారు. ప్రతిష్టాత్మక గగన్​యాన్​ ప్రాజెక్టుకు కొనసాగింపుగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.

జులై 15న ప్రయోగించనున్న చంద్రయాన్​-2 ప్రాజెక్టు.. చంద్రయాన్​-1కు కొనసాగింపు అని అణుశక్తి, అంతరిక్ష శాఖ కేంద్ర సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ తెలిపారు. సెప్టెంబర్​లో లక్ష్యాన్ని చేరుతుందని వెల్లడించారు.

ఇదీ చూడండి: ఏఎన్​-32 విమానంలో గల్లంతైన వారంతా మృతి

రోదసిపై తొలి మనిషిని పంపే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఇస్రో నాంది పలకనున్నట్లు ప్రకటించారు జితేంద్ర సింగ్​. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నట్లు పేర్కొన్న ఆయన.. దీని కోసం రూ. 10 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.

''2022లో భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని.. అంతరిక్షంపైకి ఇస్రో తొలి మనిషిని పంపే కార్యక్రమం చేపట్టనుంది. 2022కు ముందు లేదా.. ఆ సంవత్సరంలోనే ప్రయోగం నిర్వహించే అవకాశముంది. ఈ ప్రాజెక్టులో ఇద్దరు లేదా ముగ్గురు వ్యోమగాములు ఉంటారు. దీని పర్యవేక్షణ కోసం.. ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నాం. గగన్​యాన్​ జాతీయ సలహా మండలి విభాగం ఈ కార్యక్రమం ప్రణాళిక, ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. ''

- జితేంద్ర సింగ్​, అణు శక్తి, అంతరిక్ష శాఖ కేంద్ర సహాయ మంత్రి

రోదసిపై సొంత అంతరిక్ష కేంద్రం: ఇస్రో

భారత అంతరిక్ష కేంద్రం ఇస్రో.. త్వరలో కీలక ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చంద్రయాన్​-2 ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. జులై 15న అంతరిక్షంలోకి స్పేస్​క్రాఫ్ట్​(వాహక నౌక)ను పంపనుంది ఇస్రో.

రోదసిలో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఇస్రో. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో ఛైర్మన్​ కె.శివన్ విలేకరులకు వెల్లడించారు. ప్రతిష్టాత్మక గగన్​యాన్​ ప్రాజెక్టుకు కొనసాగింపుగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.

జులై 15న ప్రయోగించనున్న చంద్రయాన్​-2 ప్రాజెక్టు.. చంద్రయాన్​-1కు కొనసాగింపు అని అణుశక్తి, అంతరిక్ష శాఖ కేంద్ర సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ తెలిపారు. సెప్టెంబర్​లో లక్ష్యాన్ని చేరుతుందని వెల్లడించారు.

ఇదీ చూడండి: ఏఎన్​-32 విమానంలో గల్లంతైన వారంతా మృతి

రోదసిపై తొలి మనిషిని పంపే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఇస్రో నాంది పలకనున్నట్లు ప్రకటించారు జితేంద్ర సింగ్​. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నట్లు పేర్కొన్న ఆయన.. దీని కోసం రూ. 10 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.

''2022లో భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని.. అంతరిక్షంపైకి ఇస్రో తొలి మనిషిని పంపే కార్యక్రమం చేపట్టనుంది. 2022కు ముందు లేదా.. ఆ సంవత్సరంలోనే ప్రయోగం నిర్వహించే అవకాశముంది. ఈ ప్రాజెక్టులో ఇద్దరు లేదా ముగ్గురు వ్యోమగాములు ఉంటారు. దీని పర్యవేక్షణ కోసం.. ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నాం. గగన్​యాన్​ జాతీయ సలహా మండలి విభాగం ఈ కార్యక్రమం ప్రణాళిక, ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. ''

- జితేంద్ర సింగ్​, అణు శక్తి, అంతరిక్ష శాఖ కేంద్ర సహాయ మంత్రి


Gandhinagar (Gujarat), June 13 (ANI): While addressing a press conference on Cyclone Vayu in Gujarat's Gandhinagar, Gujarat Chief Minister Vijay Rupani said, "More than 2.75 Lakh people have been evacuated. All sea-related activities have been stopped. All departments are on alert. Senior Ministers and Senior Secretaries have been sent to control rooms of district administration, they are monitoring situation. Planning had been done in advance." "Around 47 troops of NDRF have reached Gujarat, 5-6 more teams will reach by morning. Indian Army, Air Force, Navy, Coast Guard have taken their positions. State Disaster Management is at work. Police patrolling will be done throughout the night so that no one is left in the lower regions," Rupani added.
Last Updated : Jun 13, 2019, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.